Political News

ఎవరి ‘సజ్జల’ శ్రీధర్ రెడ్డి..? లిక్కర్ కేసులో అరెస్ట్!

ఏపీలో పెను కలకలమే రేపుతున్నమద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. శనివారం సాయంత్రానికి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కసిరెడ్డి తోడల్లుడు చాణక్య ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే… ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు కాదు. కడప జిల్లా పులివెందుల పరిధిలోని తొండూరు  మండలం తుమ్మలపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డికి రామకృష్ణారెడ్డితో చుట్టరికం ఉన్నా.. అంత దగ్గర బంధువు కాదు. నంద్యాల నుంచి ఓ దఫా ఎంపీగా కొనసాగిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నంది పైపుల అధినేత ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్న శ్రీధర్ రెడ్డి… నంద్యాల కేంద్రంగా వ్యాపారం గానీ, రాజకీయం గానీ చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేత అయిన శ్రీధర్ రెడ్డి… వైసీపీ అదినేత జగన్ తో ఒకింత చనువుగానే సాగుతున్నారు. 

ఎస్పీవై రెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత పులివెందులను వీడి తన మకాంను నంద్యాలకు మార్చేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి… మామ గారి వ్యాపారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా తన సతీమణి సుజలతో కలిసి ఎస్పీవై రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కూడా తీసుకున్నారు. 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన శ్రీధర్ రెడ్డి.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేనలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. ఇక 2019లో జగన్ అధికారంలోకి రావడంతోనే జనసేనను వీడి జగన్ పంచన చేశారు. పులివెందుల నేటివిటీ, ఇంటిపేరు సజ్జలను చూపిన ఆయన అనతి కాలంలోనే జగన్ కోటరీలోకి ఈజీగానే చేరగలిగారు.

ఇక జగన్ జమానాలో జే బ్రాండ్లుగా ముద్ర పడిన మద్యం బ్రాండ్లన్నీ కూడా నంద్యాల పరిధిలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రంగానే తయారయ్యాయి. ఆయా కంపెనీలకు చెందిన బ్రాండ్ల మద్యాన్ని సేకరించిన లిక్కర్ ముఠా సభ్యులు… దానిని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లోనే తనదైన ప్రమాణాల మేరకు నాణ్యతను మార్చివేసింది. వెరసి.. మద్యం కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కీలక కేంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా మద్యం పాలసీ రూపకల్పన, ఆయా బ్రాండ్ల ఎంపిక, ఆయా కంపెనీల నుంచి ముడుపుల ఖరారు, వాటి స్వీకరణ, వాటిని గమ్యస్థానం చేర్చడం వంటి కార్యకలాపాలు అన్నింటిలోనూ శ్రీధర్ రెడ్డి కీలక భూమిక పోషించారు. వెరసి రాజ్ కసిరెడ్డికి ఈ దందాలో ఏ మేర పాత్ర ఉందో… శ్రీధర్ రెడ్డికి కూడా అంతే పాత్ర ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 26, 2025 10:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

39 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

1 hour ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

2 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

3 hours ago