సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన క్షణాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవాల.. తిరుమల శ్రీ వెంక టేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె.. సంప్రదాయ డిక్లరేషన్పై సంతకం చేశారు. అనంతరం భూవరాహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తర్వాత.. కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించారు. అనంతరం గౌతమి అతిథి గృహంలో గత రాత్రి బస చేశారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు.
ఇక, మధ్యాహ్నం 12 గంటలకు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సత్రానికి చేరుకున్న ఆమె.. మార్క్ శంకర్ పేరుతో ఒక రోజు భోజనానికి అయ్యే ఖర్చు రూ.17 లక్షలను సమర్పించి.. ఆ ఖర్చును విరాళంగా స్వామి భక్తులకు అన్న ప్రసాద రూపంలో అందించారు. అంతేకాదు.. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పాల్గొనరాదని.. జనసేన ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. అన్నా భక్తికి, ఆమె సేవకు.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రసంశలు కురిపిస్తున్నారు.
This post was last modified on April 14, 2025 2:17 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…