వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ తాజాగా అటాచ్ చేసింది. తద్వారా రూ.793 కోట్ల ఆస్తులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించినా.. ఈడీకి చెప్పి చేయాలి. అదేవిధంగా ప్రతి రూపాయికి ఇక నుంచి లెక్కలు సమర్పించాలి. ఒకరకంగా.. ఇది పెద్ద దెబ్బేనని చెప్పాలి.
ఏంటి విషయం?
దాల్మియా సిమెంట్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వేల కోట్ల రూపాయలతో సదరు కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 417 హెక్టార్లలో ఉన్న సున్నపురాయి ఖనిజాలను ఆ సంస్థ పొందింది. ఈ గనులన్నీ కడపలోనే ఉన్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఈ కంపెనీ ద్వారా జగన్కు చెందిన కంపెనీలకు సొమ్ములు ముట్టాయన్నది ప్రధాన అభియోగం.
అంటే.. నీకిది-నాకది తరహాలో దాల్మియా కంపెనీకి అనుమతులు ఇవ్వడం ద్వారా.. జగన్కు చెందిన కంపెనీల్లో ఆ సంస్థతో పెట్టుబడులు పెట్టించారు. ఇలా.. రఘురామ్ సిమెంట్స్లో 95 కోట్ల రూపాయల విలువైన షేర్లను దాల్మియా కొనుగోలు చేసింది.(అంటే.. ఒక సిమెంటు కంపెనీ మరో సిమెంటు కంపెనీలో పెట్టుబడులు పెట్టడం). ఇది ఎక్కడైనా సాధ్యమేనా? అన్నది ప్రశ్న. కానీ.. వైఎస్ హయాంలో జరిగింది.
అదేవిధంగా 55 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ రూపంలో కూడా ఈ సంస్థకు నిధులు సమకూర్చించింది. అంటే.. ఈ మొత్తం 150 కోట్ల రూపాయలను దాల్మియా.. కంపెనీ జగన్ కంపెనీలకు సమర్పించుకుందని.. ఈడీ లెక్కలు తేల్చింది. ఈ క్రమంలోనే దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను తాజాగా అటాచ్ చేసింది.
This post was last modified on April 17, 2025 10:28 pm
విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…
హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…
ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…
ఇండియా కాస్ట్లీ మూవీగా చెప్పుకుంటున్న రామాయణ విడుదల కేవలం ఇంకో రెండు నెలల్లో ఉంది. ఇంత తక్కువ సమయం ఉన్నా…