బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు కేసు నుంచి తప్పించారన్నది ఆయనపై ఉన్న అభియోగం. దీంతో తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన షకీల్ను విమానాశ్రయ అధికారులు.. నిర్బంధించారు. అనంతరం.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగింది?
2022-23 మధ్య హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు.. భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇది అప్పట్లో తెల్లవారుజామున జరిగింది. అయితే.. ఈ ఘటనకు షకీల్ కుమారుడే కారణమని పోలీసులు గుర్తించి.. కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అదేసమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షకీల్ కుమారుడు సాహిల్..ఈ ఘటనకు బాధ్యుడైన ఆయన స్నేహితుడు.. ఆ వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ను పోలీసులు విచారించారు. కానీ, ఆయన కోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు. కానీ, విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను కూడా తోసి పుచ్చిన షకీల్.. ఆయన కూడా.. విదేశాలకు వెళ్లిపోయారు. అయితే.. తాజాగా గురువారం షకీల్ మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయం తెలియడంతో షకీల్ దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే.. అప్పటికే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఆయనను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. కాగా.. తన మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరు కావాల్సి ఉందని షకీల్ పోలీసులకు చెప్పడంతో ఆ కార్యక్రమానికి వారు అనుమతించారు. అంత్య క్రియల అనంతరం.. పోలీసులు షకీల్ను అరెస్టు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
This post was last modified on April 10, 2025 1:35 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…