Political News

తెలంగాణకు బీజేపీ ఎంత ద్రోహం చేసిందో లెక్కలు చెప్పిన హరీశ్

రాజకీయాలు మహా కర్కశంగా ఉంటాయి. ప్రయోజనాలు కలిగే వరకు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. కాస్త లెక్క తేడా వస్తే చాలు చిట్టా విప్పటం మామూలే. అందునా గులాబీ దళానికి ఇలాంటి విషయాల్లో ఉండే నేర్పు అంతా ఇంతా కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలనాథుల్ని తక్కువగా అంచనా వేయటం ఎంత పెద్ద తప్పన్న విషయాన్ని అర్థం చేసుకొని.. ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యేసరికి.. పోలింగ్ వేళ దగ్గర పడింది. జరిగిన తప్పు గురించి పెద్దగా చింతించకుండా ముందు ఏదోలా డ్యామేజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు గులాబీ బ్యాచ్.

దుబ్బాక ఉప ఎన్నిక మొత్తం సర్వం తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నహరీశ్ రావుకు.. ఈ గెలుపు తన సొంత గెలుపు అన్నట్లుగా మారింది. ఈ ఎన్నికల ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే పరిణామాలు ఆయనకు తెలియనివి కావు. తమ అడ్డాలో కానీ కమలవికాసం జరిగితే.. చోటు చేసుకునే అనర్థం ఏమిటో హరీశ్ లాంటి నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీజేపీని దెబ్బ తీసేందుకు.. తమపై వారు చేస్తున్న ప్రచారానికి.. ఎమోషనల్ ప్రచారానికి తెర తీశారు గులాబీ నేతలు. తాజాగా తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహం గురించి ఏకరువు పెట్టారు హరీశ్. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందన్న ఆయన.. బీజేపీ నేతలు ఏ నైతికతతో దుబ్బాకలో ఓట్లు అడుగుతారని నిలదీస్తున్నారు.

తెలంగాణ పౌరుడిగా తాను అడుగుతున్న 18 ప్రశ్నలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో మంత్రి హరీశ్ రావుకు గుర్తుకు రాని అన్యాయాలు దుబ్బాక పోలింగ్ వేళ గుర్తుకు రావటం ఏమిటన్న ప్రశ్నను పక్కన పెట్టేసి..ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాల్ని చూస్తే..

  • తెలంగాణ రాగానే ఏడు మండలాల్ని ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ ప్రభుత్వం కదా?
  • అతి తక్కువ విద్యుత్ ఉత్పత్తి అయ్యే లోయర్ సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఆంధ్రాకు అప్పగించలేదా?
  • విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా మోసం చేయలేదా?
  • యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుంది?
  • ఆంధ్రాకు.. దేశంలోని అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?
  • తెలంగాణ ఏర్పడినా ఆంధ్రా విద్యుత్ ఉద్యోగులు 1153 మంది ఇంకా ఇక్కడే పని చేస్తున్నారు.. వారి మాటేమిటి?
  • వీరి కారణంగా తెలంగాణకు ఏటా రూ.1000 కోట్ల భారం పడుతోంది? ఆంధ్రా ఉద్యోగుల్ని పంపటం లేదెందుకు?
  • తెలంగాణలో 39.5 లక్షల మందికి రూ.2016 చొప్పున పెన్షన్ ఇస్తుంటే..కేంద్రం ఆరు లక్షల మందికి రూ.200పెన్షన్ ఇస్తోంది?
  • దేశ వ్యాప్తంగా కేంద్రం వంద ఎయిర్ పోర్టులు కడుతుంటే.. తెలంగాణకు అందులో అకవాశం లేదెందుకు?
  • వరంగల్ లో కేంద్రం నిర్మిస్తున్న అతి పెద్ద టెక్స్ టైల్స్ పార్కుకునిధులు ఎందుకు ఇవ్వటం లేదు
  • అదిలాబాద్ లో గెలిస్తే సీసీఐని తిరిగి తెరుస్తామన్నారు కదా.. ఎందుకు తెరవలేదు?
  • తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.12వేల కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు?
  • ఎస్సీ వర్గీకరణ.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసినా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదు?

This post was last modified on November 2, 2020 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago