Political News

పిలవంగానే వచ్చిన జోగి… విచారణలో ఏం చెప్పారు?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా… ఆయన ఇంటిపైకి దాడికి యత్నించారన్నది జోగిపై ఉన్న ప్రధాన ఆరోపణ. నాడు రణరంగాన్ని తలపించిన ఈ ఘటనలో జోగి రమేశ్ కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై నాడే కేసు నమోదు కాగా… నాడు విచారణ జరిగిన దాఖలానే కనిపించలేదు.

తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే ఈ కేసును వెలికి తీసిన పోలీసులు… కేసును ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీకి అప్పగించారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సార్లు జోగిని విచారించిన సీఐడీ అధికారులు… తాజాగా శుక్రవారం విచారణకు రావాలంటూ ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారమే.. జోగి రమేశ్ విచారణకు హాజరయ్యారు. జోగితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 10 మందిని కూడా విచారణకు పిలిచిన సీఐడీ.. అందరినీ గంట పాటు విచారించించి వదిలేసింది.

సీఐడీ విచారణ అనంతరం జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. నాడు తానేమీ చంద్రబాబు ఇంటికి మీదకు దాడికి యత్నించలేదని సీఐడీ అధికారులకు తెలిపానని ఆయన చెప్పారు. కేవలం చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు మాత్రమే వెళ్లానని.. ఓ రాజకీయ నేతగా నిరసన తెలిపే హక్కు కూడా తనకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు వెళితే… చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించానని తనపై కేసు నమోదు కావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదు కాబట్టే… ఈ కేసు విచారణ కోసం ఇప్పటికే సీఐడీ అధికారుల ముందు పలుమార్లు హాజరయ్యానన్నారు. శుక్రవారం కూడా సీఐడీ అధికారుల నోటీసుల మేరకే విచారణకు వచ్చానన్నారు. ఇంకెన్ని సార్లు సీఐడీ అధికారులు విచారణకు పిలిచినా కూడా హాజరవుతానని కూడా జోగి రమేశ్ తెలిపారు.

అనంతరం కూటమి పాలనపై జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకో రెండేళ్లు పోతే రెడ్ బుక్ ను మడిచి పెట్టుకోవాల్సిందేనని ఆయన మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ పాలనతో విపక్షాలను అణచివేయాలని చూస్తే కుదరదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కూటమి పాలనపై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. వైసీపీ పాలన కోసం, జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కూటమి పాలన రాష్ట్రంలో ఇంకెంతో కాలం కొనసాగదని ఆయన అన్నారు. కూటమి పార్టీల నేతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాజకీయంగా సైలెంట్ అయిపోయిన జోగి రమేశ్… పోలీసుల విచారణకు వచ్చిన సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

This post was last modified on April 11, 2025 2:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: jogi ramesh

Recent Posts

వెంకీ మామ సూత్రం….నిదానమే ప్రధానం

సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఆ తర్వాత ఎవరితో చేయాలనే విషయంలో…

26 minutes ago

వీరమల్లు కోసం పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ

మే 9 విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడుతుందనే పుకార్ల నేపథ్యంలో ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ నుంచి…

2 hours ago

నమ్మకం కలిగించిన సారంగపాణి

వాస్తవానికి ఈ వారం విడుదల కావల్సిన సినిమా సారంగపాణి జాతకం. ఆ మేరకు ముందు ప్రకటన ఇచ్చింది కూడా ఈ…

2 hours ago

సోషల్ మీడియా బుడగ పేల్చిన పూజా హెగ్డే

సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…

3 hours ago

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…

4 hours ago