కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణా సమాజానికి అన్యాయం చేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే దీని వెనుక బీఆర్ఎస్ వాస్తవాలను చంపేస్తోంది అంటూ కాంగ్రెస్ లెక్కలు బయట పెడుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల సమయంలో పెద్ద ఎత్తున అడవులను నాశనం చేసారు.
ఏకంగా 12 లక్షల చెట్లను మూడేళ్ళలో నరికారు. 8 వేల ఎకరాల్లో అడవిని నరికి చదును చేసారు. అప్పుడు లక్షలాది జంతువులకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇక 2015 నుండి 2022 వరకు ఏడేళ్ళలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమయంలో 219 కోట్ల మొక్కలు నాటామని, అందులో 85 శాతం బతికాయని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. దీని కోసం గానూ 9,777 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అప్పటి సర్కార్. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అలాగే అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించి ఖర్చు చేసారు.
కెసీఆర్ ప్రకటన ప్రకారం.. అటవీ విస్తీర్ణం భారీగా పెరగాల్సి ఉన్నా.. తగ్గిపోయింది. 2021 నివేదికల ప్రకారం 21,591 చ.కి.మీ 2014 నాటికి తెలంగాణాలో అడవులు ఉండగా.. 2021 నాటికి 21,213 చ.కి.మీలకు తగ్గింది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో.. కెసిఆర్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా అటవీయేతర వినియోగం కోసం కేటాయింపులు చేసారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చెట్లను నరికేశారు. అలాగే వేలం ప్రక్రియలో విక్రయించిన భూముల్లో కూడా చెట్లను పెద్ద ఎత్తున నరికారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అడవి జంతువులకు నీడ లేకుండా పోయింది. మరి దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి.
This post was last modified on April 10, 2025 6:26 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…