Political News

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు: 793 కోట్ల ఆస్తులు అటాచ్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో అత్యంత కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తుల‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ తాజాగా అటాచ్ చేసింది. త‌ద్వారా రూ.793 కోట్ల ఆస్తుల‌కు సంబంధించి ఎలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించినా.. ఈడీకి చెప్పి చేయాలి. అదేవిధంగా ప్ర‌తి రూపాయికి ఇక నుంచి లెక్క‌లు స‌మ‌ర్పించాలి. ఒక‌ర‌కంగా.. ఇది పెద్ద దెబ్బేన‌ని చెప్పాలి.

ఏంటి విష‌యం?

దాల్మియా సిమెంట్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో వేల కోట్ల రూపాయ‌ల‌తో స‌ద‌రు కంపెనీ పెట్టుబ‌డులు పెట్టింది. ఈ క్ర‌మంలో 417 హెక్టార్ల‌లో ఉన్న సున్న‌పురాయి ఖ‌నిజాల‌ను ఆ సంస్థ పొందింది. ఈ గ‌నుల‌న్నీ క‌డ‌ప‌లోనే ఉన్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ కంపెనీ ద్వారా జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల‌కు సొమ్ములు ముట్టాయ‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం.

అంటే.. నీకిది-నాక‌ది త‌ర‌హాలో దాల్మియా కంపెనీకి అనుమ‌తులు ఇవ్వ‌డం ద్వారా.. జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల్లో ఆ సంస్థ‌తో పెట్టుబ‌డులు పెట్టించారు. ఇలా.. ర‌ఘురామ్ సిమెంట్స్‌లో 95 కోట్ల రూపాయ‌ల విలువైన షేర్ల‌ను దాల్మియా కొనుగోలు చేసింది.(అంటే.. ఒక సిమెంటు కంపెనీ మ‌రో సిమెంటు కంపెనీలో పెట్టుబడులు పెట్ట‌డం). ఇది ఎక్క‌డైనా సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. కానీ.. వైఎస్ హ‌యాంలో జ‌రిగింది.

అదేవిధంగా 55 కోట్ల రూపాయ‌ల‌ను మ‌నీ లాండ‌రింగ్ రూపంలో కూడా ఈ సంస్థ‌కు నిధులు స‌మ‌కూర్చించింది. అంటే.. ఈ మొత్తం 150 కోట్ల రూపాయ‌ల‌ను దాల్మియా.. కంపెనీ జ‌గ‌న్ కంపెనీల‌కు స‌మ‌ర్పించుకుంద‌ని.. ఈడీ లెక్క‌లు తేల్చింది. ఈ క్ర‌మంలోనే దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసింది.

This post was last modified on April 17, 2025 10:28 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

41 minutes ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

2 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

3 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

3 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

4 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

4 hours ago