Political News

రాజాసింగ్ దారెటు? కీల‌క స‌మావేశానికి డుమ్మా!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఫైర్‌బ్రాండ్‌.. నాయ‌కుడు ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దారెటు? మ‌రి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నున్న హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటు ఎవ‌రికి వేయ‌నున్నారు? అస‌లు వేస్తారా? లేదా? ఏం చేస్తారు? ఇదీ.. ఇప్పుడు బీజేపీ నాయ‌కుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న విష‌యాలు. తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌పై పార్టీ తెలంగాణ చీఫ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌.. పార్టీ నాయ‌కులు భేటీ అయ్యారు. ఓటు హ‌క్కును ఎలా వినియోగించుకోవాలో వివ‌రించారు.

అయితే.. అత్యంత కీల‌క‌మైన ఈ స‌మావేశానికి హైద‌రాబాద్ ప‌రిధిలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ వ‌స్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. ఎక్స్ అఫిషియో స‌భ్యుడిగా.. ఆయన ఓటు కీల‌కంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార‌.. ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ కార్పొరేట‌ర్ల ఓట్ల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం కూడా.. ఆయ‌న చేస్తార‌ని అనుకున్నారు. అలాంటిది కీల‌క స‌మావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారు. పోనీ.. స‌మాచార‌మైనా ఇచ్చారా? అంటే.. అది కూడా లేదు.

దీంతో రాజాసింగ్ త‌ట‌స్థంగా ఉండిపోయే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌న్న చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి విప్ జారీ చేయాల‌ని అనుకున్నా.. ఇది సాధ్య‌మ‌య్యేది కాదు. సో.. ఎవ‌రి మానాన వారు పార్టీకి అనుకూలంగా ఓటేయాల్సి ఉంది. కానీ, రాజా విష‌యంలో మాత్రం అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. కిష‌న్ రెడ్డితో ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఉన్న స‌మ‌స్య‌ల కార‌ణంగా.. ఇద్ద‌రి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. పైగా.. పార్టీ రాష్ట్ర చీఫ్ ఎంపిక విష‌యంపైనా రాజాసింగ్ గ‌రంగ‌రంగానే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న కిష‌న్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని బాహాటంగానే దుయ్య‌బ‌డుతున్నారు. పైకి కిష‌న్‌రెడ్డి పేరు చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని.. కొంద‌రికి ఊడిగం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి స‌మ‌యంలో కీల‌క‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజాసింగ్ ఓటేస్తారా? వేయ‌రా? అనేది సందేహంగా మారింది. ఒక‌వేళ ఆయ‌న త‌ట‌స్థంగా ఉండిపోతే.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Satya

Recent Posts

2026 అర్ధసంవత్సరం… సరిపోని ఉత్సాహం

2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా…

16 minutes ago

ఇంకొంచెం ఆగాలంటున్న రణబాలి ?

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్…

22 minutes ago

ప్రేక్షకులకు నచ్చని కాక్ టైల్ రుచి

షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…

32 minutes ago

సాహో హీరోయిన్ ‘ఈథ’కు టైటిల్ వివాదం

ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…

1 hour ago

పవన్ అంటే అంత పగ ఎందుకు కవిత గారు?

అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…

1 hour ago

ఘట్టమనేని వారసుడి వెనుకడుగు ఎందుకంటే

ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్…

3 hours ago