Political News

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులతో పాటుగా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నం ఘటనలు కీలకమైనవి. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది చాలానే చేశారు. అలాంటి వారిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఒకరు.

చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన రమేశ్… ఆ తర్వాత ఇట్టే జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి పాలనలో పోలీసు విచారణకు హాజరవుతూ నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఇదే కేసులో మరోమారు విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం జోగి రమేశ్ కు నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబు ఇంటిపైకి దాడికి బయలుదేరిన జోగి రమేశ్.. తన వెంట మందీమార్బలాన్ని వేసుకుని మరీ రంగంలోకి దిగిపోయారు. సమయానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వేగంగా స్పందించబట్టి సరిపోయింది గానీ.. లేదంటే జోగి రమేశ్ తన వర్గంతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడి చేసేవారే.

నాడు చంద్రబాబు ఇంటి సమీపంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ బాహాబాహీకి దిగిన నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తోపులాటలో బుద్ధా వెంకన్న పట్టు తప్పి పడిపోయారు. కాసేపు ఊపిరాడక ఆయన సతమతమయ్యారు. వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులు ఆయనను కాస్తంత దూరం తీసుకెళ్లి కూర్చోబెట్టగా చాలా సేపటికి గానీ ఆయన మామూలు మనిషి కాలేకపోయారు. ఈ వ్యవహారంపై నాడే పోలీసులు కేసులు నమోదు చేసినా.. విచారణ మాత్రం జరగలేదనే చెప్పాలి. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఎలా వ్యవహరించారో… బాబు ఇంటిపై దాడి యత్నంపైనా అదే రీతిన స్పందించారు.

తాజాగా 10 నెలల క్రితం టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసుల బూజును పోలీసులు దులిపేశారు. బాబు ఇంటిపై దాడికి యత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేశ్ ను సీఐడీ పోలీసులు ఇప్పటికే మూడు పర్యాయాలు విచారించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేయాలంటే అందుకు జోగి రమేశ్ ససేమిరా అన్నారు. పలు కారణాలు చెబుతూ ఆయన తన ఫోన్ ను పోలీసులకు సమర్పించలేదు.

తాజాగా ఇదే కేసులో ఈ నెల 11న మరోమారు విచారణకు రావాలంటూ బుధవారం సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరి ఈ సారైనా పోలీసులు అడిగినట్లుగా జోగి రమేశ్ తన ఫోన్ ను వారికి స్వాధీనం చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జోగి రమేశ్ ఫోన్ తమ చేతికి చిక్కితే.. బాబు ఇంటిపైకి దాడికి పురిగొల్పిన వారు ఎవరన్న విషయం ఇట్టే తేలిపోతుందన్నది పోలీసుల భావన. మరి ఈ చిక్కుముడిని పోలీసులు ఈ దఫా అయినా విప్పుతారో, లేదో చూడాలి.

This post was last modified on April 9, 2025 7:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: jogi ramesh

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago