Political News

జనసేన ఖాతాలో తొలి మునిసిపాలిటీ

అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మునిసిపాలిటీ పాలకవర్గాన్ని ఆ పార్టీ చేజిక్కించుకుంది. ఈ మేరకు శనివారం నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఏమంత శ్రమ పడకుండానే…పాలకవర్గం వైసీపీ నుంచి జనసేనకు అలా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏపీలో అధికార పగ్గాలు వైసీపీ నుంచి కూటమికి మారిపోయిన తర్వాత స్థానిక సంస్థలు కూడా ఒక్కటొక్కటిగానే కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల బేరసారాలూ జరుగుతున్నాయి. అధికార పార్టీ బలవంతంగా తమ ప్రజా ప్రతినిధులను లాగేసుకుంటోందని, ఈ క్రమంలో దారుణాలకూ పాల్పడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. అయితే నిడదవోలులో అలాంటి ఆరోపణలు వినిపించకపోవడం గమనార్హం. అంతా సైలెంట్ గా జరిగిపోయింది.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మునిసిపాలిటీని వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 28 కౌన్సిలర్లు ఉండగా… 27 స్థానాలను గెలిచింది. ఒక్క స్థానాన్ని టీడీపీ గెలిచింది. ఇటీవలే కూటమి అధికారంలోకి రావడం, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేశ్ గెలవడంతో వైసీపీ శిబిరంలోని 10 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరారు. మిత్రపక్షం టీడీపీకి ఉన్న ఒక సభ్యుడితో కలుపుకుని జనసేన బలం 12కు చేరగా… మరో ముగ్గురు సభ్యులు వైసీపీని వీడితే జనసేన ఖాతాలో నిడదవోలు మునిసిపాలిటీ పడిపోయినట్టే.

ఇలాంటి సందర్భంలో ఇటీవలే మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వీరి కోరిక మేరకు అధికారులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండగానే.. తాజాగా వైసీపీకి చెందిన మరికొందరు కౌన్సిలర్లు దుర్గేశ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఫలితంగా జనసేన మెజారిటీ కౌన్సిలర్లు కలిగిన పార్టీగా అవతరించింది. అంతకుముందే మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేనలో చేరిపోగా… తాజాగా ఆయననే చైర్మన్ గా కొనసాగించేలా దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు.

This post was last modified on April 12, 2025 7:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago