ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రశాంతంగా జరిగాయి. అయితే..కర్నూలు జిల్లాలో మాత్రం ఈ వేడుకలు తీవ్ర విషాదం నింపాయి. కర్నూలులో ఆదివారం సాయంత్రం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పార్టీ కీలక జిల్లా నాయకుడు, అధికార ప్రతినిధి బోయ సురేంద్ర.. హఠాత్తుగా కుప్పకూలిపోయారు.
సురేంద్ర వయసు 35 సంవత్సరాలని పార్టీ నాయకులు తెలిపారు. 19 ఏళ్ల వయసు నుంచి కూడా పార్టీలో ఉన్నారని.. కార్యకర్త స్థాయి నుంచి అధికార ప్రతినిధి వరకు ఎదిగారని పేర్కొన్నారు. ఆలూరులో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో సురేంద్ర కు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన కొందరు.. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరించారు. కానీ, అప్పటికే సురేంద్ర మృతి చెందారని వైద్యులు తెలిపారు.
సురేంద్ర మృతితో ర్యాలీని అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ ఘటనపై నారా లోకేష్ స్థానిక నాయకులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని.. తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ పరంగా అన్ని విధాలా సాయం చేయాలని స్థానిక కేడర్కు సూచించారు.
ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చాలా జిల్లాల్లో చంద్రబాబు దీర్ఘాష్షుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. మూడు రోజుల పాటు నిర్వహించే హోమాన్ని తలపెట్టారు. దీనిలో ఏకంగా 600 మంది పురోహితులు పాల్గొన్నారు.
This post was last modified on April 20, 2025 9:52 pm
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…