“మీరు చెబుతున్న మాటలను బట్టి.. మీరు అడుగుతున్న గడువును బట్టి.. బీఆర్ఎస్ సభను నిర్వహించరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మేం భావించేలా చేస్తున్నారు” అని తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. తాజాగా బీఆర్ ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండనున్నాయి. ఈ నెల 27 నాటికి బీఆర్ ఎస్ పార్టీ స్థాపించి పాతిక సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా, ఎల్కతుర్తిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సహా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ ఎస్ నిర్ణయించింది.
ఈ క్రమంలో సభ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు తదితర అంశాలకు సంబంధించి వరంగల్ పోలీసులను అభ్యర్థించింది. అయితే.. ఈ కార్యక్రమాలకు.. పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు.. ప్రస్తుతం పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని.. కాబట్టి ఇలాంటి పార్టీ కార్యక్రమాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అయితే.. పోలీసుల వైఖరిని బీఆర్ఎస్ నేతలు.. హైకోర్టలో సవాల్ చేశారు. తమ సభకు అనుమతించడం లేదని..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగిన హైకోర్టు.. పోలీసుల వైఖరిని తప్పుబట్టింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందని.. ఇది రాజ్యాంగ బద్ధంగా వారికి లభించిన హక్కు అని పేర్కొనడం గమనార్హం. అదేసమయంలో పోలీసులు, యంత్రాంగం.. కూడా పార్టీలకు అతీతంగా సహకారం అందించాలని.. ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న కారణంగా.. తప్పించుకునే వీలులేదని పేర్కొంది.
ఈ సమయంలో తమకు 21వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మరింత తీవ్రంగా స్పందిస్తూ.. “వారేమో(బీఆర్ ఎస్) ఈ నెల 27న సభ పెడతామని చెబుతున్నారు. మీరేమో 21వ తేదీ వరకు గడువు కోరుతున్నారు. మీ వైఖరి చూస్తే.. వారిని సభ నిర్వహించుకోరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మాకు అనిపిస్తోంది” అని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on April 11, 2025 2:57 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…