గుడివాడ-గన్నవరం నియోజకవర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ.. చర్చకు వచ్చేవే. బలమైన నాయకులుగా… ఒకప్పుడు ఈ రెండు నియోజకవర్గాలను శాసించిన.. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు.. ఇతర పార్టీల నాయకులను కదలకుండా మెదలకుండా కూడా చేశారు. చిత్రం ఏంటంటే.. ఇద్దరూ కూడా.. టీడీపీలో ఎదిగిన వారే.. టీడీపీ పంచన మొలిచిన వారే. కానీ.. తల్లిపాలు తాగి ఏదో చేసినట్టుగా.. ఇద్దరూ టీడీపీకి శత్రువులుగా మారారు. పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అంటారు. అలానే.. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పరిస్తితి తిరగబడింది. రెండు చోట్లా ఆ ఇద్దరు నాయకులు పరాజయం పాలయ్యారు. అంతేకాదు.. వారి అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఇంతకీ చెప్పొచ్చేదంటంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ.. వైసీపీ గూళ్లు ఖాళీ అవుతున్నాయి. గుడివాడలో వైసీపీ కార్యాలయంగా ఉన్న ప్రాంతాన్ని యజమాని తీసుకున్నా రు. దీంతో అక్కడ కార్యాలయం తీసేశారు.
ప్రస్తుతం కీలకమైన కార్యాలయం తీసేయడంతో ఎవరూ ప్రశ్నించేవారు కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో ఎన్నారై వెనిగండ్ల రాము విజయం దక్కించుకున్న గుడివాడలో ఇప్పుడు అభివృద్ధి సుమాలు విరుస్తున్నాయని స్థానికులు సైతం చెప్పుకొంటున్నారు. వర్గ పోరు లేదు. బెదిరింపులు లేవు. నా-నీ.. అనే బేధాభిప్రాయాలు సైతం లేకుండా.. పనులు జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో గుడివాడలో వైసీపీ కి చెందిన క్షేత్రస్థాయి నాయకులు కూడా వెనిగండ్ల వైపు మొగ్గు చూపి.. కండువాలు మార్చుకుంటున్నారు.
ఇక, గన్నవరంలో మాజీ వైసీపీ నాయకుడు, ఎన్నికలకు ముందు టీడీపీ చెంతకు వచ్చిన యార్లగడ్డ వెంక ట్రావు కూడా.. ప్రజలకు చేరువగానే ఉన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా.. ఆయన చేరువగా ఉన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూడా..యార్లగడ్డ వెంట తిరుగుతుండడం గమనార్హం. మరోవైపు.. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న గన్నవరం పరిధిలో ఒకప్పుడు వంశీకి జైకొట్టిన వారు.. ఇప్పుడు వెంకట్రావుకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.
This post was last modified on April 20, 2025 3:19 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…