గత నెల రోజులుగా తీవ్ర సందిగ్ధంలో పడిన గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరనుంది. తాజాగా శనివారం ఉదయం 11 గంటలకు జరిగిన అవిశ్వాస ఓటింగ్లో వైసీపీ నాయకురాలు, ప్రస్తుత మేయర్ గొలగాని హరి వెంకట వెంకట కుమారి ఓడిపోయారు. దీంతో కూటమి పార్టీలు పైచేయి సాధించారు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు విశాఖలో ఉన్నారు. వీరిలో ఒకరు ఎప్పుడో దూరంగా ఉన్నారు. దీంతో ఓటింగ్ 97 మందికి జరిగింది.
అయితే.. అవిశ్వాస ఓటింగ్ విషయానికి వచ్చేసరికి.. కూటమి పైచేయి సాధించింది. ఆది నుంచి కూడా. కూటమికి అనుకూలంగా కార్పొరేటర్లను దరిచేరుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు ఈ విషయంలో చక్రం తిప్పారు. దీంతో ప్రత్యేకంగా భీమిలిలో శిబిరాలు ఏర్పాటు చేసి.. కట్టుతప్పకుండా చూసుకున్నారు. వైసీపీ నుంచి వచ్చే వారికి ఆహ్వానం పలికారు. ఫలితంగా.. ఆది 78 మంది కార్పొరేటర్లతో కళకళలాడిన విశాఖ వైసీపీ.. చివరకు 25 మందికి పరిమితమైంది.
తాజాగా మేయర్పై అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ తన కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. అయినా.. ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు.. వైసీపీకి మద్దతుగా ఉన్న పాతిక మంది కూడా.. కీలకమైన ఓటింగ్ సమయంలో కౌన్సిల్ మొహం చూడలేదు. దీంతో 74 మంది కార్పొరేటర్లే హాజరయ్యారు. కలెక్టర్ హరీందర్కుమార్ ఓటింగ్ నిర్వహించారు. మేయర్పై అవిశ్వాసంప్రకటిస్తూ.. 74 మంది చేతులు ఎత్తి తమ సమ్మతిని తెలిపారు. దీంతో ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.
దీనికి సంబంధించిన తీర్మాన ప్రతిని ఆయన విడుదల చేయనున్నారు. అనంతరం.. విశాఖ గ్రేటర్ ముని సిపాలిటీ.. కూటమి పార్టీలు దక్కించుకున్నట్టు అయింది. ఇక, ఎందుకిలా జరిగిందన్న సందేహం కూడా ఉంటుంది. విశాఖలో ఏ పనులు చేయాలన్నా.. పరిశ్రమలకు భూములు కేటాయించాలన్నా.. కార్పొరేషన్ అనుమతి కూడా అవసరం. అయితే..కూటమి చేపట్టే కార్యక్రమాలకు వైసీపీ నాయకులు అడ్డు పడుతున్న నేపథ్యంలో మేయర్పై అవిశ్వాసంప్రకటించారు. ఇది సక్సెస్ కావడంతో విశాఖలో ఇక ఇబ్బందులు లేకుండా .. పనులుచేసుకునే అవకాశం దక్కింది. కొత్త మేయర్ ఎవరనేది కూటమి పార్టీలు నిర్ణయించుకోనున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…