Political News

హెచ్‌సీయూపై కాంగ్రెస్ గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఆన్సర్ ఉందా..?

కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణా సమాజానికి అన్యాయం చేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే దీని వెనుక బీఆర్ఎస్ వాస్తవాలను చంపేస్తోంది అంటూ కాంగ్రెస్ లెక్కలు బయట పెడుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల సమయంలో పెద్ద ఎత్తున అడవులను నాశనం చేసారు.

ఏకంగా 12 లక్షల చెట్లను మూడేళ్ళలో నరికారు. 8 వేల ఎకరాల్లో అడవిని నరికి చదును చేసారు. అప్పుడు లక్షలాది జంతువులకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇక 2015 నుండి 2022 వరకు ఏడేళ్ళలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమయంలో 219 కోట్ల మొక్కలు నాటామని, అందులో 85 శాతం బతికాయని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. దీని కోసం గానూ 9,777 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అప్పటి సర్కార్. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అలాగే అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించి ఖర్చు చేసారు.

కెసీఆర్ ప్రకటన ప్రకారం.. అటవీ విస్తీర్ణం భారీగా పెరగాల్సి ఉన్నా.. తగ్గిపోయింది. 2021 నివేదికల ప్రకారం 21,591 చ.కి.మీ 2014 నాటికి తెలంగాణాలో అడవులు ఉండగా.. 2021 నాటికి 21,213 చ.కి.మీలకు తగ్గింది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో.. కెసిఆర్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా అటవీయేతర వినియోగం కోసం కేటాయింపులు చేసారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చెట్లను నరికేశారు. అలాగే వేలం ప్రక్రియలో విక్రయించిన భూముల్లో కూడా చెట్లను పెద్ద ఎత్తున నరికారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అడవి జంతువులకు నీడ లేకుండా పోయింది. మరి దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి.

This post was last modified on April 10, 2025 6:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago