Political News

బడులు తెరవగానే కరోనా బయటపడుతోందా ?

అత్యుత్సాహంలో ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ నుండి తెరిచిన స్కూళ్ళ కారణంగా కరోనా వైరస్ వ్యాపిస్తోందా ?  క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ నేపధ్యంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకుని నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ళు తెరిచిన విషయం అందరికీ తెలిసిందే. మొదటిరోజు సోమవారం స్కూళ్ళు తెరవగానే కొందరు టీచర్లు, విద్యార్ధుల్లో కరోనా వైరస్ బయటపడింది.  ఒక్క చిత్తూరు జిల్లాలోని టీచర్లలో సుమారు 70 మందికి కరోనా వైరస్ బయటపడింది. అలాగే విద్యార్ధుల్లో కూడా వైరస్ ఉన్న విషయం బయటపడటంతో వాళ్ళని వెంటనే ఇళ్ళకు పంపేశారు.

నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని స్కూళ్ళల్లోని కొందరు టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. టీచర్లు, విద్యార్ధులు స్కూళ్ళల్లోకి ప్రవేశించే మందే అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ లో వారందరికీ కరోనా లక్షణాలున్న విషయం బయటపడుతోంది.  అంటే వీళ్ళకు కూడా తమకు కరోనా వైరస్ ఉన్న విషయం తెలియదని అర్ధమవుతోంది. టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్న విషయం బయటపడగానే నెల్లూరులోని ఓ స్కూలును తెరవకుండానే వెళ్ళిపోయారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్లు, టీచర్లు కరోనా వైరస్ నేపధ్యంలో  ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది వాస్తవం. స్కూల్ ఎంట్రన్స్ లోనే అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. తరగతి గదుల్లో శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికే కరోనా వైరస్ ఉన్న టీచర్లు, విద్యార్ధులు స్కూల్లోకి వచ్చేస్తే ఏమి చేస్తారు ? అన్నదే ప్రధానమైన ప్రశ్న. ఈ భయంతోనే తల్లి, దండ్రులు తమ పిల్లలను కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకు పంపలేదని సమాచారం. 9, 10 తరగతుల విద్యార్ధులకు రోజు మార్చి రోజు స్కూలుకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించినా ఆచరణ సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిజానికి ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా స్కూళ్ళు తెరవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమి కనిపించిందో అర్ధం కావటం లేదు. ఇప్పటికే విద్యాసంవత్సరం పోయింది. ఒక్క విద్యాసంవత్సరమే కాదు ఆర్ధికసవత్సరం కూడా పోయింది. అయితే ప్రభుత్వం గ్రహించాల్సిందేమంటే విద్యాసంవత్సరం పోవటం అన్నది ఒక్క ఏపికే కాదు. దేశమంతా ప్రపంచమంతా కూడా  ఇదే సమస్య. విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే ప్రాణాలు ఎంతో విలువైన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ కారణంగానే మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో ఏకంగా విద్యా సంవత్సరాన్ని రద్దు చేశాయి. మరికొన్ని విద్యాసంస్ధలు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ మొదలవుతున్న నేపధ్యంలో  ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తిస్తే బాగుంటుంది.

This post was last modified on November 3, 2020 10:42 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago