Political News

సోము క‌న్నా.. క‌న్నానే బెట‌ర్‌..

ఏ పార్టీలో అయినా.. నాయ‌కుడు మారితే.. విధానం మారుతుంది. అదే స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర నేత‌ల్లోనూ మార్పులు వ‌స్తాయి. నాయ‌కుడిని బ‌ట్టి.. పార్టీ స్వ‌రూపం కూడా మారిపోతుంది. మ‌రీ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఇలాంటి మార్పుల కోస‌మే.. రాష్ట్రాల్లో అధ్య‌క్షుల‌ను మారుస్తూ ఉంటాయి. మ‌రింత ఉన్న‌తంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తార‌ని, పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తార‌ని నాయ‌కుల‌పై ఆశ‌లు పెట్టుకుంటాయి. కానీ, ఏపీ విష‌యంలో బీజేపీ ఆశించింది ఒక‌టైతే.. జ‌రుగుతున్న‌ది మ‌రొక‌ట‌నే వ్యాఖ్య‌లు అప్పుడే వినిపించ‌డం ఆస‌క్తిగా మారింది. దీనిపై ఇప్ప‌టికే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు సైతం దృష్టి పెట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ నేత‌ల‌ను ప‌ల‌క‌రిస్తే.. గ‌తంలో బీజేపీని న‌డిపించిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వాస‌న‌లు ఇంకా వ‌దల‌లేద‌ని అంటున్నారు. అంటే.. వారి ఉద్దేశం.. చెడు అని కాదు.. సోము వీర్రాజు వంటి ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయ‌కుడు ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఏదో భారీ మార్పును ఆశించిన కీల‌క నేత‌ల‌కు ఆ మార్పు క‌నిపించ‌క‌పోవ‌డ‌మే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. సోము వీర్రాజు క‌న్నా.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణే బాగా ప‌నిచేశార‌నే వాద‌న వినిపిస్తుండ‌డానికి వారు కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఓ సీనియ‌ర్ నాయ‌కుడు ఢిల్లీలో ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల‌తో మాట్లాడారు.

పార్టీలో మార్పు జ‌రిగిందంటే.. ఏదో ఆశిస్తున్నార‌నే విష‌యం వాస్త‌వం. ఏపీ విష‌యంలో అలాంటి మార్పు ఇంకా రాలేదుఅని ఆయ‌న చెప్పుకొచ్చారు. గ‌తంలో క‌న్నా ఉన్న‌ప్పుడు అంద‌రూ స్వేచ్ఛ‌గా మీడియా ముందుకు వ‌చ్చేవారు. బీజేపీ లైన్ ప్ర‌కారం మాట్లాడేవారు. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసేవారు. ఇక‌, క‌న్నా అయితే. నిత్యం ఎక్క‌డో ఒక చోట క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న పెట్టుకునేవారు. స‌ర్కారు త‌ప్పుల‌ను ఎత్తి చూపించేవారు. విమ‌ర్శ‌లు గుప్పించేవారు. మ‌రీ ముఖ్యంగా ఇసుక విధానం, పోల‌వ‌రం నిర్మాణం ఆగిపోవ‌డం, రాజ‌ధాని అమ‌రావ‌తి త‌ర‌లింపు, రైత‌లుకు న్యాయం చేయాల‌నే డిమాండ్ల‌ను ఆయ‌న బాగానే వినిపించారు.

కానీ, సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఈత‌ర‌హా విధానాల‌కు స్వ‌స్తి చెప్పిన‌ట్టు బీజేపీలోనే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా ఆయ‌న వ‌చ్చిన వెంట‌నే మీడియాతో మాట్లాడే సొంత పార్టీ నేత‌ల‌పై వేట్లు వేయ‌డం ప్రారంభించారు. పోనీ.. వివాదాస్ప‌ద నేత‌ల‌కు ముకుతాళ్లు వేస్తున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి హోదా లో ఉన్న విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి మ‌హిళల చీర‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అధ్య‌క్షుడుగా ఉన్న సోము.. ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో ఇది కేంద్రంలోని పెద్దల వ‌ర‌కు వెళ్లింది.
అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన ఆయ‌న ప్ర‌తిప‌క్షాన్ని ఏకేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో బీజేపీ పుంజుకుంటుందా? అనే సీనియ‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే క‌న్నానే బెట‌ర్ అనే వ్యాఖ్య‌లు బ‌ల‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి సోము మార‌తారా? లేదా? చూడాలి.

This post was last modified on November 1, 2020 9:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

28 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

3 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago