Political News

కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ పోలీసులు గురువారం ఉదయం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కాకాణి దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. ఈ నేపథ్యంలో ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు పోలీసులు ఈ నోటీసులు పంపారు. అయితే పోలీసులు ఈ నోటీసులు జారీ చేసే సమయానికే కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.

వైసీపీ అధికారంలో ఉండగా..మంత్రి హోదాలో ఉన్న కాకాణి నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి అమ్ముకున్నారని…ఫలితంగా రూ.250 కోట్ల మేర అక్రమార్జనను ఆయన పోగేశారని ఆరోపణలు రావడం, దానిపై ప్రాథమిక విచారణలో నిజమేనని తేలడంతో పొదలకూరు పోలీసులు ఇదివరకే కాకాణి, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ రెండు వారాల నుంచి నెల్లూరు డీఎస్పీ కార్యాలయం కాకాణికి నోటీసులు పంపుతూనే ఉంది. అయితే నోటీసులు తీసుకోని కాకాణి పత్తా లేకుండాపోయారు. అసలు ఆయన గడచిన రెండు వారాలుగా ఎక్కడ ఉన్నారన్నవిషయం కూడా తేలడం లేదు.

ఈ క్రమంలో కాకాణిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మూడు సార్లు విచారణకు రమ్మంటే… పోలీసుల విచారణను లైట్ తీసుకుంటారా?అన్న దిశగా కాకాణిపై పోలీసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా విచారణకు కూడా హాజరుకాకుండా..కనీసం నోటీసులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేని కాకాణికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో కాకాణితో పాటు ఈ కేసులో ప్రత్యేక పాత్ర ఉందంటూ కాకాణి అల్లుడిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. కాకాణి మాదిరే ఆయన అల్లుడు కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కాకాణి ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయి ఉండవచ్చన్న దిశగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

This post was last modified on April 10, 2025 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకీ మామ సూత్రం….నిదానమే ప్రధానం

సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఆ తర్వాత ఎవరితో చేయాలనే విషయంలో…

26 minutes ago

వీరమల్లు కోసం పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ

మే 9 విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడుతుందనే పుకార్ల నేపథ్యంలో ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ నుంచి…

2 hours ago

నమ్మకం కలిగించిన సారంగపాణి

వాస్తవానికి ఈ వారం విడుదల కావల్సిన సినిమా సారంగపాణి జాతకం. ఆ మేరకు ముందు ప్రకటన ఇచ్చింది కూడా ఈ…

2 hours ago

సోషల్ మీడియా బుడగ పేల్చిన పూజా హెగ్డే

సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…

3 hours ago

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…

4 hours ago