ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీసుల అధికారుల సంఘం…ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయినా సరే తీరు మారని జగన్ మరోసారి పోలీసులపై నోరు పారేసుకున్నారు. పోలీసులను వాచ్ మెన్ లకంటే ఘోరంగా వాడుకుంటున్నారని జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల్లోని 10 స్థానాల్లో 9 స్థానాలు వైసీపీ గెలిచిందని చెప్పారు. అయితే, కోర్టు ఆదేశాలతో పోలీసుల భద్రతతో ఎంపీటీసీలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రామగిరి ఎస్సై సుధాకర్ పై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎంపీటీసీతో స్థానిక ఎమ్మెల్యేతో, ఆయన కొడుకుతో వీడియో కాల్ లో రామగిరి ఎస్సై మాట్లాడించి బెదిరించారని ఆరోపించారు. వైసీపీ అంటే చంద్రబాబుకు భయమని, నెక్స్ట్ ఎలక్షన్ లో సింగిల్ డిజిట్ రాని పరిస్థితికి పడిపోతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబు భయపడ్డారని, వైసీపీ అంటే ఆయనకు భయమని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. సంఖ్యాబలం లేకున్నా చంద్రబాబు దౌర్జన్యాలకు పాల్పడ్డీారని, అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. హామీల అమలులో, పాలనలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు.
చంద్రబాబుకు ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం లేదని, అన్ని పదవులు తనకు కావాలన్న అహంకారం ఉందని అన్నారు. సంఖ్యా బలం లేకపోయినా..ఎంపీటీసీ ఎన్నికలలో గెలవాలని దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన పార్టీ అధినేత జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు వచ్చేది సింగిల్ డిజిట్ అని, అందుకే టీడీపీకి సింగిల్ డిజిట్ అంటూ గాంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రోలింగ్ జరుగుతోంది.
This post was last modified on April 10, 2025 7:00 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…