ఏపీలోని కియా కార్ల కంపెనీకి చెందిన 900 ఇంజిన్లు మాయమైన ఘటన నిజంగానే అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన కారు ఇంజిన్లు చోరీకి గురయ్యాయని నిర్ధారించుకున్న కియా యాజమాన్యం.. ఒకింత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా… అసలు ఈ చోరీకి సంబంధించిన గుట్టు ఇంకా వీడలేదన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తెలుగు నేల విభజన తర్వాత ఏపీకి పారిశ్రామికంగా తొలి అడుగు కియాతోనే పడిందని చెప్పాలి. ఉమ్మడి అనంతపురం జిల్లా… ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని పెనుగొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో కియా కార్ల తయారీ జరుగుతోంది. ఇక్కడ తయారయ్యే కార్లకు సంబంధించిన వివిధ విడిభాగాలు వివిధ ప్రదేశాల నుంచి ఎర్రమంచి యూనిట్ ను చేరుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైన ఇంజిన్లు విదేశాల నుంచి తమిళనాడు రాజధాని చెన్నై పోర్టుకు వస్తాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ఆ ఇంజిన్లు కియా యూనిట్ కు చేరతాయి. మరి 900 ఇంజిన్లు ఎలా మాయమయ్యాయి? అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.
కియా యూనిట్ కు చేరిన తర్వాత…కియా కంపెనీలోకి చేరిన ఏ చిన్న వస్తువు కూడా యాజమాన్యానికి తెలియకుండా బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఒకవేళ అలా వస్తే..కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగుల హస్తం తప్పనిసరిగా ఉండాల్సిందే. అలా కాకుంటే.. ఇంజిన్లు కంపెనీకి చేరకముందే మాయమై ఉండాలి. అంటే… చెన్నై పోర్టుకు చేరే సమయంలోనో, లేదంటే చెన్నై పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనో, లేదంటే చెన్నై నుంచి కియా యూనిట్ కు చేరే క్రమంలోనో ఈ ఇంజిన్లు మాయమై ఉండాలి. ఇదే నిజం అనుకుంటే…ఒకేసారి 900 ఇంజిన్లు మాయం కావడం దుస్సాధ్యం. అంటే.. నెలల తరబడి ఈ చోరీ జరిగిందని భావించక తప్పదు.
కియా కార్ల ఇంజిన్ల మాయంపై ఏర్పాటైన సిట్ తమిళనాడుకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే వీరంతా ఎవరు? ఎక్కడివారు? కంపెనీ ఉద్యోగులా? ట్రాన్స్ పోర్టర్లా? కూలీలా?.. కియా కార్ల ఇంజిన్లను వీరు ఎక్కడి నుంచి చోరీ చేశారు? అసలు ఎంతకాలం నుంచి ఈ చోరీ జరుగుతోంది? అన్న వివరాలేమీ బయటకు రాలేదు. 9 మంది అరెస్టులనే పోలీసులు ధృవీకరించడం లేదు. అంటే…అరెస్టులు జరిగినా.. కియా కార్ల ఇంజిన్ల చోరీకి సంబందించిన గుట్టు పూర్తిగా వీడలేదన్నవాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కియా కార్ల ఇంజిన్ల చోరీ ఇప్పుడు అంతు చిక్కని సమస్యలా మారిపోయింది.
This post was last modified on April 17, 2025 7:07 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…