Political News

పింక్ డైమండ్ తర్వాత గోశాలతో స్వామి రాజకీయం

తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై ధర్నాలు, నిరసనలు కూడా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రతిగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు తమిళనాడుకు చెందిన సుబ్రమణ్య స్వామి కూడా జోక్యం చేసుకున్నారు.

ఫలితంగా నిప్పుకు చమురు తోడైనట్టు వివాదం మరింత పెరిగింది. తాజాగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, సుబ్రమణ్య స్వామిపై నిప్పులు చెరిగారు. “ఆయనకు ఇక్కడ ఏం పని?” అని నిలదీశారు. “ఏదైనా ప్రశ్నించాలనుకుంటే, వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపైనా ప్రశ్నించాలి,” అని అన్నారు. “పిల్ వేస్తానని బెదిరింపులకు దిగడం ఎవరికీ క్షేమం కాదు. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని తినించారు. గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దుర్మార్గుడు,” అని బీఆర్ నాయుడు మండిపడ్డారు.

“పిల్ వేస్తామంటూ మమ్మల్ని భయపెడుతున్నారా? ఆనాడు వైసీపీ హయాంలో ఎందుకు స్పందించలేదో?” అంటూ సుబ్రమణ్య స్వామిని నిలదీశారు. “గతంలో పింక్ డైమండ్ పై అనవసర రాద్ధాంతం చేశారు. గోశాల రికార్డులన్నీ హరినాథ్ రెడ్డి ఎత్తుకెళ్లారు,” అని నాయుడు ఆరోపించారు. “సుబ్రమణ్య స్వామికి గత ఐదేళ్లలో అన్యాయాలు కనిపించలేదా? వైసీపీపై పిల్ ఎందుకు వేయలేదు? టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే స్వామి నిజానిజాలు తెలుసుకోరా?” అని ప్రశ్నించారు.

ఏసీబీకి ఇస్తాం!
గోశాల ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ వేస్తామ‌ని చైర్మన్ నాయుడు ప్రకటించారు. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని తెలిపారు. వైసీపీ తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తప్పు చేసిన వారు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వైసీపీ హయాంలో గోశాలలో అవినీతిపై ఏసీబీ విచారణ జరిపిస్తామని తెలిపారు. అప్పుడు ఎవరు గోవుల విషయంలో అన్యాయంగా వ్యవహరించారో తెలుస్తుందని అన్నారు.

This post was last modified on April 19, 2025 5:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago