Political News

మాధవ్ ఎక్కడ?.. వైసీపీ నేతపై కేసుల పరంపర

ఖాకీ చొక్కను వదిలి ఖద్దరు చొక్కా వేసుకున్న వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బహిష్కృత ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ పై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించిన కారణంగా.. గురువారం సాయంత్రం గుంటూరులో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత గోరంట్లను తొలుత నగరం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆ తర్వాత నల్లపాడు పీఎస్ కు తరలించారు. అదే సమయంలో కిరణ్ పై హత్యాయత్నం కేసుతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ గోరంట్లపై కేసులు నమోదు అయ్యాయి.

ఇలాంటి సమయంలో గోరంట్ల మాధవ్ ఎక్కడున్నారన్నది తెలియ రావడం లేదని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అసలు గోరంట్లకు ఏమైందో కూడా తెలియడం లేదని, అసలు గోరంట్ల పోలీసుల అదుపులోనే ఉన్నారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత.. కేసు నమోదు చేశాక గోరంట్లను పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడికి తరలిస్తారు? అయితే గియితే విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు… లేదంటే కోర్టులో హాజరు పరుస్తారు. ఇవన్నీ జరిగేందుకు కొంత సమయం పడుతుంది కదా. అయితే ఈ కేసుల నమోదు అలా జరుగుతుండగానే… గోరంట్లపై మరో కేసును మంగళగిరి పోలీసులు నమోదు చేశారు. అంటే.. కేవలం 24 గంటల వ్యవదిలోనే మాజీ ఎంపీపై రెండు కేసులు నమోదు అయిపోయాయన్న మాట.

ఈ రెండో కేసు విషయానికి వస్తే.. పోలీసుల అదుపులోని కిరణ్ పై దాడి చేసేందుకు యత్నించడానికి ముందు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గోరంట్ల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లకు అక్క కాదు.. మగవాళ్లకు బావ కాదు అంటూ ఆయన లోకేశ్ పై అసభ్యకర వ్యాఖ్యలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని మంగళగిరి పోలీసులు గోరంట్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో శుక్రవారం సాయంత్రానికి గోరంట్లను పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నట్లు సమాచారం.

This post was last modified on April 11, 2025 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

10 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

53 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago