వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ పోలీసులు గురువారం ఉదయం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కాకాణి దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలో ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పోలీసులు ఈ నోటీసులు పంపారు. అయితే పోలీసులు ఈ నోటీసులు జారీ చేసే సమయానికే కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
వైసీపీ అధికారంలో ఉండగా..మంత్రి హోదాలో ఉన్న కాకాణి నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని…ఫలితంగా రూ.250 కోట్ల మేర అక్రమార్జనను ఆయన పోగేశారని ఆరోపణలు రావడం, దానిపై ప్రాథమిక విచారణలో నిజమేనని తేలడంతో పొదలకూరు పోలీసులు ఇదివరకే కాకాణి, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ రెండు వారాల నుంచి నెల్లూరు డీఎస్పీ కార్యాలయం కాకాణికి నోటీసులు పంపుతూనే ఉంది. అయితే నోటీసులు తీసుకోని కాకాణి పత్తా లేకుండాపోయారు. అసలు ఆయన గడచిన రెండు వారాలుగా ఎక్కడ ఉన్నారన్నవిషయం కూడా తేలడం లేదు.
ఈ క్రమంలో కాకాణిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మూడు సార్లు విచారణకు రమ్మంటే… పోలీసుల విచారణను లైట్ తీసుకుంటారా?అన్న దిశగా కాకాణిపై పోలీసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా విచారణకు కూడా హాజరుకాకుండా..కనీసం నోటీసులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేని కాకాణికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో కాకాణితో పాటు ఈ కేసులో ప్రత్యేక పాత్ర ఉందంటూ కాకాణి అల్లుడిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. కాకాణి మాదిరే ఆయన అల్లుడు కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కాకాణి ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయి ఉండవచ్చన్న దిశగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
This post was last modified on April 10, 2025 12:45 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…