రాజకీయాలు మహా కర్కశంగా ఉంటాయి. ప్రయోజనాలు కలిగే వరకు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. కాస్త లెక్క తేడా వస్తే చాలు చిట్టా విప్పటం మామూలే. అందునా గులాబీ దళానికి ఇలాంటి విషయాల్లో ఉండే నేర్పు అంతా ఇంతా కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలనాథుల్ని తక్కువగా అంచనా వేయటం ఎంత పెద్ద తప్పన్న విషయాన్ని అర్థం చేసుకొని.. ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యేసరికి.. పోలింగ్ వేళ దగ్గర పడింది. జరిగిన తప్పు గురించి పెద్దగా చింతించకుండా ముందు ఏదోలా డ్యామేజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు గులాబీ బ్యాచ్.
దుబ్బాక ఉప ఎన్నిక మొత్తం సర్వం తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నహరీశ్ రావుకు.. ఈ గెలుపు తన సొంత గెలుపు అన్నట్లుగా మారింది. ఈ ఎన్నికల ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే పరిణామాలు ఆయనకు తెలియనివి కావు. తమ అడ్డాలో కానీ కమలవికాసం జరిగితే.. చోటు చేసుకునే అనర్థం ఏమిటో హరీశ్ లాంటి నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బీజేపీని దెబ్బ తీసేందుకు.. తమపై వారు చేస్తున్న ప్రచారానికి.. ఎమోషనల్ ప్రచారానికి తెర తీశారు గులాబీ నేతలు. తాజాగా తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహం గురించి ఏకరువు పెట్టారు హరీశ్. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందన్న ఆయన.. బీజేపీ నేతలు ఏ నైతికతతో దుబ్బాకలో ఓట్లు అడుగుతారని నిలదీస్తున్నారు.
తెలంగాణ పౌరుడిగా తాను అడుగుతున్న 18 ప్రశ్నలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో మంత్రి హరీశ్ రావుకు గుర్తుకు రాని అన్యాయాలు దుబ్బాక పోలింగ్ వేళ గుర్తుకు రావటం ఏమిటన్న ప్రశ్నను పక్కన పెట్టేసి..ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాల్ని చూస్తే..
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…