వైసీపీ నాయకురాలు, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. ఓ ఆర్థిక సంస్థను బురిడీ కొట్టించారు. 310 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్న ఆమె.. దీనిల కేవలం 40 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లింపు విషయంలో జాప్యం చేయడంతోపాటు.. సదరు రుణ సంస్థను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆస్తుల వేలం ప్రక్రియ వరకు .. విషయం వచ్చేసింది. అయితే.. వెనుక వైసీపీ జెండా ఉండడంతో సదరు ఆస్తులను వేలంలో దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఏం జరిగింది?
వైసీపీ నాయకురాలైన బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం.. వ్యాపార వేత్తలు. హైదరాబాద్, కర్నూలులో వారికి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటితోపాటు.. స్పిన్నింగ్ మిల్లులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరో సంస్థను కూడా ఏర్పాటు చేశారు. బుట్టా ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను స్థాపించి.. దీనికిగాను.. ఎల్ఐసీ అనుబంధ రుణ సంస్థ హెచ్ ఎఫ్ ఎల్ నుంచి ఆరేళ్ల కిందట(బుట్టా ఎంపీగా ఉన్న సమయంలో) 310 కోట్లు రుణంగా తీసుకున్నారు.
అయితే.. ఈ సొమ్మును అసలు సంస్థతో పాటు.. ఇతర సంస్థలకు కూడా సర్దుబాటు చేశారు. ఇక, 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో పాటు.. ఇతర కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాలతో వ్యాపారాలు దెబ్బతిని.. అప్పులు ఎగ్గొట్టడం ప్రారంభించినట్టు ఆర్థిక సంస్థ హెచ్ ఎఫ్ ఎల్ పేర్కొంది. పలు మార్లు అవకాశం ఇచ్చినా.. పట్టించుకోలేదు. దీంతో ఏడాది కిందటే.. నేషనల్ లా ట్రైబ్యునల్ను ఆశ్రయించి.. ఆస్తులు వేలం వేసుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో బంజారాహిల్స్, మాదాపూర్లలోని బుట్టా ఫ్యామిలీకి ఉన్న ఆస్తులను ఇప్పటికే ఒకసారి వేలం వేయగా.. ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా మరోసారి వేలం ప్రకటన ఇచ్చారు. మరి దీనికైనా స్పందన లభిస్తుందో లేదో చూడాలి. ఇదిలావుంటే.. వైసీపీ నేపథ్యం ఉన్న కారణంగానే బుట్టా ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. కాగా.. ఇప్పుడు వడ్డీతో సహా బుట్టా రూ.340 కోట్ల వరకు ఆర్థిక సంస్థకు చెల్లించాల్సి ఉంది.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…