Political News

చంద్ర‌బాబు ‘డిజిట‌ల్’ పాల‌న షురూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రంలో పాల‌న‌ను డిటిజ‌ల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్ప‌టికే వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా.. చేసిన ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. ఈ మాధ్య‌మం ఇప్పుడు అంద‌రికీ చేరువ అయిన విష‌యం తెలిసిందే. తెల్ల‌వారి లేచింది మొద‌లు రాత్రినిద్ర‌పోయే వ‌ర‌కు కూడా.. వాట్సాప్‌తోనే ప్ర‌జ‌ల జీవితాలు అనుసంధాన‌మై ఉంటున్నాయి. దీనిని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు.. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను తీసుకువ‌చ్చారు. సుమారు 502 ర‌కాల కార్య‌క్ర‌మాల‌ను దీని ద్వారా అమ‌లు చేస్తున్నారు.

అంతేకాదు.. ప్ర‌తి నెలా దీనిపై రివ్యూ చేస్తున్నారు. ఫ‌లితాన్ని ప‌రిశీలించుకుని.. మార్పులు, చేర్పుల దిశ‌గా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ ప‌రంప‌రలో తాజాగా.. కీల‌క‌మైన రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను కూడా.. డిజిట‌లీక‌ర‌ణ చేశారు. దీనికి బుధ‌వారం(ఈ రోజు) శ్రీకారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్తిరాస్తుల రిజిస్ట్రేష‌న్, వివాహాలు.. ఇత‌ర అంశాల రిజిస్ట్రేష‌న్ కోసం.. ఆయా జిల్లాల్లోని రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. అంతేకాదు.. మ‌ధ్య‌వ‌ర్తులు, బ్రోక‌ర్లు వంటి వారిప్ర‌మేయాన్ని ఎంత త‌గ్గించాల‌ని చూసిన త‌గ్గ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో రిజిస్ట్రేష‌న్ల వ్య‌వ‌స్థ‌ను డిజిటలీక‌రించే ప్ర‌క్రియ‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. బుధ‌వారం నుంచి 22 రిజిస్ట్రేష‌న్ల కార్యాల‌యాల్లో దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభిస్తారు. అనంత‌రం.. వ‌చ్చే నెల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 కేంద్రాల్లో పూర్తిగా డిజిట‌ల్ విధానంలోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ద‌ళారుల నుంచి ఇబ్బందులు, అధికారుల నుంచి లంచాల బెడ‌ద వంటివి త‌ప్ప‌డంతోపాటు.. ప్ర‌క్రియ సులువు కానుంది.

ఏం చేస్తారు?

  • రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ‌ను డిజిట‌లీక‌ర‌ణ చేయ‌డం ద్వారా.. ఇంట్లో కూర్చునే సిస్టం ద్వారా.. స‌ద‌రు ప‌త్రాల‌ను నింపుకోవ‌చ్చు.
  • అదేవిధంగా రుసుములు, చార్జీల‌ను ఆన్‌లైన్‌లో చెల్లించ‌వ‌చ్చు.
  • అలానే రిజిస్ట్రేష‌న్ కోసం.. మ‌న‌కు న‌చ్చిన స‌మ‌యాన్ని ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఆ స‌మ‌యానికి రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యానికి వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చు.
  • ఏదైనా అవ‌సరం అయిన ప‌క్షంలో రిజిస్ట్రేష‌న్ల సైట్‌లోనే హెల్ప్ అవ‌కాశం ఉంటుంది. దీనిని వినియోగించుకుని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంటుంది.
  • ఏపీలో నేటినుంచి అమ‌ల్లోకి రానున్న ఈ ప్ర‌క్రియ దేశంలోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 9, 2025 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

1 hour ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

4 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

8 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

8 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago