Political News

జ‌గ‌న్‌… ఇదీ.. అస‌లు సిస‌లు నాడు – నేడు ..!

రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించ‌గానే చ‌టుక్కున జ‌గ‌నే గుర్తుకు వ‌స్తారు. త‌న పాల‌న ప్రారంభం నుంచి ఆయ‌న నాడు-నేడు అంటూ.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వానికి(2014-19) త‌న ప్ర‌భుత్వానికి మ‌ధ్య తేడా చూడాలంటూ.. ఆయ‌న ఊరూవాడా ప్ర‌చారం దంచి కొట్టారు. అనేక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న నాడు-నేడును ఆపాదించారు కూడా. అయితే.. నాడు-నేడు అంటే కేవ‌లం ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం.. ప్ర‌జ‌ల‌కు సొమ్ములు ఇవ్వ‌డం.. వ‌ర‌కే ప‌రిమితం అని జ‌గ‌న్ భావించారు. వాస్త‌వానికి ఆయ‌న స్కూళ్ల‌లో మార్పులు చేశారు. అదేవిధంగా గ్రామీణ స్తాయికి వైద్యాన్నిచేర్చారు.

కానీ, అనుకున్న విధంగా నాడు-నేడు స‌క్సెస్ కాలేదు. దీంతో జ‌గ‌న్ పెట్టుకున్న నాడు-నేడు ల‌క్ష్యంకొర‌గాకుండా పోయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆ పేరు లేదు. కానీ, నాడు-నేడు అనే మాట ప్ర‌భుత్వం నుంచి కాకుండా ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ప్ర‌బుత్వం త‌ర‌ఫున ఎవ‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లినా.. నాడు-నేడు అనేవారు. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లే నాడు-నేడు అనే ప‌రిస్థితిని కూట‌మి స‌ర్కారు తీసుకువ‌చ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ స్థాయిలో చూసుకుంటే.. ర‌హ‌దారులు మెరుగ‌య్యాయి. ఫ‌లితంగా ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. త‌ళ‌త‌ళ‌లాడుతున్న ర‌హ‌దారులు క‌నిపిస్తున్నాయి.

దీంతో గ్రామీణుల మోముల‌లో మంద‌హాసం క‌నిపిస్తోంది. అదేవిధంగా పంచాయ‌తీలు బ‌లోపేతం అయ్యాయి. వైసీపీ హ‌యాంలో రూపాయి రాక‌.. పైగా.. పంచాయ‌తీల‌పై భారాలు మోపార‌న్న వాద‌న వినిపించింది. కానీ, ఇప్పుడు స‌ర్కారు చొర‌వ కార‌ణంగా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్ములునేరుగా పంచాయ‌తీల‌కు చేరుతున్నాయి. దీంతో నాడు దుస్థితిని త‌లుచుకుంటూ.. నేడు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ప‌ట్ట‌ణాల విష‌యానికి వ‌స్తే.. ఉపాధి మెరుగు ప‌డుతోంది. పారిశ్రామిక వేత్త‌ల రాక‌.. పెట్టుబడుల కేక‌.. అన్న‌ట్టుగా రాష్ట్రంలో పెట్ట‌బడులు పెట్టేందుకు.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా పారిశ్రామిక వేత్త‌లు ప‌రుగులు పెట్టుకుని వ‌స్తున్నారు.

త‌ద్వారా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మెరుగు ప‌డుతున్నాయ‌న్న చ‌ర్చ సాధార‌ణ ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. అదేవిధంగా ఉచిత ఇసుక‌, ఉచిత‌సిలిండెర్లు.. వంటివి సామాన్యుల‌కు క‌లిసి వ‌స్తున్నాయి. ఒకప్పుడు వారానికి మూడు రోజులు మాత్ర‌మే ప‌నులు ఉండే భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఇప్పుడు వారం మొత్తం ప‌నుల‌తో బిజీగా క‌నిపిస్తున్నారు. అదేవిధంగా ప‌నుల‌కు కూడా కొద‌వ లేకుండా ఉంది. దీంతో నాడు.. ప‌డిన ఇబ్బందులు త‌లుచుకుని.. నేడు ప‌నులు దొరుకుతున్న ఆనందంలో మునిగి తేలుతు న్నారు. ఈ విష‌యాల‌న్నీ.. తాజాగా స‌ర్కారు చేయించిన ఇంటింటి స‌ర్వేలో స్ప‌ష్టంగా తేలింది. ప‌నులు లేని వారు.. ఒక‌ప్పుడు క‌నిపిస్తే.. ఇప్పుడు చేతినిండా ప‌నులు ఉన్న‌వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on April 20, 2025 3:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago