విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ.. యనమల రామకృష్ణుడుని పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ఇటీవల యనమల రామకృష్ణుడు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దే శించి.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఓ పుస్తకాన్నికూడా లిఖించారు. దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
కానీ, యనమల ఇంత చేసి.. ఎన్టీఆర్ కంటే కూడా.. చంద్రబాబు భేష్ అని కొనియాడినా.. ఆయన పాలన ను మెచ్చుకున్నా.. చంద్రబాబు కానీ.. పార్టీలో కీలక నాయకుడు మంత్రి నారా లోకేష్ కానీ.. ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు.. యనమల కుమార్తె దివ్యపైనా.. ఫిర్యాదులు వస్తున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలో.. లేక, యనమల అవసరం లేదన్న వాదనతోనో.. చంద్రబాబు ఈ విషయంలో సైలెంట్ అయ్యారు.
మరోవైపు.. కేంద్రం నుంచి గవర్నర్ పదవి విషయంపై రేపో మాపో సంకేతాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడుకు గవర్నర్ పదవి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న రవిని తప్పించి.. ఆయన స్థానంలో తమకు అనుకూలంగా ఉండే నాయకుడికి గవర్నర్ పగ్గాలు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు.
కానీ,.. అంతర్గత చర్చల్లో మాత్రం పూసపాటికే.. చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. దీంతో యనమల వర్గం కుతకుత లాడుతోంది. అయితే.. ఇప్పటి వరకు టీడీపీలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మార్పులు, చేర్పుల దిశగా అడుగులు వేస్తే.. అది మరింత నష్టమని.. దీని వల్ల వచ్చేది కూడా లేదని భావిస్తున్నారు. అయితే.. అధిష్టానం స్థాయిలో మాత్రం అశోక్వైపు మొగ్గు చూపడం చూస్తే.. సహజంగానే యనమల ఆవేదనలో ఉన్నారన్నది వాస్తవం. మరిఏంజరుగుతుందో చూడాలి.
This post was last modified on April 13, 2025 2:31 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…