ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీసుల అధికారుల సంఘం…ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయినా సరే తీరు మారని జగన్ మరోసారి పోలీసులపై నోరు పారేసుకున్నారు. పోలీసులను వాచ్ మెన్ లకంటే ఘోరంగా వాడుకుంటున్నారని జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల్లోని 10 స్థానాల్లో 9 స్థానాలు వైసీపీ గెలిచిందని చెప్పారు. అయితే, కోర్టు ఆదేశాలతో పోలీసుల భద్రతతో ఎంపీటీసీలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రామగిరి ఎస్సై సుధాకర్ పై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎంపీటీసీతో స్థానిక ఎమ్మెల్యేతో, ఆయన కొడుకుతో వీడియో కాల్ లో రామగిరి ఎస్సై మాట్లాడించి బెదిరించారని ఆరోపించారు. వైసీపీ అంటే చంద్రబాబుకు భయమని, నెక్స్ట్ ఎలక్షన్ లో సింగిల్ డిజిట్ రాని పరిస్థితికి పడిపోతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబు భయపడ్డారని, వైసీపీ అంటే ఆయనకు భయమని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. సంఖ్యాబలం లేకున్నా చంద్రబాబు దౌర్జన్యాలకు పాల్పడ్డీారని, అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. హామీల అమలులో, పాలనలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు.
చంద్రబాబుకు ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం లేదని, అన్ని పదవులు తనకు కావాలన్న అహంకారం ఉందని అన్నారు. సంఖ్యా బలం లేకపోయినా..ఎంపీటీసీ ఎన్నికలలో గెలవాలని దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ అధినేత జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు వచ్చేది సింగిల్ డిజిట్ అని, అందుకే టీడీపీకి సింగిల్ డిజిట్ అంటూ గాంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రోలింగ్ జరుగుతోంది.
This post was last modified on April 10, 2025 7:00 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…