Political News

‘వైసీపీ మ‌త్తు’ వ‌దిలిస్తున్న‌ సిట్‌.. 4 రోజుల్లో నివేదిక‌!

ఏపీలో వైసీపీ హ‌యంలో జ‌రిగిన మ‌ద్యం కొనుగోళ్లు.. విక్ర‌యాల ద్వారా సుమారు రూ.2 – 3 వేల కోట్ల వ‌ర‌కు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని..దీనిలో స‌గానికిపైగానే ‘కీల‌క నేత‌’ ఖాతాలోకి చేరాయ‌ని భావిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యా ప్తు బృందం ఆ దిశ‌గా ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో త‌వ్వుతున్న కొద్దీ కొత్త విష‌యాలు.. కొత్త మ‌నుషులు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాస్త‌వానికి వైసీపీ సీనియ‌ర్ నేత‌ వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు విక్రాంత్ రెడ్డితో మొద‌లైన వ్య‌వ‌హారం రాజ్ క‌సిరెడ్డి వ‌ద్ద ఆగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ.. రాజ్ క‌సిరెడ్డిని విచారించిన త‌ర్వాత‌.. మ‌రో ముఖ్య వ్య‌క్తి బూనేటి చాణ‌క్య అలియాస్ ప్ర‌కాష్ ఈ వ్య‌వ‌హారంలో రాజ్ క‌సిరెడ్డి చెప్పిన‌ట్టు న‌డుచుకున్నార‌ని తేలింది. మ‌ద్యం విక్ర‌యాలు.. నుంచి.. లాభాల పోగు చేసుకోవ‌డం వ‌ర‌కుకూడా.. చాణ‌క్య కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు గుర్తించారు. ఆ వెంట‌నే అత‌నిపై రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన‌ త‌ర్వాత‌..దుబాయ్‌కు పారిపోయిన చాణ‌క్య తాజాగా ఇండియాకు తిరిగి రావ‌డంతో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో దాదాపు మ‌ద్యం మ‌త్తు ప‌ట్టిన వైసీపీ వ్య‌వ‌హారంలో కీల‌క ముంద‌డుగు ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాష్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఏయే డిస్టిల‌రీకి ఎంత టార్గెట్ పెట్టాలి? ఏయే డిస్ట‌ల‌రీ నుంచి ఎంత మొత్తం పిండేయాల‌న్న‌ది ఆయ‌నే నిర్ణ‌యించార‌ని అధికారులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే రాజ్ క‌సిరెడ్డి నుంచి కొంత స‌మాచారం రాబ‌ట్టిన సిట్ ద‌ర్యాప్తు బృందం… చాణక్య‌ను విచారించ‌డం ద్వారా.. కింగ్ పిన్‌కు ఉచ్చు బిగిస్తోంది. మ‌రోనాలుగు రోజుల్లో దాదాపు ద‌ర్యాప్తు కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

సాధ్య‌మేనా?

ఇక‌, మ‌ద్యం విష‌యంలో వైసీపీ కీల‌క నేత‌కు.. ముడుపులు త‌ర‌లి పోయాయ‌ని భావిస్తున్న అధికారులు.. ఈ నిధుల‌ను స్వాధీనం చేసుకోవ‌డం సాధ్య‌మేనా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. విదేశాల‌కు త‌ర‌లించిన నిధుల‌ను తీసుకురావ‌డం.. ఏయే దేశాల‌కు ఎంతెంత మొత్తం త‌రలిపోయింద‌న్న విష‌యాల‌ను కూపీలాగ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. స‌ద‌రు నిధుల‌ను వెన‌క్కితీసుకురావాలంటే.. కేంద్ర ప్ర‌భుత్వ జోక్యం త‌ప్ప‌ని స‌రి.. అని భావిస్తున్నారు.

మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారాల విష‌యంలో కేంద్రం ఏపీకి స‌హ‌క‌క‌రిస్తే త‌ప్ప‌.. ఈ నిధుల‌ను తిరిగి తీసుకురావ‌డం అంత ఈజీకాద‌ని అధికారులు భావిస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో విచార‌ణను ముగించి ప్ర‌భుత్వానికి సిట్ నివేదిక అందించిన‌త‌ర్వాత‌..దీనిపై స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యం..కేంద్రం స్పందించే తీరు.. కీల‌కంగా మార‌నున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 24, 2025 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

19 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

39 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago