Political News

డేటా ఎనలైటిక్స్ కు ఇక విశాఖనే కేంద్రం!

ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. గతంలో మాదిరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఏ రీతిన అయితే సత్తా చాటిందో… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చోటుచేసుకున్న ఈ మార్పును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా అందిపుచ్చుకున్నారనే చెప్పాలి. అంతేనా… అందరి కంటే కూడా ఈ విషయంలో చంద్రబాబే ముందు వరుసలో ఉన్నారని కూడా చెప్పాలి. నూతనంగా ఆవిష్కృతం అవుతున్న రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ ఆధారిత సాంకేతికత, డేటా అనలైటిక్స్. ఏఐ సెంట్రిక్ ఆక్యూరసీలను కూడా అందిపుచ్చుకునే దిశగా చంద్రబాబు సాగుతున్నారు.

సోమవారం అమరావతి పరిధిలోని వేలూరు ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (విట్ ఏపీ)లో నూతనంగా ఏర్పాటైన భవనాలను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతితో పాటుగా విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విశాఖకు త్వరలోనే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ రాబోతోందని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేస్తామన్న చంద్రబాబు… గూగుల్ విశాఖలో అడుగుపెడితే… జరిగే పరిణామాలను ఆయన అలా చూచాయగా వెల్లడించారు. డేటా ఎనలైటిక్స్ లో ప్రపంచానికే విశాఖ కేంద్రంగా మారబోతోందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఏఐ అక్యూరసీతో ఈ డేటా ఎనలైటిక్స్ ఉండబోతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇదేదో ఇప్పుడే మొదలైన పరిణామం కానే కాదని చెప్పాలి. భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చినంతనే గుర్తించారు. ఆ వెంటనే ఆయన ఏఐపైనా, ఏఐ ఆధారిత కంపెనీలను ఏపీకి రాబట్టే దిశగా ఇదివరకే కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని కూడా చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నామధ్య అమెరికా పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్… గూగుల్ తో పాటు మైక్రోసాఫ్ట్, టెస్లా, అబోడ్ వంటి కీలక సంస్థల కార్యాలయాలను సందర్శించారు. తమ డేటా సెంటర్లను ఏపీలో ప్రత్యేకించి విశాఖలో ఏర్పాటు చేయడానికి గల అనుకూలతలు, అవకాశాలను ఆయన ఆయా కంపెనీలకు వివరించారు. ఆయా కంపెనీల్లో ఏపీ పట్ల ఆసక్తిని కూడా పెంచి తిరిగి వచ్చారు.

ఆ తర్వాత ఆయా కంపెనీలతో కూటమి సర్కారు నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అందులో భాగంగా గూగుల్ ప్రతినిధి బృందం ఇటీవలే ఏపీలో పర్యటించింది. విశాఖతో పాటు అమరావతిని ఆ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. తమ కంపెనీ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లకు విశాఖ అనుకూలంగా ఉన్నట్లుగా కూడా వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ నుంచి తాజాగా ప్రభుత్వానికి ఓ మంచి వార్త అందినట్టుగా సమాచారం. ఈ వార్తను బేస్ చేసుకునే చంద్రబాబు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. బాబు చెప్పినట్టుగా గూగుల్ విశాఖలో అడుగుపెడితే… ఇతర కంపెనీలు కూడా విశాఖకు క్యూ కట్టడం ఖాయమని… వెరసి డేలా ఎనలైటిక్స్ కు విశాఖ కేంద్రంగా మారనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

7 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

7 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

9 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

11 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

12 hours ago