Political News

బాబు భద్రతపై ఇంత నిర్లక్ష్యమా?.. ఏం జరుగుతోంది?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలో అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే దక్కుతున్న పటిస్ట భద్రతా వలయంలో కొనసాగుతున్నారు. దాదాపుగా దేశ ప్రధానికి అందుతున్న భద్రతా వలయానికి కాస్త అటూ ఇటూగా చంద్రబాబుకు భద్రత కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పటిష్ట భద్రతలోనూ లోపాలు కనిపిస్తున్న తీరు నిజంగానే ఆందోళనకు గురి చేసేదే. ఈ భద్రతా వలయంలో ఉన్న నేతలు ఎక్కడికి వెళ్లినా.. ఆయా ప్రాంతాల్లో సదరు నేతలను కలిసే వారిని ముందుగానే గుర్తిస్తారు. ఎంపిక చేస్తారు. వారికి పాసులు అందజేస్తారు. ఆయా కార్యక్రమాల్లో పాలుపంచుకునే వారికి కూడా పాసులు అందజేస్తారు. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని చందర్లపాడు మండలం ముప్పాళ్లలో జరిగిన చంద్రబాబు పర్యటనలో ఏకంగా మూడు లోపాలు చోటుచేసుకున్నాయి.

సాధారణంగా చంద్రబాబు ఎంపిక చేసిన ప్రదేశానికి హెలికాఫ్టర్ ద్వారా చేరుకోగా… హెలిప్యాడ్ వద్దకు ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతిస్తారు. అయితే ముప్పాళ్ల బాబు టూర్ లో హెలిప్యాడ్ పలువురు టీడీపీ నేతలతో పాటు ఓ వైసీపీ నేత కూడా కనిపించారు. హెలిప్యాడ్ వద్దకు వచ్చిన ఆ వైసీపీ నేత… టీడీపీ నేతలతో కలిసి వరుసలో నిలుచుని…బాబుకు పుష్పగుచ్ఛం అందించడంతో పాటుగా చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికే వారి జాబితాలోనే లేని సదరు నేత హెలిప్యాడ్ దాకా ఎలా రాగలిగారన్నది ఇప్పుడు అంతుబట్టడం లేదు. ఆహ్వానితుల జాబితాలో లేని వ్యక్తి కేంద్ర బలగాల భద్రతను దాటుకుని మరీ చంద్రబాబు దగ్గరికి చేరుకోవడం, ఆపై చంద్రబాబుకు స్వాగతం పలకడం, అంతటితో ఆగకుండా చంద్రబాబుకు పాదాభివందనం చేశారంటే… ఇది భద్రతా అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించక తప్పదు.

ఇక వైసీపీకి చెందిన ముఖ్య నేత వద్ద పనిచేసే వ్యక్తి ఒకరు ముప్పాళ్ల టూర్ లో ఆద్యంతం చంద్రబాబును అనుసరించారట. హెలిప్యాడ్, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద కూడా ఆ వ్యక్తి సంచరించినట్లుగా తెలుస్తోంది. సంచరించడం తోనే సరిపెట్టని సదరు వ్యక్తి ఏకంగా హెలిప్యాడ్ వద్ద, ప్రజా వేదిక వద్ద చంద్రబాబును వీడియోలు తీసి.. వాటిని ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారట. ఇక ప్రజా వేదిక ముందు ఎవరెవరు ఉండాలన్న విషయంపై ఒకింత జాగ్రత్తగానే వ్యవహరించిన అధికారులు… ప్రజా వేదిక వెనకాల కుర్చీలు వేసి ఉండగా.. వాటిలో ఆసీనులు అయిన వారు ఎవరన్న దానిని అస్సలు పట్టించుకోలేదట. ఈ వైఫల్యాలన్నీ టూర్ ముగిసిన తర్వాత వెలుగులోకి రాగా… భద్రతా అదికారులు తాపీగా వాటిపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఈ తరహా భద్రతా వైఫల్యాలు బాబు సెక్యూరిటీని ప్రశ్నార్థకం చేసేవేనని చెప్పక తప్పదు.

This post was last modified on April 7, 2025 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

1 hour ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

3 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

3 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

3 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

3 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

3 hours ago