ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రాజధాని అమరావతిని నేరుగా హైదరాబాద్తో లింకు చేస్తే.. పెట్టుబడులు, వ్యాపార వేత్తలు రాజధానికి క్యూ కట్టే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు తలపోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అమరావతి-హైదరాబద్’ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలన్నది చంద్రబాబు ఉద్దేశం.
అయితే.. ఈ ప్రాజెక్టును రాష్ట్రపరిధిలో కాకుండా.. జాతీయస్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై రూపొందించి ప్రాజెక్టు నమూనాకు.. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు.. చంద్రబాబు వివరించారు. అయితే.. ఇది జరిగి ఆరు మాసాలు కూడా జరిగిపోయింది. అయితే.. తాజాగా దీనిపై భారీ కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన కేంద్ర హోం శాఖ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ మేరకు జాతీయ రహదారుల శాఖకు కేంద్ర హోం శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అంతేకాదు.. ఈ రహదారిలో అటవీ భూమి కూడా ఉండడంతో దీనిని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని.. సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇదిజరిగితే.. అమరావతి-హైదరాబాద్ మధ్య నేరుగా కనెక్టివిటీ ఏర్పడడంతోపాటు.. సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు విజయవాడ లేదా.. గుంటూరు మీదుగా నడికుడి, మిర్యాల గూడల మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే.. తాజా గ్రీన్ఫీల్డ్ రాకతో.. అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్కు మార్గం ఏర్పడనుంది. తద్వారా 90 కిలో మీటర్ల దూరం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…