వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే రచ్చగా మారింది. తనను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా మీడియాకు కనబడేలా న్యాయమూర్తి ముందుకు తీసుకెళతారా? అంటూ ఆయన పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తమాషా చేస్తున్నారా? అంటూ ఆయన పోలీసులపై చిందులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవ్ వెంట అరెస్టైన ఆయన అనుచరులను పోలీసులు కొట్టినట్టుగా మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వాళ్లను ఇష్టానుసారంగా కొట్టినా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ బహిష్కృత యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసుల అదుపులో ఉండగానే దాడి చేసేందుకు గురువారం మాధవ్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిపై హత్యాయత్నం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్ మాధవ్, ఆయన అనుచరులను రాత్రికి నగరపాలెం పీఎస్ కు తరలించారు. కేసులు కూడా అక్కడే నమోదు చేశారు. అనంతరం శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టుకు వారిని తరలించారు.
ఈ సందర్భంగా మీడియా సమక్షంలోనే తనను కారు దింపేందుకు పోలీసులు యత్నించారు. అయితే కారు దిగేందుకు ససేమిరా అన్న మాధవ్… పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏమనుకుంటున్నారు? తమాషానా? మా పిల్లలను అతిరాన కొడితే కూడా డిస్ క్లోజ్ చేయకుండా ఉన్నా. తమాషాలు చేస్తారా? నేనేమైనా దోపిడీ దొంగనా? పొలిటికల్ లీడర్ ను. ఎంపీగా పనిచేసిన వాడిని. ఈ దేశానికే ఎంపీగా పనిచేసిన వాడిని. పోలీసు ఆఫీసర్ ని. తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ చిందులేయడంతో పోలీసులు కారుకు డోర్ వేసి వేరే ద్వారం మీదుగా ఆయనను న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.
This post was last modified on April 11, 2025 7:09 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…