వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ పోలీసులు గురువారం ఉదయం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కాకాణి దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలో ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పోలీసులు ఈ నోటీసులు పంపారు. అయితే పోలీసులు ఈ నోటీసులు జారీ చేసే సమయానికే కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
వైసీపీ అధికారంలో ఉండగా..మంత్రి హోదాలో ఉన్న కాకాణి నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని…ఫలితంగా రూ.250 కోట్ల మేర అక్రమార్జనను ఆయన పోగేశారని ఆరోపణలు రావడం, దానిపై ప్రాథమిక విచారణలో నిజమేనని తేలడంతో పొదలకూరు పోలీసులు ఇదివరకే కాకాణి, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ రెండు వారాల నుంచి నెల్లూరు డీఎస్పీ కార్యాలయం కాకాణికి నోటీసులు పంపుతూనే ఉంది. అయితే నోటీసులు తీసుకోని కాకాణి పత్తా లేకుండాపోయారు. అసలు ఆయన గడచిన రెండు వారాలుగా ఎక్కడ ఉన్నారన్నవిషయం కూడా తేలడం లేదు.
ఈ క్రమంలో కాకాణిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మూడు సార్లు విచారణకు రమ్మంటే… పోలీసుల విచారణను లైట్ తీసుకుంటారా?అన్న దిశగా కాకాణిపై పోలీసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా విచారణకు కూడా హాజరుకాకుండా..కనీసం నోటీసులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేని కాకాణికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో కాకాణితో పాటు ఈ కేసులో ప్రత్యేక పాత్ర ఉందంటూ కాకాణి అల్లుడిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. కాకాణి మాదిరే ఆయన అల్లుడు కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కాకాణి ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయి ఉండవచ్చన్న దిశగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
This post was last modified on April 10, 2025 12:45 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…