Political News

కసిరెడ్డి గుట్టు విప్పేశారు!.. సూత్రధారి జగనే!

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపుగా వీడిపోయినట్టేనని చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి… సీఐడీ విచారణలో భాగంగా ఈ కుంభకోణానికి సంబందించిన మొత్తం గుట్టును విప్పేసినట్లుగానే తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని కూడా ఆయన పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. జగన్ నేతృత్వంలోనే ఈ కుంభకోణం జరిగిందని, వైసీపీ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి ముడుపులు ఎలా స్వీకరించాలి? వాటిని ఎలా?.. ఎవరికి ఇవ్వాలి? అన్న ప్రతి అంశంపై కీలక నిర్ణయాలు జరిగాయని కసిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది.

రాజ్ కసిరెడ్డిని సోమవారం పోలీసులు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా ఆయనను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో కసిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబందించిన అన్ని విషయాలను సమగ్రంగా బయటపెట్టేశారట. ఈ మేరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విచారణకు సంబందించిన అంశాలతో ప్రదాన కథనాలను ప్రచురించింది.

ఈ కథనాల ప్రకారం మద్యం కుంభకోణానికి సంబంధించి అసలు సూత్రధాని జగనేనని తేలిపోయింది. అంతేకాకుండా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ముడుపులు నాడు సీఎంగా ఉన్న జగన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి చేరాయట. ఇలా ప్రతి నెలా రూ.50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు సీఎంఓకు చేరేవట. ఈ లెక్కన మద్యం కుంభకోణం ద్వారా జగన్ కు మొత్తంగా రూ.3,200 కోట్లు అందాయని తెలిసింది.

ఇక ఈ మద్యం కుంభకోణంలో తాను విజిల్ బ్లోయర్ ని అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉందని కసిరెడ్డి వెల్లడించారట. సాయిరెడ్డితో పాటుగా వైసీపీ పీఏసీ కన్వీనర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికీ కీలక భూమిక ఉందట. ఇక ఈ కుంభకోణం ద్వారా వసూలయ్యే ముడుపులు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలతో పాటుగా మరో వ్యక్తి బాలాజీలకు కూడా వెళ్లేవని కసిరెడ్డి వెల్లడించారు.

అంటే.. మెజారిటీ వాటా జగన్ కు వెళ్లగా… కొంత మొత్తంలో ఈ ముగ్గురికి వెళ్లాయని తేలిపోయింది. వెరసి తనకు ఈ వ్యవహారంతో సంబంధమే లేదని చెబుతున్న మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలు కూడా అడ్డంగా బుక్కైపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నిధులను బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, స్థిరాస్తి కంపెనీల్లోకి తరలించేలా వ్యూహం రచించినట్లుగా కసిరెడ్డి బయబపెట్టేశారు.

ఇదిలా ఉంటే… అసలు మద్యం కుంభకోణానికి సంబందించి ప్రాథమిక అడుగు పడింది కూడా తాడేపల్లిలోనేనని కూడా కసిరెడ్డి సిట్ అదికారులకు తెలిపారు. మద్యం పాలసీ, దాని అమలు, ముడుపుల వసూళ్లకు సంబందించి దఫదఫాలుగా భేటీలు జరగగా…అవన్నీ తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరుల్లో జరిగాయని కసిరెడ్డి చెప్పారు. ఇక ముడుపులు ఇచ్చిన కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నారట.

ప్రతి ఐదు రోజులకోమారు ముడుపులు రావాల్సిందేనని కంపెనీలకు షరతు పెట్టి మరీ వసూలు చేశారట. ఇక మద్యం కుంభకోణంలో కీలక స్థావరంగా పరిగణిస్తున్న ఎస్పీవై డిస్టిలరీస్ ను బెదిరించి మరీ ఆ కంపెనీకి చెందిన ప్లాంటుతో పాటు బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నారట. వైసీపీ సర్కారు వేధింపులు తట్టుకోలేకే మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ కుంభకోణంలో పాలుపంచుకోక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మద్యం కుంభకోణం గుట్టును కసిరెడ్డి విప్పేయగా… దీనిపై కూటమి సర్కారు ఏ తరహా చర్యలకు శ్రీకారం చుడుతుందన్నదానిపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.

This post was last modified on April 23, 2025 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

7 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

9 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

12 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

13 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

14 hours ago