ముఖ్యమంత్రుల ‘బ్రాండ్స్’పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. “రెండు రూపాయలకే కిలో బియ్యం.. బ్రాండ్ ఎన్టీఆర్ది. ఐటీ అంటే.. చంద్రబాబు గుర్తుకు వస్తారు. జలయజ్ఞం అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరికొందరు ఉద్యమం తమ బ్రాండ్గా ప్రచారం చేసుకుంటారు(కేసీఆర్ గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు). ఈ క్రమంలో నాబ్రాండ్ గురించి కూడా అడుగుతుంటారు. నా బ్రాండ్ ఏంటంటే.. ‘యంగ్ ఇండియా’. ఇదే నా బ్రాండ్” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్రంపై సునిశిత విమర్శలు చేశారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే.. కేవలం కొన్ని మాత్రమే ఒలింపిక్ పతకాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తక్కువ జనాభా ఉన్న దేశాలు మన కంటే ముందున్నాయని.. పదుల సంఖ్యలో ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకుంటున్నాయని ఆయన వివరించారు. ఏటా లక్షలాది మంది బీటెక్ చేస్తున్నారని.. కానీ, ఎంత మందికి నాణ్యమైన విద్య అందుతోందని అంటే.. ప్రశ్నార్థకమేనని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలోనూ యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 25 ఎకరాల్లో రూ.200 కోట్ల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. అదేవిధంగా ప్రీ స్కూళ్లను కూడా ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాగా.. దీనికి ముందు విద్యార్థులతో కలిసి ఆయన పలు క్రీడలు ఆడారు. చాలా ఉత్సాహంగా.. వారితో కలిసిపోయారు.
This post was last modified on April 10, 2025 1:39 pm
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…