Political News

కియా దొంగలు దొరికారా?… గుట్టు వీడలేదా?

ఏపీలోని కియా కార్ల కంపెనీకి చెందిన 900 ఇంజిన్లు మాయమైన ఘటన నిజంగానే అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన కారు ఇంజిన్లు చోరీకి గురయ్యాయని నిర్ధారించుకున్న కియా యాజమాన్యం.. ఒకింత ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన సిట్ ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా… అసలు ఈ చోరీకి సంబంధించిన గుట్టు ఇంకా వీడలేదన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తెలుగు నేల విభజన తర్వాత ఏపీకి పారిశ్రామికంగా తొలి అడుగు కియాతోనే పడిందని చెప్పాలి. ఉమ్మడి అనంతపురం జిల్లా… ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని పెనుగొండ మండలం ఎర్రమంచి పంచాయతీ పరిధిలో కియా కార్ల తయారీ జరుగుతోంది. ఇక్కడ తయారయ్యే కార్లకు సంబంధించిన వివిధ విడిభాగాలు వివిధ ప్రదేశాల నుంచి ఎర్రమంచి యూనిట్ ను చేరుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైన ఇంజిన్లు విదేశాల నుంచి తమిళనాడు రాజధాని చెన్నై పోర్టుకు వస్తాయి. అక్కడి నుంచి కంటైనర్లలో ఆ ఇంజిన్లు కియా యూనిట్ కు చేరతాయి. మరి 900 ఇంజిన్లు ఎలా మాయమయ్యాయి? అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.

కియా యూనిట్ కు చేరిన తర్వాత…కియా కంపెనీలోకి చేరిన ఏ చిన్న వస్తువు కూడా యాజమాన్యానికి తెలియకుండా బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఒకవేళ అలా వస్తే..కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగుల హస్తం తప్పనిసరిగా ఉండాల్సిందే. అలా కాకుంటే.. ఇంజిన్లు కంపెనీకి చేరకముందే మాయమై ఉండాలి. అంటే… చెన్నై పోర్టుకు చేరే సమయంలోనో, లేదంటే చెన్నై పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనో, లేదంటే చెన్నై నుంచి కియా యూనిట్ కు చేరే క్రమంలోనో ఈ ఇంజిన్లు మాయమై ఉండాలి. ఇదే నిజం అనుకుంటే…ఒకేసారి 900 ఇంజిన్లు మాయం కావడం దుస్సాధ్యం. అంటే.. నెలల తరబడి ఈ చోరీ జరిగిందని భావించక తప్పదు. 

కియా కార్ల ఇంజిన్ల మాయంపై ఏర్పాటైన సిట్ తమిళనాడుకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే వీరంతా ఎవరు? ఎక్కడివారు? కంపెనీ ఉద్యోగులా? ట్రాన్స్ పోర్టర్లా? కూలీలా?.. కియా కార్ల ఇంజిన్లను వీరు ఎక్కడి నుంచి చోరీ చేశారు? అసలు ఎంతకాలం నుంచి ఈ చోరీ జరుగుతోంది? అన్న వివరాలేమీ బయటకు రాలేదు. 9 మంది అరెస్టులనే పోలీసులు ధృవీకరించడం లేదు. అంటే…అరెస్టులు జరిగినా.. కియా కార్ల ఇంజిన్ల చోరీకి సంబందించిన గుట్టు పూర్తిగా వీడలేదన్నవాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కియా కార్ల ఇంజిన్ల చోరీ ఇప్పుడు అంతు చిక్కని సమస్యలా మారిపోయింది.

This post was last modified on April 17, 2025 7:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago