నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు. కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణీల సమక్షంలో మనవడు నారా దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 8.51 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని చంద్రబాబు దంపతులు పూర్తి చేశారు.
అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే చంద్రబాబు ఫ్యామిలీ ఓటర్లుగా నమోదు అయ్యింది. అయితే ఇప్పటిదాకా వారికి సొంతిల్లు లేదు. ఉండవల్లిలోని కరకట్టను ఆనుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి కూతవేటు దూరంలోని మరో ఇంటిలో మంత్రి నారా లోకేశ్ నివాసం ఉంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు ఫ్యామిలీ తీర్మానించుకుంది. ఇందుకోసం అమరావతిలోని పాలనా కేంద్రం సచివాలయానికి అత్యంత సమీపంలో సచివాలయం వెనుకాల వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ9 రహదారిని ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు గతేడాది చివరలో కొనుగోలు చేశారు.
తన పేరిట కొనుగోలు చేసిన ఈ భూమిలోనే ఇప్పుడు చంద్రబాబు తన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ 5 ఎకరాల విశాల విస్తీర్ణంలో చంద్రబాబు నివాసంతో పాటుగా పక్కనే అధికారులతో సమావేశం కోసం కాన్ఫరెన్స్ హాలు, పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. జీ ప్లస్ వన్ మోడల్ లో ఇంటిని నిర్మించుకుంటున్న చంద్రబాబు.. భవిష్యత్తు అవసరావలకు అనుగుణంగా తన ఇంటిని ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం. కేవలం ఏడాదిన్నరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్న దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంటి ప్లాన్ తో పాటు, పరిసరాలను శుభ్రం చేసే పనులు వేగంగా ముగిశాయి. ఇక గురువారం నుంచే చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా సాగనున్నాయి.
This post was last modified on April 9, 2025 12:39 pm
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…