ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఈ మాధ్యమం ఇప్పుడు అందరికీ చేరువ అయిన విషయం తెలిసిందే. తెల్లవారి లేచింది మొదలు రాత్రినిద్రపోయే వరకు కూడా.. వాట్సాప్తోనే ప్రజల జీవితాలు అనుసంధానమై ఉంటున్నాయి. దీనిని పసిగట్టిన చంద్రబాబు.. వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకువచ్చారు. సుమారు 502 రకాల కార్యక్రమాలను దీని ద్వారా అమలు చేస్తున్నారు.
అంతేకాదు.. ప్రతి నెలా దీనిపై రివ్యూ చేస్తున్నారు. ఫలితాన్ని పరిశీలించుకుని.. మార్పులు, చేర్పుల దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ పరంపరలో తాజాగా.. కీలకమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా.. డిజిటలీకరణ చేశారు. దీనికి బుధవారం(ఈ రోజు) శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు స్తిరాస్తుల రిజిస్ట్రేషన్, వివాహాలు.. ఇతర అంశాల రిజిస్ట్రేషన్ కోసం.. ఆయా జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంతేకాదు.. మధ్యవర్తులు, బ్రోకర్లు వంటి వారిప్రమేయాన్ని ఎంత తగ్గించాలని చూసిన తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థను డిజిటలీకరించే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి 22 రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. అనంతరం.. వచ్చే నెల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 కేంద్రాల్లో పూర్తిగా డిజిటల్ విధానంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. తద్వారా.. ప్రజలకు దళారుల నుంచి ఇబ్బందులు, అధికారుల నుంచి లంచాల బెడద వంటివి తప్పడంతోపాటు.. ప్రక్రియ సులువు కానుంది.
ఏం చేస్తారు?
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…