Political News

విశాఖ మేయ‌ర్ పీఠం కూట‌మిదే.. చేతులెత్తేసిన వైసీపీ!

గ‌త నెల రోజులుగా తీవ్ర సందిగ్ధంలో ప‌డిన గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠంపై కూట‌మి జెండా ఎగ‌ర‌నుంది. తాజాగా శ‌నివారం ఉద‌యం 11 గంట‌లకు జ‌రిగిన అవిశ్వాస ఓటింగ్‌లో వైసీపీ నాయ‌కురాలు, ప్ర‌స్తుత మేయ‌ర్ గొల‌గాని హ‌రి వెంక‌ట వెంక‌ట కుమారి ఓడిపోయారు. దీంతో కూట‌మి పార్టీలు పైచేయి సాధించారు. మొత్తం 98 మంది కార్పొరేట‌ర్లు విశాఖ‌లో ఉన్నారు. వీరిలో ఒక‌రు ఎప్పుడో దూరంగా ఉన్నారు. దీంతో ఓటింగ్ 97 మందికి జ‌రిగింది.

అయితే.. అవిశ్వాస ఓటింగ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి.. కూట‌మి పైచేయి సాధించింది. ఆది నుంచి కూడా. కూట‌మికి అనుకూలంగా కార్పొరేట‌ర్ల‌ను ద‌రిచేరుకున్నారు. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఈ విష‌యంలో చ‌క్రం తిప్పారు. దీంతో ప్ర‌త్యేకంగా భీమిలిలో శిబిరాలు ఏర్పాటు చేసి.. క‌ట్టుత‌ప్ప‌కుండా చూసుకున్నారు. వైసీపీ నుంచి వ‌చ్చే వారికి ఆహ్వానం ప‌లికారు. ఫ‌లితంగా.. ఆది 78 మంది కార్పొరేట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన విశాఖ వైసీపీ.. చివ‌ర‌కు 25 మందికి ప‌రిమిత‌మైంది.

తాజాగా మేయ‌ర్‌పై అవిశ్వాసం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వైసీపీ త‌న కార్పొరేట‌ర్ల‌కు విప్ జారీ చేసింది. అయినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు.. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న పాతిక మంది కూడా.. కీల‌క‌మైన ఓటింగ్ స‌మ‌యంలో కౌన్సిల్ మొహం చూడ‌లేదు. దీంతో 74 మంది కార్పొరేట‌ర్లే హాజ‌ర‌య్యారు. క‌లెక్ట‌ర్ హ‌రీంద‌ర్‌కుమార్ ఓటింగ్ నిర్వ‌హించారు. మేయ‌ర్‌పై అవిశ్వాసంప్ర‌క‌టిస్తూ.. 74 మంది చేతులు ఎత్తి త‌మ స‌మ్మ‌తిని తెలిపారు. దీంతో ఆమెను ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.

దీనికి సంబంధించిన తీర్మాన ప్ర‌తిని ఆయ‌న విడుద‌ల చేయ‌నున్నారు. అనంత‌రం.. విశాఖ గ్రేట‌ర్ ముని సిపాలిటీ.. కూట‌మి పార్టీలు ద‌క్కించుకున్న‌ట్టు అయింది. ఇక‌, ఎందుకిలా జ‌రిగింద‌న్న సందేహం కూడా ఉంటుంది. విశాఖ‌లో ఏ ప‌నులు చేయాల‌న్నా.. ప‌రిశ్ర‌మ‌ల‌కు భూములు కేటాయించాల‌న్నా.. కార్పొరేష‌న్ అనుమ‌తి కూడా అవ‌స‌రం. అయితే..కూట‌మి చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ నాయ‌కులు అడ్డు ప‌డుతున్న నేప‌థ్యంలో మేయ‌ర్‌పై అవిశ్వాసంప్ర‌క‌టించారు. ఇది స‌క్సెస్ కావ‌డంతో విశాఖ‌లో ఇక ఇబ్బందులు లేకుండా .. ప‌నులుచేసుకునే అవ‌కాశం ద‌క్కింది. కొత్త మేయ‌ర్ ఎవ‌ర‌నేది కూట‌మి పార్టీలు నిర్ణ‌యించుకోనున్నాయి.

This post was last modified on April 19, 2025 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

1 hour ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

1 hour ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

4 hours ago