వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారంతో ఆయనకు గతంలో విధించిన రిమాండ్ గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆయనను బుధవారం.. విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. రిమాండ్ పొడిగించింది.
దీంతో మరో 14 రోజుల వరకు.. వంశీ జైల్లోనే ఉండనున్నారు. కృష్నాజిల్లా గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై 2021-22 మధ్య దాడి జరిగింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. అదేవిధంగారూ.లక్షలు విలువ చేసే ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. దీనిపై టీడీపీ కార్యకర్త సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు.. వైసీపీ నాయకులు, ముఖ్యంగా వంశీ అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే.. ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ను అపహరించి.. బెదిరించారని మరో కేసు నమోదైంది.
దీనిపైనా కేసులు నమోదయ్యాయి. సత్య వర్థన్ కేసులోనే ప్రస్తుతం వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంత లో గన్నవరం కేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. తాజాగా ఈ కేసులో గత నెలలో 14 రోజుల రిమాండ్ పడింది. వంశీతోపాటు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరులు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వీరికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ.. సీఐడీ కోర్టు తీర్పు చెప్పింది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…