Political News

డేటా ఎనలైటిక్స్ కు ఇక విశాఖనే కేంద్రం!

ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. గతంలో మాదిరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఏ రీతిన అయితే సత్తా చాటిందో… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చోటుచేసుకున్న ఈ మార్పును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా అందిపుచ్చుకున్నారనే చెప్పాలి. అంతేనా… అందరి కంటే కూడా ఈ విషయంలో చంద్రబాబే ముందు వరుసలో ఉన్నారని కూడా చెప్పాలి. నూతనంగా ఆవిష్కృతం అవుతున్న రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ ఆధారిత సాంకేతికత, డేటా అనలైటిక్స్. ఏఐ సెంట్రిక్ ఆక్యూరసీలను కూడా అందిపుచ్చుకునే దిశగా చంద్రబాబు సాగుతున్నారు.

సోమవారం అమరావతి పరిధిలోని వేలూరు ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (విట్ ఏపీ)లో నూతనంగా ఏర్పాటైన భవనాలను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతితో పాటుగా విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విశాఖకు త్వరలోనే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ రాబోతోందని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేస్తామన్న చంద్రబాబు… గూగుల్ విశాఖలో అడుగుపెడితే… జరిగే పరిణామాలను ఆయన అలా చూచాయగా వెల్లడించారు. డేటా ఎనలైటిక్స్ లో ప్రపంచానికే విశాఖ కేంద్రంగా మారబోతోందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఏఐ అక్యూరసీతో ఈ డేటా ఎనలైటిక్స్ ఉండబోతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇదేదో ఇప్పుడే మొదలైన పరిణామం కానే కాదని చెప్పాలి. భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చినంతనే గుర్తించారు. ఆ వెంటనే ఆయన ఏఐపైనా, ఏఐ ఆధారిత కంపెనీలను ఏపీకి రాబట్టే దిశగా ఇదివరకే కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని కూడా చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నామధ్య అమెరికా పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్… గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్, టెస్లా, అబోడ్ వంటి కీలక సంస్థల కార్యాలయాలను సందర్శించారు. తమ డేటా సెంటర్లను ఏపీలో ప్రత్యేకించి విశాఖలో ఏర్పాటు చేయడానికి గల అనుకూలతలు, అవకాశాలను ఆయన ఆయా కంపెనీలకు వివరించారు. ఆయా కంపెనీల్లో ఏపీ పట్ల ఆసక్తిని కూడా పెంచి తిరిగి వచ్చారు.

ఆ తర్వాత ఆయా కంపెనీలతో కూటమి సర్కారు నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అందులో భాగంగా గూగుల్ ప్రతినిధి బృందం ఇటీవలే ఏపీలో పర్యటించింది. విశాఖతో పాటు అమరావతిని ఆ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. తమ కంపెనీ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లకు విశాఖ అనుకూలంగా ఉన్నట్లుగా కూడా వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ నుంచి తాజాగా ప్రభుత్వానికి ఓ మంచి వార్త అందినట్టుగా సమాచారం. ఈ వార్తను బేస్ చేసుకునే చంద్రబాబు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. బాబు చెప్పినట్టుగా గూగుల్ విశాఖలో అడుగుపెడితే… ఇతర కంపెనీలు కూడా విశాఖకు క్యూ కట్టడం ఖాయమని… వెరసి డేలా ఎనలైటిక్స్ కు విశాఖ కేంద్రంగా మారనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 28, 2025 4:17 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

3 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

8 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

12 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

14 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

14 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

15 hours ago