Political News

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులతో పాటుగా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నం ఘటనలు కీలకమైనవి. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది చాలానే చేశారు. అలాంటి వారిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఒకరు.

చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన రమేశ్… ఆ తర్వాత ఇట్టే జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి పాలనలో పోలీసు విచారణకు హాజరవుతూ నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఇదే కేసులో మరోమారు విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం జోగి రమేశ్ కు నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబు ఇంటిపైకి దాడికి బయలుదేరిన జోగి రమేశ్.. తన వెంట మందీమార్బలాన్ని వేసుకుని మరీ రంగంలోకి దిగిపోయారు. సమయానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వేగంగా స్పందించబట్టి సరిపోయింది గానీ.. లేదంటే జోగి రమేశ్ తన వర్గంతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడి చేసేవారే.

నాడు చంద్రబాబు ఇంటి సమీపంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ బాహాబాహీకి దిగిన నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తోపులాటలో బుద్ధా వెంకన్న పట్టు తప్పి పడిపోయారు. కాసేపు ఊపిరాడక ఆయన సతమతమయ్యారు. వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులు ఆయనను కాస్తంత దూరం తీసుకెళ్లి కూర్చోబెట్టగా చాలా సేపటికి గానీ ఆయన మామూలు మనిషి కాలేకపోయారు. ఈ వ్యవహారంపై నాడే పోలీసులు కేసులు నమోదు చేసినా.. విచారణ మాత్రం జరగలేదనే చెప్పాలి. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఎలా వ్యవహరించారో… బాబు ఇంటిపై దాడి యత్నంపైనా అదే రీతిన స్పందించారు.

తాజాగా 10 నెలల క్రితం టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసుల బూజును పోలీసులు దులిపేశారు. బాబు ఇంటిపై దాడికి యత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేశ్ ను సీఐడీ పోలీసులు ఇప్పటికే మూడు పర్యాయాలు విచారించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేయాలంటే అందుకు జోగి రమేశ్ ససేమిరా అన్నారు. పలు కారణాలు చెబుతూ ఆయన తన ఫోన్ ను పోలీసులకు సమర్పించలేదు.

తాజాగా ఇదే కేసులో ఈ నెల 11న మరోమారు విచారణకు రావాలంటూ బుధవారం సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరి ఈ సారైనా పోలీసులు అడిగినట్లుగా జోగి రమేశ్ తన ఫోన్ ను వారికి స్వాధీనం చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జోగి రమేశ్ ఫోన్ తమ చేతికి చిక్కితే.. బాబు ఇంటిపైకి దాడికి పురిగొల్పిన వారు ఎవరన్న విషయం ఇట్టే తేలిపోతుందన్నది పోలీసుల భావన. మరి ఈ చిక్కుముడిని పోలీసులు ఈ దఫా అయినా విప్పుతారో, లేదో చూడాలి.

This post was last modified on April 9, 2025 7:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: jogi ramesh

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago