Political News

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో.. విభ‌జ‌న చ‌ట్టంలోని చాలా స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగానే ఉండి పోయాయి. అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ‌ప్ర‌భుత్వాలు కూడా కేంద్రానికి ప‌లు రూపాల్లో విన్న‌పాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్ట‌కేల‌కు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టింది.

ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం-2014లోని షెడ్యూల్ 9, 10ల‌లోని సంస్థ‌లు, ఆస్తుల విభ‌జ‌న‌పై కేంద్రం దృష్టి పెట్టింది. అదేస‌మ‌యంలో ఉమ్మడి ప్రాజెక్టుల పూర్తికి కూడా.. ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దీంతో వ‌డి వ‌డిగానే ఈ స‌మ‌స్య‌లు కొంత‌వ‌ర‌కైనా పరిష్కారం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. గ‌త రెండు మాసాల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఆయా రాష్ట్రాల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షిస్తూనే.. విభ‌జ‌న చ‌ట్టంలోని అప‌రిష్కృత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కేంద్రాన్ని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెడుతూ.. తాజాగా కేంద్ర హోం శాఖ నోట్ విడుద‌ల చేసింది. షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం అత్యంత కీల‌కంగా మారింది. అదేవిధంగా షెడ్యూల్ 10లోని సంస్థల విభజన(ఆర్టీసీ స‌హా ఇత‌ర సంస్థ‌లు)ను వేగంగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. అలాగే.. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రం ప‌రిశీలిస్తోంది.

అదేవిధంగా వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఇచ్చే నిధుల విష‌యంపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోం ది. ఈ క్ర‌మంలో ఏపీకి 350 కోట్లు, తెలంగాణ‌కు 270 కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌నుంది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి, కడ‌ప‌లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా త్వ‌ర‌లోనే మార్గం సుగ‌మం కానుంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. సుదీర్ఘ విరామంత‌ర్వాత‌.. రెండు రాష్ట్రాల విభ‌జ‌న చ‌ట్టంలోని అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్రం రెడీ అయింది.

This post was last modified on April 9, 2025 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 minute ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago