Political News

పింక్ డైమండ్ తర్వాత గోశాలతో స్వామి రాజకీయం

తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై ధర్నాలు, నిరసనలు కూడా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రతిగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు తమిళనాడుకు చెందిన సుబ్రమణ్య స్వామి కూడా జోక్యం చేసుకున్నారు.

ఫలితంగా నిప్పుకు చమురు తోడైనట్టు వివాదం మరింత పెరిగింది. తాజాగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, సుబ్రమణ్య స్వామిపై నిప్పులు చెరిగారు. “ఆయనకు ఇక్కడ ఏం పని?” అని నిలదీశారు. “ఏదైనా ప్రశ్నించాలనుకుంటే, వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపైనా ప్రశ్నించాలి,” అని అన్నారు. “పిల్ వేస్తానని బెదిరింపులకు దిగడం ఎవరికీ క్షేమం కాదు. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని తినించారు. గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దుర్మార్గుడు,” అని బీఆర్ నాయుడు మండిపడ్డారు.

“పిల్ వేస్తామంటూ మమ్మల్ని భయపెడుతున్నారా? ఆనాడు వైసీపీ హయాంలో ఎందుకు స్పందించలేదో?” అంటూ సుబ్రమణ్య స్వామిని నిలదీశారు. “గతంలో పింక్ డైమండ్ పై అనవసర రాద్ధాంతం చేశారు. గోశాల రికార్డులన్నీ హరినాథ్ రెడ్డి ఎత్తుకెళ్లారు,” అని నాయుడు ఆరోపించారు. “సుబ్రమణ్య స్వామికి గత ఐదేళ్లలో అన్యాయాలు కనిపించలేదా? వైసీపీపై పిల్ ఎందుకు వేయలేదు? టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే స్వామి నిజానిజాలు తెలుసుకోరా?” అని ప్రశ్నించారు.

ఏసీబీకి ఇస్తాం!
గోశాల ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ వేస్తామ‌ని చైర్మన్ నాయుడు ప్రకటించారు. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని తెలిపారు. వైసీపీ తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తప్పు చేసిన వారు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వైసీపీ హయాంలో గోశాలలో అవినీతిపై ఏసీబీ విచారణ జరిపిస్తామని తెలిపారు. అప్పుడు ఎవరు గోవుల విషయంలో అన్యాయంగా వ్యవహరించారో తెలుస్తుందని అన్నారు.

This post was last modified on April 19, 2025 5:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

49 minutes ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

2 hours ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

3 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

3 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

5 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

6 hours ago