Political News

జనసేన ఖాతాలో తొలి మునిసిపాలిటీ

అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మునిసిపాలిటీ పాలకవర్గాన్ని ఆ పార్టీ చేజిక్కించుకుంది. ఈ మేరకు శనివారం నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఏమంత శ్రమ పడకుండానే…పాలకవర్గం వైసీపీ నుంచి జనసేనకు అలా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏపీలో అధికార పగ్గాలు వైసీపీ నుంచి కూటమికి మారిపోయిన తర్వాత స్థానిక సంస్థలు కూడా ఒక్కటొక్కటిగానే కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల బేరసారాలూ జరుగుతున్నాయి. అధికార పార్టీ బలవంతంగా తమ ప్రజా ప్రతినిధులను లాగేసుకుంటోందని, ఈ క్రమంలో దారుణాలకూ పాల్పడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. అయితే నిడదవోలులో అలాంటి ఆరోపణలు వినిపించకపోవడం గమనార్హం. అంతా సైలెంట్ గా జరిగిపోయింది.

2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మునిసిపాలిటీని వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 28 కౌన్సిలర్లు ఉండగా… 27 స్థానాలను గెలిచింది. ఒక్క స్థానాన్ని టీడీపీ గెలిచింది. ఇటీవలే కూటమి అధికారంలోకి రావడం, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేశ్ గెలవడంతో వైసీపీ శిబిరంలోని 10 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరారు. మిత్రపక్షం టీడీపీకి ఉన్న ఒక సభ్యుడితో కలుపుకుని జనసేన బలం 12కు చేరగా… మరో ముగ్గురు సభ్యులు వైసీపీని వీడితే జనసేన ఖాతాలో నిడదవోలు మునిసిపాలిటీ పడిపోయినట్టే.

ఇలాంటి సందర్భంలో ఇటీవలే మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వీరి కోరిక మేరకు అధికారులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండగానే.. తాజాగా వైసీపీకి చెందిన మరికొందరు కౌన్సిలర్లు దుర్గేశ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఫలితంగా జనసేన మెజారిటీ కౌన్సిలర్లు కలిగిన పార్టీగా అవతరించింది. అంతకుముందే మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేనలో చేరిపోగా… తాజాగా ఆయననే చైర్మన్ గా కొనసాగించేలా దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు.

This post was last modified on April 12, 2025 7:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago