Political News

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు: 793 కోట్ల ఆస్తులు అటాచ్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో అత్యంత కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తుల‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ తాజాగా అటాచ్ చేసింది. త‌ద్వారా రూ.793 కోట్ల ఆస్తుల‌కు సంబంధించి ఎలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించినా.. ఈడీకి చెప్పి చేయాలి. అదేవిధంగా ప్ర‌తి రూపాయికి ఇక నుంచి లెక్క‌లు స‌మ‌ర్పించాలి. ఒక‌ర‌కంగా.. ఇది పెద్ద దెబ్బేన‌ని చెప్పాలి.

ఏంటి విష‌యం?

దాల్మియా సిమెంట్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో వేల కోట్ల రూపాయ‌ల‌తో స‌ద‌రు కంపెనీ పెట్టుబ‌డులు పెట్టింది. ఈ క్ర‌మంలో 417 హెక్టార్ల‌లో ఉన్న సున్న‌పురాయి ఖ‌నిజాల‌ను ఆ సంస్థ పొందింది. ఈ గ‌నుల‌న్నీ క‌డ‌ప‌లోనే ఉన్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ కంపెనీ ద్వారా జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల‌కు సొమ్ములు ముట్టాయ‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం.

అంటే.. నీకిది-నాక‌ది త‌ర‌హాలో దాల్మియా కంపెనీకి అనుమ‌తులు ఇవ్వ‌డం ద్వారా.. జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల్లో ఆ సంస్థ‌తో పెట్టుబ‌డులు పెట్టించారు. ఇలా.. ర‌ఘురామ్ సిమెంట్స్‌లో 95 కోట్ల రూపాయ‌ల విలువైన షేర్ల‌ను దాల్మియా కొనుగోలు చేసింది.(అంటే.. ఒక సిమెంటు కంపెనీ మ‌రో సిమెంటు కంపెనీలో పెట్టుబడులు పెట్ట‌డం). ఇది ఎక్క‌డైనా సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. కానీ.. వైఎస్ హ‌యాంలో జ‌రిగింది.

అదేవిధంగా 55 కోట్ల రూపాయ‌ల‌ను మ‌నీ లాండ‌రింగ్ రూపంలో కూడా ఈ సంస్థ‌కు నిధులు స‌మ‌కూర్చించింది. అంటే.. ఈ మొత్తం 150 కోట్ల రూపాయ‌ల‌ను దాల్మియా.. కంపెనీ జ‌గ‌న్ కంపెనీల‌కు స‌మ‌ర్పించుకుంద‌ని.. ఈడీ లెక్క‌లు తేల్చింది. ఈ క్ర‌మంలోనే దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసింది.

This post was last modified on April 17, 2025 10:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: EDYS Jagan

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago