“మీరు చెబుతున్న మాటలను బట్టి.. మీరు అడుగుతున్న గడువును బట్టి.. బీఆర్ఎస్ సభను నిర్వహించరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మేం భావించేలా చేస్తున్నారు” అని తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. తాజాగా బీఆర్ ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండనున్నాయి. ఈ నెల 27 నాటికి బీఆర్ ఎస్ పార్టీ స్థాపించి పాతిక సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా, ఎల్కతుర్తిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సహా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ ఎస్ నిర్ణయించింది.
ఈ క్రమంలో సభ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు తదితర అంశాలకు సంబంధించి వరంగల్ పోలీసులను అభ్యర్థించింది. అయితే.. ఈ కార్యక్రమాలకు.. పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు.. ప్రస్తుతం పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని.. కాబట్టి ఇలాంటి పార్టీ కార్యక్రమాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అయితే.. పోలీసుల వైఖరిని బీఆర్ఎస్ నేతలు.. హైకోర్టలో సవాల్ చేశారు. తమ సభకు అనుమతించడం లేదని..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగిన హైకోర్టు.. పోలీసుల వైఖరిని తప్పుబట్టింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుందని.. ఇది రాజ్యాంగ బద్ధంగా వారికి లభించిన హక్కు అని పేర్కొనడం గమనార్హం. అదేసమయంలో పోలీసులు, యంత్రాంగం.. కూడా పార్టీలకు అతీతంగా సహకారం అందించాలని.. ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న కారణంగా.. తప్పించుకునే వీలులేదని పేర్కొంది.
ఈ సమయంలో తమకు 21వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మరింత తీవ్రంగా స్పందిస్తూ.. “వారేమో(బీఆర్ ఎస్) ఈ నెల 27న సభ పెడతామని చెబుతున్నారు. మీరేమో 21వ తేదీ వరకు గడువు కోరుతున్నారు. మీ వైఖరి చూస్తే.. వారిని సభ నిర్వహించుకోరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మాకు అనిపిస్తోంది” అని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on April 11, 2025 2:57 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…