Political News

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో.. విభ‌జ‌న చ‌ట్టంలోని చాలా స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగానే ఉండి పోయాయి. అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ‌ప్ర‌భుత్వాలు కూడా కేంద్రానికి ప‌లు రూపాల్లో విన్న‌పాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్ట‌కేల‌కు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టింది.

ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం-2014లోని షెడ్యూల్ 9, 10ల‌లోని సంస్థ‌లు, ఆస్తుల విభ‌జ‌న‌పై కేంద్రం దృష్టి పెట్టింది. అదేస‌మ‌యంలో ఉమ్మడి ప్రాజెక్టుల పూర్తికి కూడా.. ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దీంతో వ‌డి వ‌డిగానే ఈ స‌మ‌స్య‌లు కొంత‌వ‌ర‌కైనా పరిష్కారం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. గ‌త రెండు మాసాల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షిస్తూనే.. విభ‌జ‌న చ‌ట్టంలోని అప‌రిష్కృత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కేంద్రాన్ని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెడుతూ.. తాజాగా కేంద్ర హోం శాఖ నోట్ విడుద‌ల చేసింది. షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం అత్యంత కీల‌కంగా మారింది. అదేవిధంగా షెడ్యూల్ 10లోని సంస్థల విభజన(ఆర్టీసీ స‌హా ఇత‌ర సంస్థ‌లు)ను వేగంగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. అలాగే.. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రం ప‌రిశీలిస్తోంది.

అదేవిధంగా వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఇచ్చే నిధుల విష‌యంపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోం ది. ఈ క్ర‌మంలో ఏపీకి 350 కోట్లు, తెలంగాణ‌కు 270 కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌నుంది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి, కడ‌ప‌లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా త్వ‌ర‌లోనే మార్గం సుగ‌మం కానుంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. సుదీర్ఘ విరామంత‌ర్వాత‌.. రెండు రాష్ట్రాల విభ‌జ‌న చ‌ట్టంలోని అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్రం రెడీ అయింది.

This post was last modified on April 9, 2025 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

1 hour ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

4 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago