నాయకులు పట్టుబట్టి విజయం దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒకప్పుడు వైసీపీ హవాలో ఉన్న ఈ సింహపురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది పటాటోపంగానే ఉందని.. తమకు ఎలాంటి పవరూ లేదని చెప్పుకొస్తున్నారు తమ్ముళ్లు. వైసీపీ నుంచి కొందరు నాయకులు.. గత ఎన్నికలకు ముందు టీడీపీ బాట పట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజయం దక్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండగా.. కూడా వారే అధికారంలో ఉండి చక్రం తిప్పారు. దీంతో అప్పటి విపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు వీరిపైపోరాటం చేశారు.
కానీ, వారు గతంలో పోరాటం చేసిన వారే.. ఉద్యమాలు చేసి.. నిరసనలు వ్యక్తం చేసిన వారే.. ఇప్పుడు కామ్ అయిపోయారు. కారణం.. వైసీపీలో ఉండగా చక్రంతిప్పిన చాలా మంది నాయకులు చంద్రబాబు వద్ద పట్టు పెంచుకుని.. ఇప్పుడు కూడా చెలరేగి పోతున్నారు. దీంతో తమ్ముళ్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేతురా లింగా! అంటూ పద్యాలు పాడుకుంటున్నారు. 2024కు ముందు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు.
వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్కుమార్ యాదవ్ తిరిగి అంతకంటే తీవ్రంగా టీడీపీలో చక్రం తిప్పుతూ.. మైనింగ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ పాత నేతలు.. గతంలో వీరే మైనింగ్ చేస్తున్నారంటూ ఉద్యమించిన తమ్ముళ్లు ఇప్పుడు రగిలిపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. కానీ, దానిని అడ్డు పెట్టుకుని కీలక గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్పోర్ట్ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నా.. తమ్ముళ్లకు తెలిసినా.. ఎవరూ మాట్లాడడం లేదు.
మరోవైపు.. కీలకమైన.. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని నాయకులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. పన్నెత్తు మాట కూడా అనడం లేదు. కానీలోలోన మాత్రం కుమిలి పోతున్నారు. దీనికి కారణం.. బలమైన నాయకుడు ఎంపీగా ఉండడం, ఆయనకు చంద్రబాబు దగ్గర మంచి లౌక్యం ఉండడంతోపాటు.. ఆయన సతీమణి కూడా.. ప్రజాప్రతినిధిగా ఉండడంతో ఆయన పరివారానికి ఎదురు లేకుండా పోయింది. దీంతో అయ్యో.. ఒకప్పుడు వీరిపైనే యుద్ధం చేశాం.. ఇప్పుడు కూడా.. అదే పనిచేస్తున్నా.. మౌనంగా ఉండాల్సి వచ్చిందే.. అని వాపోతున్నారు తమ్ముళ్లు.
This post was last modified on April 17, 2025 1:15 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…