Political News

గ‌ట్టిగా గెలిచినా.. ప‌ట్టు లేని త‌మ్ముళ్లు..

నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టి విజ‌యం ద‌క్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒక‌ప్పుడు వైసీపీ హ‌వాలో ఉన్న ఈ సింహ‌పురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది ప‌టాటోపంగానే ఉంద‌ని.. త‌మ‌కు ఎలాంటి ప‌వ‌రూ లేద‌ని చెప్పుకొస్తున్నారు త‌మ్ముళ్లు. వైసీపీ నుంచి కొంద‌రు నాయ‌కులు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ బాట ప‌ట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండ‌గా.. కూడా వారే అధికారంలో ఉండి చ‌క్రం తిప్పారు. దీంతో అప్ప‌టి విప‌క్షంలో ఉన్న టీడీపీ నాయ‌కులు వీరిపైపోరాటం చేశారు.

కానీ, వారు గ‌తంలో పోరాటం చేసిన వారే.. ఉద్య‌మాలు చేసి.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన వారే.. ఇప్పుడు కామ్ అయిపోయారు. కార‌ణం.. వైసీపీలో ఉండ‌గా చ‌క్రంతిప్పిన చాలా మంది నాయ‌కులు చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ట్టు పెంచుకుని.. ఇప్పుడు కూడా చెల‌రేగి పోతున్నారు. దీంతో త‌మ్ముళ్లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏమి చేతురా లింగా! అంటూ ప‌ద్యాలు పాడుకుంటున్నారు. 2024కు ముందు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్‌ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్‌కుమార్‌ యాదవ్‌ తిరిగి అంతకంటే తీవ్రంగా టీడీపీలో చ‌క్రం తిప్పుతూ.. మైనింగ్‌ చేస్తున్నారు. దీంతో టీడీపీ పాత నేత‌లు.. గ‌తంలో వీరే మైనింగ్ చేస్తున్నారంటూ ఉద్య‌మించిన త‌మ్ముళ్లు ఇప్పుడు రగిలిపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. కానీ, దానిని అడ్డు పెట్టుకుని కీల‌క గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్‌పోర్ట్‌ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నా.. త‌మ్ముళ్ల‌కు తెలిసినా.. ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు.

మ‌రోవైపు.. కీలక‌మైన‌.. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. కానీలోలోన మాత్రం కుమిలి పోతున్నారు. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన నాయ‌కుడు ఎంపీగా ఉండ‌డం, ఆయ‌న‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి లౌక్యం ఉండ‌డంతోపాటు.. ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండ‌డంతో ఆయ‌న ప‌రివారానికి ఎదురు లేకుండా పోయింది. దీంతో అయ్యో.. ఒక‌ప్పుడు వీరిపైనే యుద్ధం చేశాం.. ఇప్పుడు కూడా.. అదే ప‌నిచేస్తున్నా.. మౌనంగా ఉండాల్సి వ‌చ్చిందే.. అని వాపోతున్నారు త‌మ్ముళ్లు.

This post was last modified on April 17, 2025 1:15 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

8 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

10 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

10 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

10 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

12 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

15 hours ago