Political News

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి దృష్టి చంద్రబాబు పైనే

తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలు రెడీ చేసుకోవచ్చని ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో అన్నీ పార్టీలు ఒక్కసారిగా క్రియాశీలమైపోయాయి.

ఇదే విషయమై పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం జూమ్ యాప్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం 2016లో జరిగినట్లే 150 డవిజన్లకే ఎన్నికలు జరుగుతాయి. అలాగే అప్పట్లో జరిగిన రిజర్వేషన్లనే ఇపుడు కూడా అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించంటంతో రిజర్వుడు డివిజన్ల విషయంలో కూడా అందరిలోను స్పష్టట ఉంటుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నేతలతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆసక్తి ఉన్న నేతలతో జాబితా తయారు చేయాలని చెప్పారు. వీలైనంతలో ప్రతి డివిజన్లో యువనేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు గుర్తుచేయాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

పోయినసారి ఎన్నికల్లో ప్రచారం విషయంలో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని డివిజన్లలో పార్టీ ప్రదాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ మాత్రమే ప్రచారం చేశారు. అప్పటి ఎన్నికల్లో పోటి చేసిన డివిజన్లలో టీడీపీ ఎక్కడా గెలవలేదు. దాంతో తెలంగాణా టీడీపీ బాగా నీరసపడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు కూడా తెలంగాణాలో టీడీపీని దాదాపుగా అధ్యక్షుడు ఎల్. రమణకే వదిలిపెట్టేశారు.

అలాంటిది ఇపుడు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రెగ్యులర్ గా తెలంగాణా నేతలతో టచ్ లోనే ఉంటున్నారు. ఇటువంటి సమయంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరి చంద్రబాబు ఎటువంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. పోయిన ఎన్నికల్లో అంటే చంద్రబాబు ఏపి సీఎంగా ఉన్నారు కాబట్టి జీహచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. కానీ ఇపుడు రెండు రాష్ట్రాల్లోను ప్రతిపక్షమే. పైగా గడచిన ఏడు మాసాలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి చంద్రబాబు ఏమి చేయబోతున్నారనేది సస్పెన్సుగా మారింది.

This post was last modified on November 1, 2020 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

2 hours ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

3 hours ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

3 hours ago

గుంటూరు మేయర్ రాజీనామా… తర్వాతేంటీ?

ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా…

3 hours ago

పవన్ క్లారిటీతో వివాదం సద్దుమణిగినట్టేనా?

త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…

4 hours ago

అర్జున్ రెడ్డి భామకు బ్రేక్ దొరికిందా

షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్…

4 hours ago