తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవాలకు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్(అప్పటి టీఆర్ ఎస్) పెట్టి.. 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించాలని పార్టీ భావించిం ది. పోరాటాల పురిటి గడ్డ వరంగల్లును వేదికగా నిర్ణయించుకుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. పార్టీ శ్రేణులు డీలా పడిన విషయం తెలిసిందే. ఇక, జంపింగుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో పార్టీని మళ్లీ పుంజుకునేలా చేయాలన్నది బీఆర్ ఎస్ నిర్ణయం.
ఈ క్రమంలోనే ఈ నెల 27న బీఆర్ ఎస్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను నింగి-నేల తాకేట్టుగా నిర్వహించాలని నిర్ణయించారు. దీని నిర్వహణకు ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిదిలో నాలుగు కమిటీలు కూడా వేశారు. మరోవైపు.. మాజీ సీఎం బీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారానే.. తిరిగి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. గత ఓటమి తర్వాత.. ఇప్పటి వరకు ఒకటి రెండుసార్లు మాత్రమే ఆయన బయటకు వచ్చారు. ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వెళ్లారు. ఈ నేపథ్యం లో పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యాచరణను కూడా ప్రకటించి.. తాను ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. నిర్ణయం తీసుకున్నంత తేలికగా.. ఏర్పాట్లు చేసినంత వేగంగా.. ప్రభుత్వం నుంచి సహకారం అయితే లభించడం లేదు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీసు యాక్టును అమలు చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. పోలీసు యాక్ట్ 30 అమల్లోకి వచ్చినట్టు బోర్డులు పెట్టారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని చెబుతున్నారు. మరోవైపు.. బీఆర్ ఎస్ మాత్రం పోలీసు అదికారులకు సభపై విన్నపాలు పెట్టుకుంది. కానీ, రోజులు గడుస్తున్నా.. వారి నుంచి ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సాధ్యమైనంత వేగంగా కోర్టును ఆశ్రయించి.. అనుమతులు తెచ్చుకునే దిశగా బీఆర్ ఎస్ అడుగులు వేస్తోంది. మరి న్యాయస్థానం ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on April 7, 2025 7:34 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…