వేసవి అంటే ఒకప్పుడు భారీ చిత్రాలు, కలెక్షన్ల జాతరతో బాక్సాఫీస్ కళకళలాడిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనాలకు ఐపీఎల్ సహా వినోద మార్గాలు పెరిగిపోయి, ఆసక్తికర సినిమాలు అందుబాటులో లేక థియేటర్ల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. అప్పుడప్పుడూ ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నా సరే.. బాక్సాఫీస్ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ వారం రెండు క్రేజీ మూవీస్ రిలీజవుతున్నాయి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల-2.. ఈ రెండు చిత్రాలూ టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్నాయి. ప్రామిసింగ్గా కనిపించాయి.
సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాలు బాగానే ట్రెండ్ అయ్యాయి. వీటికి బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఐతే తీరా రిలీజ్ టైం దగ్గరపడేసరికి బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. ఈ రోజు రిలీజవుతున్న ‘ఓదెల-2’కు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూస్తే పచ్చతోరణాలే కనిపిస్తున్నాయి. హౌస్ ఫుల్స్ సంగతి పక్కన పెడితే.. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలే కనిపించడం లేదు. డబుల్ డిజిట్ టికెట్లు తెగిన థియేటర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.
ఇక శుక్రవారం రిలీజవతుున్న కళ్యాణ్ రామ్ సినిమా పరిస్థితి కొంచెం బెటరే కానీ.. దానికి కూడా బుకింగ్స్ మరీ ఆశాజనకంగా ఏమీ కనిపించడం లేదు. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు చాలా తక్కువగా ఉన్నాయి. అది మాంచి మాస్ సినిమాలా కనిపిస్తున్నా సరే.. బుకింగ్స్ డల్లుగానే ఉన్నాయి. యూత్ అంతా ఐపీఎల్ మాయలో ఉండడం ప్రధానంగా సినిమాలకు మైనస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలకు ఇప్పుడు టాక్ కీలకంగా మారింది. ‘చాలా బాగుంది’ అనే టాక్ వస్తేనే జనం థియేటర్లకు కదిలేలా ఉన్నారు. మరి ఈ రోజు, రేపు ఉదయం మార్నింగ్ షోల తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on April 17, 2025 1:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…