ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయంగా కూడా సత్తా నిరూపించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ప్రజా సేవలో తనదైన కోణాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో గత నెలలో విజయవాడలో కేన్సర్ బాధితుల కోసం.. తమన్తో కలిసి.. మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించారు. దీని ద్వారా వచ్చిన సొమ్మును కేన్సర్ రోగుల చికిత్స.. వారికి సాయం కోసం వినియోగించారు. ఇప్పుడు మరో గురుతర బాధ్యతను నారా భువనేశ్వరి భుజాన వేసుకున్నారు.
అదే.. తలసేమియా వ్యాధితో బాధపడే రోగులను ఆదుకునేందుకు ఆమె నడుం బిగించారు. ఈ క్రమంలో మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 3 కిలో మీటర్లు, 5 కిలో మీటర్లు, 10కిలో మీటర్లు పరుగును నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉన్న నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. “ఓ గొప్ప లక్ష్యం కోసం ఈ రన్ను నిర్వహిస్తున్నాం ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం. రండి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి“ అని ఆమె కోరారు.
రక్తదానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే.. ఈ పరుగును చేపడుతున్నట్టు నారా భువనేశ్వరి చెప్పారు. తలసేమియా వ్యాధితో బాధపడేవారికి రక్త మార్పిడి అవసరమని.. ఈ రోగులకు ప్రతి నెలా ఒక్కసారి రక్తం మార్చాలని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో రక్త దాతలను మరింతగా ప్రోత్సహించేందుకు.. ఈ రన్ను చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నాలుగు మాసాలకు ఒక్కసారి రక్తదానం చేయాలని.. తద్వారా వేలాది మంది తలసేమియా వ్యాధి గ్రస్థులకు జీవితం ప్రసాదించినట్టు అవుతుందని పేర్కొన్నారు.
This post was last modified on April 25, 2025 8:55 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…