Political News

కాశ్మీర్ పై పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కశ్మీర్ విషయాన్ని లేవనెత్తుతూ, దానిపై తమ వైఖరి ఎలాంటి మార్పులేని దృక్పథాన్ని ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీయుల కన్వెన్షన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీ కాకపోయినా, మళ్లీ అదే రాగం పాడుతుండటమే పెద్దగా చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని మరచిపోమని మునీర్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై పాక్ యొక్క వ్యాఖ్యలకు పెద్దగా స్పందన లేకపోయినా, మునీర్ మాత్రం మరోసారి దేశీయ వేదికపై ఈ అంశాన్ని జోరుగా లేపారు. “కశ్మీర్ సోదరులను వదిలేశాము అనే ఆలోచనే లేదు” అంటూ ఆయన బలమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్‌ను ప్రత్యక్షంగా టార్గెట్ చేయకపోయినా, పరోక్షంగా మాత్రం తమ మొండి వైఖరిని బలపరుస్తూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తమ విధానంలో ఎలాంటి వెనుకడుగు లేదన్న సంకేతాలే ఇచ్చారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌పై దాయాదికి ఉన్న ఏకైక సంబంధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కశ్మీర్‌ భారత భూభాగమని, విదేశీ భూమిని జీవనాడిగా ఎలా పరిగణిస్తారని ఆయన ప్రశ్నించారు. ఐరాస వేదికగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కూడా పాక్‌కి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్‌ భారత్‌ లోనే అంతర్భాగమని, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు.

ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పీఓకే లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని వ్యాఖ్యానించారు. పాక్ ఆ ప్రాంతాన్ని ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. ముంబయి దాడుల్లో పాత్ర వహించిన తహవ్వుర్ రాణాను పాక్ ఇప్పటికీ రక్షిస్తోందని జైస్వాల్ మండిపడ్డారు. అలాగే ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ అరెస్ట్ అయ్యాడని, అతడిని భారత్‌కు తీసుకురావడంపై బెల్జియం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.

This post was last modified on April 17, 2025 5:38 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago