తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు చేరడం, తెలంగాణ శాసన సభ స్పీకర్ కు సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించడం చర్చనీయాంశమైంది. ఎప్పటి లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రీం కోర్టు ప్రశ్నించడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే తాజాగా కడియం శ్రీహరిపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాను కేసీఆర్ కు విశ్వాసమైన కుక్కలా ఉంటానని, కానీ, అధికారం కోసం పార్టీ మారే కడియం శ్రీహరి వంటి గుంట నక్క కాదని విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంట నక్క అంటూ పల్లా దుయ్యబట్టారు. తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని పల్లా చెప్పారు.
కేసీఆర్ చేసిన పనులను తామే చేశామని చెప్పుకునేందుకు కడియం శ్రీహరికి సిగ్గుండాలని పల్లా విమర్శించారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి కడియం అడ్డుపడ్డారని, 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కూడా ఆపారని ఆరోపించారు.
అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజేశ్వర్ రెడ్డి చౌకబారు విమర్శలు మానుకోవాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బొచ్చు కుక్క అంటూ మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకోవాలని కడియం షాకింగ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ తో ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించింది పల్లా అని, కేసీఆర్ ను అడ్డుపెట్టుకొని ఆస్తులు సంపాదించుకున్నదెవరో ప్రజలకు తెలుసని పల్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…