తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలు రెడీ చేసుకోవచ్చని ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో అన్నీ పార్టీలు ఒక్కసారిగా క్రియాశీలమైపోయాయి.
ఇదే విషయమై పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం జూమ్ యాప్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం 2016లో జరిగినట్లే 150 డవిజన్లకే ఎన్నికలు జరుగుతాయి. అలాగే అప్పట్లో జరిగిన రిజర్వేషన్లనే ఇపుడు కూడా అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించంటంతో రిజర్వుడు డివిజన్ల విషయంలో కూడా అందరిలోను స్పష్టట ఉంటుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నేతలతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆసక్తి ఉన్న నేతలతో జాబితా తయారు చేయాలని చెప్పారు. వీలైనంతలో ప్రతి డివిజన్లో యువనేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు గుర్తుచేయాలని చంద్రబాబు స్పష్టంచేశారు.
పోయినసారి ఎన్నికల్లో ప్రచారం విషయంలో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని డివిజన్లలో పార్టీ ప్రదాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ మాత్రమే ప్రచారం చేశారు. అప్పటి ఎన్నికల్లో పోటి చేసిన డివిజన్లలో టీడీపీ ఎక్కడా గెలవలేదు. దాంతో తెలంగాణా టీడీపీ బాగా నీరసపడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు కూడా తెలంగాణాలో టీడీపీని దాదాపుగా అధ్యక్షుడు ఎల్. రమణకే వదిలిపెట్టేశారు.
అలాంటిది ఇపుడు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రెగ్యులర్ గా తెలంగాణా నేతలతో టచ్ లోనే ఉంటున్నారు. ఇటువంటి సమయంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరి చంద్రబాబు ఎటువంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. పోయిన ఎన్నికల్లో అంటే చంద్రబాబు ఏపి సీఎంగా ఉన్నారు కాబట్టి జీహచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. కానీ ఇపుడు రెండు రాష్ట్రాల్లోను ప్రతిపక్షమే. పైగా గడచిన ఏడు మాసాలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి చంద్రబాబు ఏమి చేయబోతున్నారనేది సస్పెన్సుగా మారింది.
This post was last modified on November 1, 2020 3:02 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…