Political News

జ‌పాన్‌ లో రేవంత్ చేస్తున్న పనేంటి!

“రండి పెట్టుబ‌డులు పెట్టండి. మీకు అవ‌స‌ర‌మైన స‌కల సౌక‌ర్యాలుక‌ల్పించేందుకు మా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది“ అని రేవంత్ రెడ్డి జ‌పాన్ పారిశ్రామిక వేత్త‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నఆయ‌న టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్‌ భాగస్వామ్య కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ పెట్టుబ‌డులకు గ‌మ్య స్థానంగా మారిద‌న్నారు. అనేక ఎక‌రాల భూమి అందుబాటులో ఉంద‌ని.. కేవ‌లం కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే అనుమ‌తులు ఇస్తామ‌ని చెప్పారు.

మౌలిక స‌దుపాయాల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా చేస్తామ‌ని సీఎం చెప్పారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల ప‌రిస్థితులను వివ‌రించారు. ముఖ్యంగా విద్యావంతులైన యువ‌త అందుబాటులో ఉంద‌న్నారు. మెరుగైన శ్రామిక శ‌క్తి కూడా అందుబాటులో ఉంద‌న్నారు. అలాగే, లైఫ్‌ సైన్సెస్‌, జీసీసీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయ‌ని చెప్పారు. అదేవిధ‌దంగా హైద‌రాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీ ని నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. మూసీ న‌దిని తిరిగి ప్ర‌క్షాళ‌న చేస్తున్న‌ట్టు వివ‌రించారు. భారత్‌, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్ నిర్మించే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ప‌లు ఒప్పందాలు.

+సీఎం రేవంత్ రెడ్డి ప‌లు పెట్టుబ‌డుల‌కు సంబంధించి  ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు కూడా ఉన్నాయి.
+ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు 10 వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు మొత్తంతో క్ల‌స్టర్ సెంట‌ర్ ఏర్పాటు ఒప్పందం కుదిరింది.
+ ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
+ రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది.
+ ఈ ఒప్పందం ద్వారా విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలురానున్నాయి.

This post was last modified on April 19, 2025 10:45 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

25 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago