ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రశాంతంగా జరిగాయి. అయితే..కర్నూలు జిల్లాలో మాత్రం ఈ వేడుకలు తీవ్ర విషాదం నింపాయి. కర్నూలులో ఆదివారం సాయంత్రం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో పార్టీ కీలక జిల్లా నాయకుడు, అధికార ప్రతినిధి బోయ సురేంద్ర.. హఠాత్తుగా కుప్పకూలిపోయారు.
సురేంద్ర వయసు 35 సంవత్సరాలని పార్టీ నాయకులు తెలిపారు. 19 ఏళ్ల వయసు నుంచి కూడా పార్టీలో ఉన్నారని.. కార్యకర్త స్థాయి నుంచి అధికార ప్రతినిధి వరకు ఎదిగారని పేర్కొన్నారు. ఆలూరులో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో సురేంద్ర కు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన కొందరు.. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరించారు. కానీ, అప్పటికే సురేంద్ర మృతి చెందారని వైద్యులు తెలిపారు.
సురేంద్ర మృతితో ర్యాలీని అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ ఘటనపై నారా లోకేష్ స్థానిక నాయకులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని.. తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ పరంగా అన్ని విధాలా సాయం చేయాలని స్థానిక కేడర్కు సూచించారు.
ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చాలా జిల్లాల్లో చంద్రబాబు దీర్ఘాష్షుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. మూడు రోజుల పాటు నిర్వహించే హోమాన్ని తలపెట్టారు. దీనిలో ఏకంగా 600 మంది పురోహితులు పాల్గొన్నారు.
This post was last modified on April 20, 2025 9:52 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…