ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరాతిని మురగబెట్టడంతో అంచనా వ్యయం పెరిగిపోయింది. దీనికి తోడు అన్ని శాఖల్లోనూ అప్పులు పేరుకుపోయాయి. దీంతో స్వయంగా రాజధానిని నిర్మించలేక.. కేంద్రం నుంచి సాయం తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే.. కేంద్రం తను ఇచ్చేదానికంటే కూడా.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో సాయం అందిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ నెలలో 3వేలకోట్ల రూపాయలపై చిలుకు మొత్తం రాజధానికి అందింది. దీంతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే.. ఇప్పుడు పనుల జోరును చూస్తున్న దేశీయ బ్యాంకులు కూడా.. క్యూ కడుతున్నాయి. మేం ఇస్తామంటే.. మేం ఇస్తామంటూ.. నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. వీటిలో ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు వంటి జాతీయ దిగ్గజ బ్యాంకులు ఉండడం గమనార్హం.
వీటి ద్వారా సుమారు మరో 26 వేల కోట్ల వరకు అందే అవకాశం ఉందని ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. తాజాగా వీటిపై సమీక్షించిన సీఎం చంద్రబాబు రుణాలు ఇచ్చే వారు పెడుతున్న షరతులను కూడా పరిశీలించాలని, రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే విధంగా ఉంటే.. ఎలాంటి అప్పులు కూడా తీసుకోవద్దని సీఆర్ డీఏ అధికారులకు తెగేసి చెప్పారు. అంతేకాదు.. స్వల్ప మొత్తాలతో కూడిన.. వడ్డీలకే తీసుకోవాలని కూడా.. సూచించారు.
ఎందుకిలా?
నిన్న మొన్నటి వరకు అసలు అమరావతికి రుణం అంటే.. మొహం చాటేసిన బ్యాంకులు ఇప్పుడుక్యూ కట్టుకుని మరీ ముందుకు రావడం ఎందుకు? దీని వెనుక ఏంజరిగిందన్న చర్చ సహజం ఈ కోణంలో చూస్తే..రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. రుణాలు ఇచ్చినా తీర్చగలిగే శక్తి రాష్ట్రం పుంజుకుంది. ముఖ్యంగా అమరావతిలో ప్రపంచ స్థాయి సంస్థలు వస్తున్నాయి. వీటి వల్ల కార్యకలాపాలు మరింత పెరుగుతాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే తాజాగా దేశీయ దిగ్గజ బ్యాంకులు ముందుకు వస్తుండడం గమనార్హం.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…