Political News

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే రచ్చగా మారింది. తనను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా మీడియాకు కనబడేలా న్యాయమూర్తి ముందుకు తీసుకెళతారా? అంటూ ఆయన పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తమాషా చేస్తున్నారా? అంటూ ఆయన పోలీసులపై చిందులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవ్ వెంట అరెస్టైన ఆయన అనుచరులను పోలీసులు కొట్టినట్టుగా మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాళ్లను ఇష్టానుసారంగా కొట్టినా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ బహిష్కృత యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసుల అదుపులో ఉండగానే దాడి చేసేందుకు గురువారం మాధవ్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిపై హత్యాయత్నం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్ మాధవ్, ఆయన అనుచరులను రాత్రికి నగరపాలెం పీఎస్ కు తరలించారు. కేసులు కూడా అక్కడే నమోదు చేశారు. అనంతరం శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టుకు వారిని తరలించారు.

ఈ సందర్భంగా మీడియా సమక్షంలోనే తనను కారు దింపేందుకు పోలీసులు యత్నించారు. అయితే కారు దిగేందుకు ససేమిరా అన్న మాధవ్… పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏమనుకుంటున్నారు? తమాషానా? మా పిల్లలను అతిరాన కొడితే కూడా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నా. తమాషాలు చేస్తారా? నేనేమైనా దోపిడీ దొంగనా? పొలిటికల్ లీడర్ ను. ఎంపీగా పనిచేసిన వాడిని. ఈ దేశానికే ఎంపీగా పనిచేసిన వాడిని. పోలీసు ఆఫీసర్ ని. తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ చిందులేయడంతో పోలీసులు కారుకు డోర్ వేసి వేరే ద్వారం మీదుగా ఆయనను న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

2 minutes ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

7 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

8 hours ago