Political News

గ‌ట్టిగా గెలిచినా.. ప‌ట్టు లేని త‌మ్ముళ్లు..

నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టి విజ‌యం ద‌క్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒక‌ప్పుడు వైసీపీ హ‌వాలో ఉన్న ఈ సింహ‌పురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది ప‌టాటోపంగానే ఉంద‌ని.. త‌మ‌కు ఎలాంటి ప‌వ‌రూ లేద‌ని చెప్పుకొస్తున్నారు త‌మ్ముళ్లు. వైసీపీ నుంచి కొంద‌రు నాయ‌కులు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ బాట ప‌ట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండ‌గా.. కూడా వారే అధికారంలో ఉండి చ‌క్రం తిప్పారు. దీంతో అప్ప‌టి విప‌క్షంలో ఉన్న టీడీపీ నాయ‌కులు వీరిపైపోరాటం చేశారు.

కానీ, వారు గ‌తంలో పోరాటం చేసిన వారే.. ఉద్య‌మాలు చేసి.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన వారే.. ఇప్పుడు కామ్ అయిపోయారు. కార‌ణం.. వైసీపీలో ఉండ‌గా చ‌క్రంతిప్పిన చాలా మంది నాయ‌కులు చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ట్టు పెంచుకుని.. ఇప్పుడు కూడా చెల‌రేగి పోతున్నారు. దీంతో త‌మ్ముళ్లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏమి చేతురా లింగా! అంటూ ప‌ద్యాలు పాడుకుంటున్నారు. 2024కు ముందు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్‌ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్‌కుమార్‌ యాదవ్‌ తిరిగి అంతకంటే తీవ్రంగా టీడీపీలో చ‌క్రం తిప్పుతూ.. మైనింగ్‌ చేస్తున్నారు. దీంతో టీడీపీ పాత నేత‌లు.. గ‌తంలో వీరే మైనింగ్ చేస్తున్నారంటూ ఉద్య‌మించిన త‌మ్ముళ్లు ఇప్పుడు రగిలిపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. కానీ, దానిని అడ్డు పెట్టుకుని కీల‌క గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్‌పోర్ట్‌ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నా.. త‌మ్ముళ్ల‌కు తెలిసినా.. ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు.

మ‌రోవైపు.. కీలక‌మైన‌.. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. కానీలోలోన మాత్రం కుమిలి పోతున్నారు. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన నాయ‌కుడు ఎంపీగా ఉండ‌డం, ఆయ‌న‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి లౌక్యం ఉండ‌డంతోపాటు.. ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండ‌డంతో ఆయ‌న ప‌రివారానికి ఎదురు లేకుండా పోయింది. దీంతో అయ్యో.. ఒక‌ప్పుడు వీరిపైనే యుద్ధం చేశాం.. ఇప్పుడు కూడా.. అదే ప‌నిచేస్తున్నా.. మౌనంగా ఉండాల్సి వ‌చ్చిందే.. అని వాపోతున్నారు త‌మ్ముళ్లు.

Satya

Recent Posts

పవర్ ప్లే అయ్యింది… అసలు ఆట ఇప్పుడుంది

కొత్త శుక్రవారం వచ్చేసింది. పెద్దికి ఇవాళ తొమ్మిదో రోజు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం రెండో వారం…

15 minutes ago

ఇండియన్ 3 మీద ఇంకా ఆశలున్నాయా

కమల్ హాసన్ అభిమానులే మర్చిపోయిన పేరు ఇండియన్. మొన్న ఏడాది దీని రెండో భాగం వచ్చి ఎంత డిజాస్టర్ అయ్యిందో…

33 minutes ago

విద్యాశాఖ‌ విజేత‌… నారా లోకేష్‌!

విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…

2 hours ago

సింగ్ గీతం… టాలీవుడ్ అదృష్టం

ఈ రోజు విడుదలైన సింగ్ గీతం కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుంది, నిర్మాతలకు డబ్బులు ఇస్తుందా లేదానేది పక్కనపెడితే…

2 hours ago

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత…

3 hours ago

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…

4 hours ago