నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు. కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణీల సమక్షంలో మనవడు నారా దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 8.51 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని చంద్రబాబు దంపతులు పూర్తి చేశారు.
అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే చంద్రబాబు ఫ్యామిలీ ఓటర్లుగా నమోదు అయ్యింది. అయితే ఇప్పటిదాకా వారికి సొంతిల్లు లేదు. ఉండవల్లిలోని కరకట్టను ఆనుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి కూతవేటు దూరంలోని మరో ఇంటిలో మంత్రి నారా లోకేశ్ నివాసం ఉంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు ఫ్యామిలీ తీర్మానించుకుంది. ఇందుకోసం అమరావతిలోని పాలనా కేంద్రం సచివాలయానికి అత్యంత సమీపంలో సచివాలయం వెనుకాల వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ9 రహదారిని ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు గతేడాది చివరలో కొనుగోలు చేశారు.
తన పేరిట కొనుగోలు చేసిన ఈ భూమిలోనే ఇప్పుడు చంద్రబాబు తన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ 5 ఎకరాల విశాల విస్తీర్ణంలో చంద్రబాబు నివాసంతో పాటుగా పక్కనే అధికారులతో సమావేశం కోసం కాన్ఫరెన్స్ హాలు, పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. జీ ప్లస్ వన్ మోడల్ లో ఇంటిని నిర్మించుకుంటున్న చంద్రబాబు.. భవిష్యత్తు అవసరావలకు అనుగుణంగా తన ఇంటిని ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం. కేవలం ఏడాదిన్నరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్న దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంటి ప్లాన్ తో పాటు, పరిసరాలను శుభ్రం చేసే పనులు వేగంగా ముగిశాయి. ఇక గురువారం నుంచే చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా సాగనున్నాయి.
This post was last modified on April 9, 2025 12:39 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…