Political News

హెచ్‌సీయూపై కాంగ్రెస్ గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఆన్సర్ ఉందా..?

కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణా సమాజానికి అన్యాయం చేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే దీని వెనుక బీఆర్ఎస్ వాస్తవాలను చంపేస్తోంది అంటూ కాంగ్రెస్ లెక్కలు బయట పెడుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల సమయంలో పెద్ద ఎత్తున అడవులను నాశనం చేసారు.

ఏకంగా 12 లక్షల చెట్లను మూడేళ్ళలో నరికారు. 8 వేల ఎకరాల్లో అడవిని నరికి చదును చేసారు. అప్పుడు లక్షలాది జంతువులకు నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇక 2015 నుండి 2022 వరకు ఏడేళ్ళలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమయంలో 219 కోట్ల మొక్కలు నాటామని, అందులో 85 శాతం బతికాయని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. దీని కోసం గానూ 9,777 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అప్పటి సర్కార్. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అలాగే అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించి ఖర్చు చేసారు.

కెసీఆర్ ప్రకటన ప్రకారం.. అటవీ విస్తీర్ణం భారీగా పెరగాల్సి ఉన్నా.. తగ్గిపోయింది. 2021 నివేదికల ప్రకారం 21,591 చ.కి.మీ 2014 నాటికి తెలంగాణాలో అడవులు ఉండగా.. 2021 నాటికి 21,213 చ.కి.మీలకు తగ్గింది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో.. కెసిఆర్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా అటవీయేతర వినియోగం కోసం కేటాయింపులు చేసారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చెట్లను నరికేశారు. అలాగే వేలం ప్రక్రియలో విక్రయించిన భూముల్లో కూడా చెట్లను పెద్ద ఎత్తున నరికారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అడవి జంతువులకు నీడ లేకుండా పోయింది. మరి దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి.

This post was last modified on April 10, 2025 6:26 am

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

6 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

6 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

8 hours ago