Political News

జ‌గ‌న్‌… ఇదీ.. అస‌లు సిస‌లు నాడు – నేడు ..!

రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించ‌గానే చ‌టుక్కున జ‌గ‌నే గుర్తుకు వ‌స్తారు. త‌న పాల‌న ప్రారంభం నుంచి ఆయ‌న నాడు-నేడు అంటూ.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వానికి(2014-19) త‌న ప్ర‌భుత్వానికి మ‌ధ్య తేడా చూడాలంటూ.. ఆయ‌న ఊరూవాడా ప్ర‌చారం దంచి కొట్టారు. అనేక కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న నాడు-నేడును ఆపాదించారు కూడా. అయితే.. నాడు-నేడు అంటే కేవ‌లం ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం.. ప్ర‌జ‌ల‌కు సొమ్ములు ఇవ్వ‌డం.. వ‌ర‌కే ప‌రిమితం అని జ‌గ‌న్ భావించారు. వాస్త‌వానికి ఆయ‌న స్కూళ్ల‌లో మార్పులు చేశారు. అదేవిధంగా గ్రామీణ స్తాయికి వైద్యాన్నిచేర్చారు.

కానీ, అనుకున్న విధంగా నాడు-నేడు స‌క్సెస్ కాలేదు. దీంతో జ‌గ‌న్ పెట్టుకున్న నాడు-నేడు ల‌క్ష్యంకొర‌గాకుండా పోయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆ పేరు లేదు. కానీ, నాడు-నేడు అనే మాట ప్ర‌భుత్వం నుంచి కాకుండా ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ప్ర‌బుత్వం త‌ర‌ఫున ఎవ‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లినా.. నాడు-నేడు అనేవారు. కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లే నాడు-నేడు అనే ప‌రిస్థితిని కూట‌మి స‌ర్కారు తీసుకువ‌చ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ స్థాయిలో చూసుకుంటే.. ర‌హ‌దారులు మెరుగ‌య్యాయి. ఫ‌లితంగా ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. త‌ళ‌త‌ళ‌లాడుతున్న ర‌హ‌దారులు క‌నిపిస్తున్నాయి.

దీంతో గ్రామీణుల మోముల‌లో మంద‌హాసం క‌నిపిస్తోంది. అదేవిధంగా పంచాయ‌తీలు బ‌లోపేతం అయ్యాయి. వైసీపీ హ‌యాంలో రూపాయి రాక‌.. పైగా.. పంచాయ‌తీల‌పై భారాలు మోపార‌న్న వాద‌న వినిపించింది. కానీ, ఇప్పుడు స‌ర్కారు చొర‌వ కార‌ణంగా.. కేంద్రం నుంచి వ‌చ్చిన సొమ్ములునేరుగా పంచాయ‌తీల‌కు చేరుతున్నాయి. దీంతో నాడు దుస్థితిని త‌లుచుకుంటూ.. నేడు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ప‌ట్ట‌ణాల విష‌యానికి వ‌స్తే.. ఉపాధి మెరుగు ప‌డుతోంది. పారిశ్రామిక వేత్త‌ల రాక‌.. పెట్టుబడుల కేక‌.. అన్న‌ట్టుగా రాష్ట్రంలో పెట్ట‌బడులు పెట్టేందుకు.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా పారిశ్రామిక వేత్త‌లు ప‌రుగులు పెట్టుకుని వ‌స్తున్నారు.

త‌ద్వారా ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మెరుగు ప‌డుతున్నాయ‌న్న చ‌ర్చ సాధార‌ణ ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. అదేవిధంగా ఉచిత ఇసుక‌, ఉచిత‌సిలిండెర్లు.. వంటివి సామాన్యుల‌కు క‌లిసి వ‌స్తున్నాయి. ఒకప్పుడు వారానికి మూడు రోజులు మాత్ర‌మే ప‌నులు ఉండే భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఇప్పుడు వారం మొత్తం ప‌నుల‌తో బిజీగా క‌నిపిస్తున్నారు. అదేవిధంగా ప‌నుల‌కు కూడా కొద‌వ లేకుండా ఉంది. దీంతో నాడు.. ప‌డిన ఇబ్బందులు త‌లుచుకుని.. నేడు ప‌నులు దొరుకుతున్న ఆనందంలో మునిగి తేలుతు న్నారు. ఈ విష‌యాల‌న్నీ.. తాజాగా స‌ర్కారు చేయించిన ఇంటింటి స‌ర్వేలో స్ప‌ష్టంగా తేలింది. ప‌నులు లేని వారు.. ఒక‌ప్పుడు క‌నిపిస్తే.. ఇప్పుడు చేతినిండా ప‌నులు ఉన్న‌వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on April 20, 2025 3:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

7 minutes ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

7 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

9 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

12 hours ago

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

12 hours ago

నా ఉద్దేశం అది కాదంటున్న అనన్య

చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ్‌లోకి మార్చి, వాటి ద్వారా హాట్…

12 hours ago