2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో.. విభజన చట్టంలోని చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉండి పోయాయి. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రానికి పలు రూపాల్లో విన్నపాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్టకేలకు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది.
ముఖ్యంగా విభజన చట్టం-2014లోని షెడ్యూల్ 9, 10లలోని సంస్థలు, ఆస్తుల విభజనపై కేంద్రం దృష్టి పెట్టింది. అదేసమయంలో ఉమ్మడి ప్రాజెక్టుల పూర్తికి కూడా.. ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో వడి వడిగానే ఈ సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత రెండు మాసాల్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సైతం ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షిస్తూనే.. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతూ.. తాజాగా కేంద్ర హోం శాఖ నోట్ విడుదల చేసింది. షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం అత్యంత కీలకంగా మారింది. అదేవిధంగా షెడ్యూల్ 10లోని సంస్థల విభజన(ఆర్టీసీ సహా ఇతర సంస్థలు)ను వేగంగా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే.. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రం పరిశీలిస్తోంది.
అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధుల విషయంపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోం ది. ఈ క్రమంలో ఏపీకి 350 కోట్లు, తెలంగాణకు 270 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా త్వరలోనే మార్గం సుగమం కానుందని అధికార వర్గాలు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. సుదీర్ఘ విరామంతర్వాత.. రెండు రాష్ట్రాల విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం రెడీ అయింది.
This post was last modified on April 9, 2025 2:24 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ…
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు…
వైసీపీ అధినేత జగన్కు ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…
భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…