Political News

300 కోట్ల‌కు బురిడీ కొట్టించిన వైసీపీ బుట్టా..

వైసీపీ నాయ‌కురాలు, క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక‌.. ఓ ఆర్థిక సంస్థ‌ను బురిడీ కొట్టించారు. 310 కోట్ల రూపాయల‌ను అప్పుగా తీసుకున్న ఆమె.. దీనిల కేవ‌లం 40 కోట్లు మాత్ర‌మే చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లింపు విష‌యంలో జాప్యం చేయ‌డంతోపాటు.. స‌ద‌రు రుణ సంస్థ‌ను ముప్పు తిప్ప‌లు పెట్టారు. దీంతో ఆస్తుల వేలం ప్ర‌క్రియ వ‌ర‌కు .. విష‌యం వ‌చ్చేసింది. అయితే.. వెనుక వైసీపీ జెండా ఉండ‌డంతో స‌ద‌రు ఆస్తుల‌ను వేలంలో ద‌క్కించుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

వైసీపీ నాయకురాలైన బుట్టా రేణుక‌, ఆమె భ‌ర్త నీల‌కంఠం.. వ్యాపార వేత్త‌లు. హైద‌రాబాద్‌, క‌ర్నూలులో వారికి విద్యాసంస్థ‌లు ఉన్నాయి. వీటితోపాటు.. స్పిన్నింగ్ మిల్లులు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో సంస్థ‌ను కూడా ఏర్పాటు చేశారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థ‌ను స్థాపించి.. దీనికిగాను.. ఎల్ఐసీ అనుబంధ రుణ సంస్థ హెచ్ ఎఫ్ ఎల్ నుంచి ఆరేళ్ల కింద‌ట(బుట్టా ఎంపీగా ఉన్న స‌మ‌యంలో) 310 కోట్లు రుణంగా తీసుకున్నారు.

అయితే.. ఈ సొమ్మును అస‌లు సంస్థ‌తో పాటు.. ఇత‌ర సంస్థ‌ల‌కు కూడా స‌ర్దుబాటు చేశారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో పాటు.. ఇత‌ర కార‌ణాల‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌తో వ్యాపారాలు దెబ్బ‌తిని.. అప్పులు ఎగ్గొట్ట‌డం ప్రారంభించిన‌ట్టు ఆర్థిక సంస్థ హెచ్ ఎఫ్ ఎల్ పేర్కొంది. ప‌లు మార్లు అవ‌కాశం ఇచ్చినా.. ప‌ట్టించుకోలేదు. దీంతో ఏడాది కింద‌టే.. నేష‌న‌ల్ లా ట్రైబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించి.. ఆస్తులు వేలం వేసుకునేందుకు అనుమ‌తి తెచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలో బంజారాహిల్స్‌, మాదాపూర్‌ల‌లోని బుట్టా ఫ్యామిలీకి ఉన్న ఆస్తుల‌ను ఇప్ప‌టికే ఒక‌సారి వేలం వేయ‌గా.. ఎవ‌రూ ముందుకు రాలేదు. తాజాగా మ‌రోసారి వేలం ప్ర‌క‌ట‌న ఇచ్చారు. మ‌రి దీనికైనా స్పంద‌న ల‌భిస్తుందో లేదో చూడాలి. ఇదిలావుంటే.. వైసీపీ నేప‌థ్యం ఉన్న కార‌ణంగానే బుట్టా ఆస్తుల‌ను కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని స‌మాచారం. కాగా.. ఇప్పుడు వ‌డ్డీతో స‌హా బుట్టా రూ.340 కోట్ల వ‌ర‌కు ఆర్థిక సంస్థ‌కు చెల్లించాల్సి ఉంది.

This post was last modified on April 26, 2025 4:24 pm

Share
Show comments
Published by
Satya
Tags: Butta renuka

Recent Posts

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

49 minutes ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

2 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

2 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

5 hours ago