Political News

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు: 793 కోట్ల ఆస్తులు అటాచ్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో అత్యంత కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తుల‌ను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ తాజాగా అటాచ్ చేసింది. త‌ద్వారా రూ.793 కోట్ల ఆస్తుల‌కు సంబంధించి ఎలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించినా.. ఈడీకి చెప్పి చేయాలి. అదేవిధంగా ప్ర‌తి రూపాయికి ఇక నుంచి లెక్క‌లు స‌మ‌ర్పించాలి. ఒక‌ర‌కంగా.. ఇది పెద్ద దెబ్బేన‌ని చెప్పాలి.

ఏంటి విష‌యం?

దాల్మియా సిమెంట్స్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో వేల కోట్ల రూపాయ‌ల‌తో స‌ద‌రు కంపెనీ పెట్టుబ‌డులు పెట్టింది. ఈ క్ర‌మంలో 417 హెక్టార్ల‌లో ఉన్న సున్న‌పురాయి ఖ‌నిజాల‌ను ఆ సంస్థ పొందింది. ఈ గ‌నుల‌న్నీ క‌డ‌ప‌లోనే ఉన్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ కంపెనీ ద్వారా జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల‌కు సొమ్ములు ముట్టాయ‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం.

అంటే.. నీకిది-నాక‌ది త‌ర‌హాలో దాల్మియా కంపెనీకి అనుమ‌తులు ఇవ్వ‌డం ద్వారా.. జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల్లో ఆ సంస్థ‌తో పెట్టుబ‌డులు పెట్టించారు. ఇలా.. ర‌ఘురామ్ సిమెంట్స్‌లో 95 కోట్ల రూపాయ‌ల విలువైన షేర్ల‌ను దాల్మియా కొనుగోలు చేసింది.(అంటే.. ఒక సిమెంటు కంపెనీ మ‌రో సిమెంటు కంపెనీలో పెట్టుబడులు పెట్ట‌డం). ఇది ఎక్క‌డైనా సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. కానీ.. వైఎస్ హ‌యాంలో జ‌రిగింది.

అదేవిధంగా 55 కోట్ల రూపాయ‌ల‌ను మ‌నీ లాండ‌రింగ్ రూపంలో కూడా ఈ సంస్థ‌కు నిధులు స‌మ‌కూర్చించింది. అంటే.. ఈ మొత్తం 150 కోట్ల రూపాయ‌ల‌ను దాల్మియా.. కంపెనీ జ‌గ‌న్ కంపెనీల‌కు స‌మ‌ర్పించుకుంద‌ని.. ఈడీ లెక్క‌లు తేల్చింది. ఈ క్ర‌మంలోనే దాల్మియా కంపెనీకి చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తుల‌ను తాజాగా అటాచ్ చేసింది.

This post was last modified on April 17, 2025 10:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: EDYS Jagan

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

40 minutes ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

5 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

7 hours ago

రాజ్యసభలో రచ్చ.. ఎవరీ రేణుక చౌదరి?

తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.. రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే…

8 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

8 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

8 hours ago