ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డి సీటుకే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం.. భర్తీ కానున్న ఈ సీటుకు ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను తీసుకుంటారు.
అనంతరం.. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలిస్తారు. మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక.. మే 9వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రకియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే సాగనుంది. కాగా.. ఈ ఎన్నిక ద్వారా రాజ్యసభలో అడుగు పెట్టే అభ్యర్థి కేవలం 3 సంవత్సరాల వరకే.. పెద్దల సభలో అభ్యర్తిగా ఉండనున్నారు.
2022, జూన్లో వైసీపీ అధినేత జగన్.. మరోసారి సాయిరెడ్డికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆయన ఈ ఏడాది మొదటి వరకు కూడా.. రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. అనంతరం.. వైసీపీకి రాజీనామా చేసి.. పెద్దల సభ నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల సభ్యత్వంలో ఇప్పటి వరకు.. అంటే.. ఆయన రాజీనామా చేసే నాటికి మిగిలిన సమయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
సో.. దీనిని ఎవరు చేపట్టినా.. మాగ్జిమం 3 ఏళ్ల వరకు మాత్రమే పెద్దల సభలో ఉండనున్నారు. తాజా పరిణామాలను బట్టి.. ఈ సీటును టీడీపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యే కోటా ఎన్నిక ద్వారా రాజ్యసభకు ఎంపిక చేసే ఎన్నిక కావడం గమనార్హం.
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…