Political News

బిగ్ బ్రేకింగ్… గ్యాస్ బండపై రూ.50 పెంపు

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సిలిండర్ పై రూ.50 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు సబ్సీడీ గ్యాస్ కనెక్షన్లతో పాటుగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు, చివరాఖరుకు ఉజ్వల పథకం కింద అందిస్తున్న సిలిండర్లకూ వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ పెరిగిన ధరలను మంగళవారం నుంచే అమలులోకి రానున్నట్లుగా కూడా కేంద్రం ప్రకటించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వంట గ్యాస్ ధరలు పెరిగిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే… పెట్రోెల్, డీజిల్ పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్రం 2 శాతం మేర పెంచింది. ఈ పెంపుతో పెట్రోల్ పై లీటరుకు రూ.13, డీజిల్ పై లీటరుకు రూ.10 మేర ఎక్సైజ్ సుంకం చేరింది. ఎక్సైజ్ సుంకాన్ని 2 శాతం పెంచినా కూడా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వినియోగదారులపై ఎలాంటి భారం మోపడం లేదని కేంద్రం ప్రకటించింది. పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని చమురు కంపెనీలే భరిస్తాయని, ఈ కారణంగా ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం ప్రకటించింది. పెంచిన ఎక్సైజ్ సుంకాలు సోమవారం అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.

వంట గ్యాస్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం .. పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచకపోవడం గమనార్హం. ఇదే విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఓ సుదీర్ఘ వివరణను ఇచ్చారు. వంట గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న తాము… ఎక్సైజ్ సుంకాలను పెంచినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచలేదని ఆయన ప్రకటించారు. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కూడా ఆయన ప్రకటించారు. గ్యాస్ ధరలు పెంచినట్లే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు.

This post was last modified on April 7, 2025 5:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

1 hour ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

1 hour ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

2 hours ago

బ్రేకింగ్ : CSK కెప్టెన్ గా ధోనీ.. ఎందుకంటే..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…

2 hours ago

ఏపీలో నోటికి పని చెప్పడం ఇకపై కుదరదు

నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…

3 hours ago

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…

3 hours ago