విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారా? ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పాలన బాగానే ఉందంటూ.. ఆయన ఫేస్బుక్ వేదికగా మెసేజ్ పెట్టారు. ఆ సమ యంలో వైసీపీ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పించింది. ఖచ్చితంగా అదేసమయంలో నాని తన ఫేస్బుక్లో ఈ మెసేజ్ పెట్టారు.
ఇక, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఏపీకి నష్టం జరుగుతుందని.. దీనిపై చంద్రబా బు ఆలోచించాలని మరో సందర్భంలో సూచించారు. ఇలా.. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినా .. రాజకీయాల్లోకి వచ్చేది లేదని అన్నా.. కేశినేని మాత్రం తన పంథాను మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు నేరుగా సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. పోస్టు పెట్టారు. గతంలో ఇదే చంద్రబాబును విమర్శించిన విషయం గమనార్హం.
కానీ, చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కేశినేని నాని విష్ చేశారు. అయితే.. ఆయన శుభాకాం క్షలు చెప్పి మాత్రమే వూరుకోలేదు. చంద్రబాబు వంటి నాయకుడు ఈ రాష్ట్రానికి.. ప్రజలకు కూడా అవస రమని వ్యాఖ్యానించారు. ఆయన ఏపీకి వరమని పేర్కొన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింతగా అభి వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతేకాదు.. తనకు చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం గొప్ప వరమని కూడా పేర్కొనడం గమనార్హం.
ఈ పరిణామాలను గమనిస్తే.. మాజీ ఎంపీ కేశినేని నాని.. మనసు మార్చుకుంటున్నారన్న సంకేతాలు వస్తు న్నాయి. గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీ పంచన చేరారు. ఆ పార్టీ టికెట్పైనే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, ఏమైందో ఏమో.. వైసీపీ నుంచి కూడా దూరమయ్యా రు. రాజకీయాలకు దూరమని కూడా ప్రకటించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
This post was last modified on April 20, 2025 2:26 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…