వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే రచ్చగా మారింది. తనను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా మీడియాకు కనబడేలా న్యాయమూర్తి ముందుకు తీసుకెళతారా? అంటూ ఆయన పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తమాషా చేస్తున్నారా? అంటూ ఆయన పోలీసులపై చిందులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవ్ వెంట అరెస్టైన ఆయన అనుచరులను పోలీసులు కొట్టినట్టుగా మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాళ్లను ఇష్టానుసారంగా కొట్టినా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ బహిష్కృత యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసుల అదుపులో ఉండగానే దాడి చేసేందుకు గురువారం మాధవ్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిపై హత్యాయత్నం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్ మాధవ్, ఆయన అనుచరులను రాత్రికి నగరపాలెం పీఎస్ కు తరలించారు. కేసులు కూడా అక్కడే నమోదు చేశారు. అనంతరం శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టుకు వారిని తరలించారు.
ఈ సందర్భంగా మీడియా సమక్షంలోనే తనను కారు దింపేందుకు పోలీసులు యత్నించారు. అయితే కారు దిగేందుకు ససేమిరా అన్న మాధవ్… పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏమనుకుంటున్నారు? తమాషానా? మా పిల్లలను అతిరాన కొడితే కూడా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నా. తమాషాలు చేస్తారా? నేనేమైనా దోపిడీ దొంగనా? పొలిటికల్ లీడర్ ను. ఎంపీగా పనిచేసిన వాడిని. ఈ దేశానికే ఎంపీగా పనిచేసిన వాడిని. పోలీసు ఆఫీసర్ ని. తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ చిందులేయడంతో పోలీసులు కారుకు డోర్ వేసి వేరే ద్వారం మీదుగా ఆయనను న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.
This post was last modified on April 11, 2025 7:09 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…