తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలు రెడీ చేసుకోవచ్చని ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో అన్నీ పార్టీలు ఒక్కసారిగా క్రియాశీలమైపోయాయి.
ఇదే విషయమై పార్టీ నేతలతో చంద్రబాబు శనివారం జూమ్ యాప్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం 2016లో జరిగినట్లే 150 డవిజన్లకే ఎన్నికలు జరుగుతాయి. అలాగే అప్పట్లో జరిగిన రిజర్వేషన్లనే ఇపుడు కూడా అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించంటంతో రిజర్వుడు డివిజన్ల విషయంలో కూడా అందరిలోను స్పష్టట ఉంటుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నేతలతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆసక్తి ఉన్న నేతలతో జాబితా తయారు చేయాలని చెప్పారు. వీలైనంతలో ప్రతి డివిజన్లో యువనేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు గుర్తుచేయాలని చంద్రబాబు స్పష్టంచేశారు.
పోయినసారి ఎన్నికల్లో ప్రచారం విషయంలో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని డివిజన్లలో పార్టీ ప్రదాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ మాత్రమే ప్రచారం చేశారు. అప్పటి ఎన్నికల్లో పోటి చేసిన డివిజన్లలో టీడీపీ ఎక్కడా గెలవలేదు. దాంతో తెలంగాణా టీడీపీ బాగా నీరసపడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు కూడా తెలంగాణాలో టీడీపీని దాదాపుగా అధ్యక్షుడు ఎల్. రమణకే వదిలిపెట్టేశారు.
అలాంటిది ఇపుడు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రెగ్యులర్ గా తెలంగాణా నేతలతో టచ్ లోనే ఉంటున్నారు. ఇటువంటి సమయంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరి చంద్రబాబు ఎటువంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. పోయిన ఎన్నికల్లో అంటే చంద్రబాబు ఏపి సీఎంగా ఉన్నారు కాబట్టి జీహచ్ఎంసి ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. కానీ ఇపుడు రెండు రాష్ట్రాల్లోను ప్రతిపక్షమే. పైగా గడచిన ఏడు మాసాలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి చంద్రబాబు ఏమి చేయబోతున్నారనేది సస్పెన్సుగా మారింది.
This post was last modified on November 1, 2020 3:02 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…