Political News

చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుక‌లు: తీవ్ర విషాదం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 75వ‌ పుట్టిన రోజు వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్ర‌శాంతంగా జ‌రిగాయి. అయితే..క‌ర్నూలు జిల్లాలో మాత్రం ఈ వేడుక‌లు తీవ్ర విషాదం నింపాయి. కర్నూలులో ఆదివారం సాయంత్రం.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ స‌మ‌యంలో పార్టీ కీల‌క జిల్లా నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి బోయ సురేంద్ర‌.. హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోయారు.

సురేంద్ర వ‌య‌సు 35 సంవ‌త్స‌రాల‌ని పార్టీ నాయ‌కులు తెలిపారు. 19 ఏళ్ల వ‌య‌సు నుంచి కూడా పార్టీలో ఉన్నార‌ని.. కార్య‌కర్త స్థాయి నుంచి అధికార ప్ర‌తినిధి వ‌ర‌కు ఎదిగార‌ని పేర్కొన్నారు. ఆలూరులో ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో సురేంద్ర కు ఒక్క‌సారిగా గుండె పోటు వ‌చ్చింది. దీంతో కుప్ప‌కూలిపోయారు. దీనిని గ‌మ‌నించిన కొంద‌రు.. ఆయ‌నను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌రించారు. కానీ, అప్ప‌టికే సురేంద్ర మృతి చెందారని వైద్యులు తెలిపారు.

సురేంద్ర మృతితో ర్యాలీని అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ ఘ‌ట‌న‌పై నారా లోకేష్ స్థానిక నాయ‌కుల‌కు ఫోన్ చేసి విచారం వ్య‌క్తం చేశారు. సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాల‌ని.. తాను విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌.. సురేంద్ర కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తాన‌ని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ప‌రంగా అన్ని విధాలా సాయం చేయాల‌ని స్థానిక కేడ‌ర్‌కు సూచించారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. చాలా జిల్లాల్లో చంద్ర‌బాబు దీర్ఘాష్షుతో సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటూ.. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. మూడు రోజుల పాటు నిర్వ‌హించే హోమాన్ని త‌ల‌పెట్టారు. దీనిలో ఏకంగా 600 మంది పురోహితులు పాల్గొన్నారు.

This post was last modified on April 20, 2025 9:52 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago