Political News

అప్పుడు నువ్వు చెసిందేటి జగన్?

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా.. అధికారం లేన‌ప్పుడు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కామ‌న్ అయిపోయిందా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. తాను చేసిన త‌ప్పులు మ‌రిచి..త‌న హ‌యాంలో జ‌రిగిన దుర్రాజ‌కీయం మ‌రిచి.. నేడు నీతులు చెబుతున్నారు. తాజాగా గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో కూట‌మి జెండా ఎగ‌రడాన్ని ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. సీఎం చంద్ర‌బాబుకు ఓ సుదీర్ఘ లేఖ‌ను సంధించారు. అదికూడా త‌న సోష‌ల్ మీడియాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. మీడియా ముందుకురాలేక పోతున్నారో.. వ‌స్తే.. ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన ఘోరాల‌ను ప్ర‌శ్నిస్తార‌న్న సందేహమో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలోనే స్పందిస్తున్నారు.

తాజా లేఖ ఇదీ..

“రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.” అని జ‌గ‌న్ పేర్కొన్నారు. గ‌తంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలానే చేశారని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. వారికి కూడా స‌మాధానం ఇస్తే బాగుండేది.

ఇక‌, “ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైయస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది? బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగంచేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా?” అని వ్యాఖ్యానించారు.

చీరాల విష‌యంలో వైసీపీ కూడా ఇలానే చేసింద‌న్న వాద‌న ఉంది. దానినిఅప్ప‌ట్లో స‌మ‌ర్థించుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం ప్ర‌జాస్వామ్యం పేరుతో ప్ర‌శ్నించ‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago