Political News

గ‌ట్టిగా గెలిచినా.. ప‌ట్టు లేని త‌మ్ముళ్లు..

నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టి విజ‌యం ద‌క్కించుకున్నారు. నెల్లూరు జిల్లాను దాదాపు క్లీన్ స్వీప్ చేసుకున్నారు. ఒక‌ప్పుడు వైసీపీ హ‌వాలో ఉన్న ఈ సింహ‌పురి.. ఇప్పుడు సైకిలెక్కింది. అయితే.. ఇది ప‌టాటోపంగానే ఉంద‌ని.. త‌మ‌కు ఎలాంటి ప‌వ‌రూ లేద‌ని చెప్పుకొస్తున్నారు త‌మ్ముళ్లు. వైసీపీ నుంచి కొంద‌రు నాయ‌కులు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ బాట ప‌ట్టారు. టికెట్లు తెచ్చుకున్నారు.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వైసీపీలో ఉండ‌గా.. కూడా వారే అధికారంలో ఉండి చ‌క్రం తిప్పారు. దీంతో అప్ప‌టి విప‌క్షంలో ఉన్న టీడీపీ నాయ‌కులు వీరిపైపోరాటం చేశారు.

కానీ, వారు గ‌తంలో పోరాటం చేసిన వారే.. ఉద్య‌మాలు చేసి.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన వారే.. ఇప్పుడు కామ్ అయిపోయారు. కార‌ణం.. వైసీపీలో ఉండ‌గా చ‌క్రంతిప్పిన చాలా మంది నాయ‌కులు చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ట్టు పెంచుకుని.. ఇప్పుడు కూడా చెల‌రేగి పోతున్నారు. దీంతో త‌మ్ముళ్లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏమి చేతురా లింగా! అంటూ ప‌ద్యాలు పాడుకుంటున్నారు. 2024కు ముందు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్‌ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్‌కుమార్‌ యాదవ్‌ తిరిగి అంతకంటే తీవ్రంగా టీడీపీలో చ‌క్రం తిప్పుతూ.. మైనింగ్‌ చేస్తున్నారు. దీంతో టీడీపీ పాత నేత‌లు.. గ‌తంలో వీరే మైనింగ్ చేస్తున్నారంటూ ఉద్య‌మించిన త‌మ్ముళ్లు ఇప్పుడు రగిలిపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. కానీ, దానిని అడ్డు పెట్టుకుని కీల‌క గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్‌పోర్ట్‌ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నా.. త‌మ్ముళ్ల‌కు తెలిసినా.. ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు.

మ‌రోవైపు.. కీలక‌మైన‌.. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. కానీలోలోన మాత్రం కుమిలి పోతున్నారు. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన నాయ‌కుడు ఎంపీగా ఉండ‌డం, ఆయ‌న‌కు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి లౌక్యం ఉండ‌డంతోపాటు.. ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండ‌డంతో ఆయ‌న ప‌రివారానికి ఎదురు లేకుండా పోయింది. దీంతో అయ్యో.. ఒక‌ప్పుడు వీరిపైనే యుద్ధం చేశాం.. ఇప్పుడు కూడా.. అదే ప‌నిచేస్తున్నా.. మౌనంగా ఉండాల్సి వ‌చ్చిందే.. అని వాపోతున్నారు త‌మ్ముళ్లు.

Satya

Recent Posts

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

2 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

2 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

3 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

3 hours ago

నరాల్లో హార్పిక్ ఎక్కించడం ఏంటి తల్లీ

నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…

3 hours ago

ఈసారి స్వయంగా రంగంలోకి దిగుతున్న PK

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ PK .. ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ప్ర‌త్య‌క్ష…

3 hours ago