Political News

ఈ సారి వారి కోసం క‌దిలిన‌.. నారా భువ‌నేశ్వ‌రి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. స్వచ్ఛంద కార్య‌క్ర‌మాల‌లో దూకుడుగా ఉంటున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయంగా కూడా స‌త్తా నిరూపించుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ప్ర‌జా సేవ‌లో త‌న‌దైన కోణాన్ని ఆవిష్క‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో విజ‌య‌వాడ‌లో కేన్స‌ర్ బాధితుల కోసం.. త‌మ‌న్‌తో క‌లిసి.. మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ నిర్వ‌హించారు. దీని ద్వారా వ‌చ్చిన సొమ్మును కేన్స‌ర్ రోగుల చికిత్స‌.. వారికి సాయం కోసం వినియోగించారు. ఇప్పుడు మ‌రో గురుత‌ర బాధ్య‌త‌ను నారా భువ‌నేశ్వ‌రి భుజాన వేసుకున్నారు.

అదే.. త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డే రోగుల‌ను ఆదుకునేందుకు ఆమె న‌డుం బిగించారు. ఈ క్ర‌మంలో  మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3 కిలో మీట‌ర్లు, 5 కిలో మీట‌ర్లు, 10కిలో మీట‌ర్లు ప‌రుగును నిర్వహించనున్నారు. ఈ మేర‌కు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా కూడా ఉన్న‌ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో శుక్ర‌వారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. “ఓ గొప్ప లక్ష్యం కోసం ఈ రన్‌ను నిర్వహిస్తున్నాం ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం. రండి ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కండి“ అని ఆమె కోరారు.

ర‌క్తదానాన్ని ప్రోత్స‌హించే ఉద్దేశంతోనే.. ఈ ప‌రుగును చేప‌డుతున్న‌ట్టు నారా భువ‌నేశ్వ‌రి చెప్పారు. త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డేవారికి ర‌క్త మార్పిడి అవ‌స‌ర‌మ‌ని.. ఈ రోగుల‌కు ప్ర‌తి నెలా ఒక్క‌సారి ర‌క్తం మార్చాల‌ని వైద్యులు చెబుతున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ర‌క్త దాత‌ల‌ను మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు.. ఈ ర‌న్‌ను చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ నాలుగు మాసాల‌కు ఒక్క‌సారి ర‌క్త‌దానం చేయాల‌ని.. త‌ద్వారా వేలాది మంది త‌ల‌సేమియా వ్యాధి గ్ర‌స్థుల‌కు జీవితం ప్ర‌సాదించిన‌ట్టు అవుతుంద‌ని పేర్కొన్నారు. 

This post was last modified on April 25, 2025 8:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

46 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

48 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago