Political News

10 నెలల్లోనే 5 భేటీలు!.. ఇది కదా వృద్ధి అంటే!

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక సంస్థలకు ఆ సమావేశం అనుమతులు మంజూరు చేస్తూ ఉంటుందని వైసీపీ పాలనలో విన్నదే లేదు. అయితే ఏపీలో పాలన సాగిస్తున్న కూటమి అదికారం చేపట్టిన 10 నెలల కాలంలోనే ఈ మండలి ఏకంగా 5 సార్లు భేటీ అయ్యింది. దాదాపుగా 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. దాదాపుగా 4 లక్షలకు పైగా ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేసింది.

నిజమే మరి…ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎస్ఐపీబీ సమావేశాలు ఆరు నెలలకు ఒక సారో, ఏడాదికి ఒక సారో, లేదంటే..అసలు ఆ ఊసే లేకుండానే పాలన సాగిపోతూ ఉంటుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే మాత్రం క్రమం తప్పకుండా ఎస్ఐపీబీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అంటే చంద్రబాబు సీఎంగా ఉంటే.. ఆయన పాలనలోని రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతూనే ఉంటాయి. వాటికి అనుమతులు మంజూరు చేసే నిమిత్తం ఎస్ఐపీబీ సమావేశాలు వరుసబెట్టి జరుగుతూనే ఉంటాయి. టీడీపీ అధికారంలో ఉంటే ఈ ప్రాసెస్ నిత్యకృత్యంగా సాగిపోతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు అధ్యక్షతన గురువారం కూడా ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. అమరావతి పరిధిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సమావేశంలో బాగంగా ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన రూ.31,167 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈ పెట్టుబడలతో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా రాష్ట్ర యువతకు 32,633 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఆయా పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను ఎప్పటిలోగా యూనిట్లను మొదలుపెడతారన్న విషయాన్ని ముందుగానే అడగాలని ఆయన సూచించారు.

This post was last modified on April 11, 2025 9:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

55 minutes ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

1 hour ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

1 hour ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

1 hour ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

2 hours ago