వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే రచ్చగా మారింది. తనను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా మీడియాకు కనబడేలా న్యాయమూర్తి ముందుకు తీసుకెళతారా? అంటూ ఆయన పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తమాషా చేస్తున్నారా? అంటూ ఆయన పోలీసులపై చిందులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవ్ వెంట అరెస్టైన ఆయన అనుచరులను పోలీసులు కొట్టినట్టుగా మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాళ్లను ఇష్టానుసారంగా కొట్టినా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ బహిష్కృత యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసుల అదుపులో ఉండగానే దాడి చేసేందుకు గురువారం మాధవ్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిపై హత్యాయత్నం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్ మాధవ్, ఆయన అనుచరులను రాత్రికి నగరపాలెం పీఎస్ కు తరలించారు. కేసులు కూడా అక్కడే నమోదు చేశారు. అనంతరం శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టుకు వారిని తరలించారు.
ఈ సందర్భంగా మీడియా సమక్షంలోనే తనను కారు దింపేందుకు పోలీసులు యత్నించారు. అయితే కారు దిగేందుకు ససేమిరా అన్న మాధవ్… పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏమనుకుంటున్నారు? తమాషానా? మా పిల్లలను అతిరాన కొడితే కూడా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నా. తమాషాలు చేస్తారా? నేనేమైనా దోపిడీ దొంగనా? పొలిటికల్ లీడర్ ను. ఎంపీగా పనిచేసిన వాడిని. ఈ దేశానికే ఎంపీగా పనిచేసిన వాడిని. పోలీసు ఆఫీసర్ ని. తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ చిందులేయడంతో పోలీసులు కారుకు డోర్ వేసి వేరే ద్వారం మీదుగా ఆయనను న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.
This post was last modified on April 11, 2025 7:09 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…