Political News

నితీష్ లో అసహనం దేనికి సంకేతం ?

బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లో అసహనం పెరిగిపోతోంది. ఎన్డీయే కూటమి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినపుడు నితీష్ ప్రశాంతంగానే ఉండేవారు. తర్వాత్తర్వాత బహుశా టెన్షన్ పెరిగిపోయినట్లుంది. ఎన్నికల వేడి మొదలు కాకముందు ఎన్డీయే కూటమికే మళ్ళీ అధికారం ఖాయమంటూ ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. అయితే ఎన్నికల వేడి పెరిగిపోయి మొదటిదశ పోలింగ్ జరిగేనాటికి బీహార్ లో సీన్ మారిపోయిందనింపించింది.

అసలు ఎన్నికల్లో ప్రత్యర్ధే కాదని అధికార కూటమి భావించిన యూపీఏ కూటమి హెడ్, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్జేడీ చీఫ్ తేజస్వీ బాగా గట్టివాడని అందరికీ అర్ధమైపోయింది. అనుకున్నట్లే మొదటి దశలో జరిగిన పోలింగ్ అంచనాలు కూడా మారిపోయాయి. 71 స్ధానాలకు అక్టోబర్ 28వ తేదీన జరిగిన మొదటి విడత పోలింగ్ లో 30 స్ధానాల్లో యూపీఏకే అత్యధిక సీట్లు వస్తాయనే సర్వే ఫలితాలు తేల్చాయి. అలాగే ఎన్డీయే కూటమికి 19 సీట్లే అని పోస్టు పోల్ సర్వేలో బయటపడటం నితీష్ లో కలవరం పెంచేసింది.

మొదటి విడత పోలింగ్ సమయానికే పోలింగ్ ట్రెండ్స్ నితీష్ కు తెలిసిపోయిందేమో. అందుకనే తేజస్విపై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. మొదటి విడత పోలింగ్ తర్వాత నుండి తేజస్వీ, కాంగ్రెస్ అభ్యర్ధులపై మరీ రెచ్చిపోయి ఆరోపణలు చేసేస్తున్నారు. రేపు 3వ తేదీన రెండోవిడత పోలింగ్ జరగబోతోంది. పరిస్దితిని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా వెంటనే బీహార్ ఎన్నికల ప్రచారానికి దిగిపోయారు. ప్రచారం మొదలుపెట్టడమే ఆర్జేడీ చీఫ్ పై ఆరోపణలు పెంచేశారు.

ఒకవైపు మోడి మరోవైపు నితీష్ అండ్ తేజస్వీని టార్గెట్ చేసుకున్న విషయం అర్ధమైపోతోంది. నిజంగానే ఎన్డీయే కూటమి గెలుపు నల్లేరుపై బండి నడక లాంటిదే అయితే తేజస్వినో లేకపోతే కాంగ్రెస్ అభ్యర్ధులనో ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి గురించి రెగ్యులర్ గా ప్రస్తావిస్తున్నారు. నిజానికి లాలూ అవినీతి గురించి ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే అవినీతి ఆరోపణలపైనే ఇపుడు లాలూ జైలులో ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పదేళ్ళనుండి సిఎంగా ఉంటున్న నితీష్ కూడా పోలింగ్ ప్రచారంలో ఇంత అసహనానికి గురికావటమే ఆశ్చర్యంగా ఉంది. నితీష్, మోడి ప్రచారం చేస్తున్న పద్దతి చూస్తుంటే యూపీఏ కూటమిని ప్రత్యేకంగా తేజస్విని చాలా తక్కువగా అంచనా వేసినట్లు అర్దమైపోతోంది. 90 స్ధానాలకు జరిగే రెండో విడత పోలింగ్ లో కూడా ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యత రాకపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా ? అన్నదే నితీష్ డౌటనుమానం. చూద్దాం ఏం జరుగుతుందో .

This post was last modified on November 2, 2020 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago